ప్రభుత్వం పిల్లిమొగ్గ
ఓపీఎస్పై స్పష్టమైన హామీ లేనిదే ప్రభుత్వంతో చర్చలకు హాజరు కాబోమని వివిధ ఉద్యోగసంఘాలు స్పష్టం చేయడంతో.. ప్రభుత్వం పిల్లిమొగ్గ వేసింది.
తొలుత సీపీఎస్పై సమావేశమని.. ఆ తరువాత ఉద్యోగుల సమస్యలపై అంటూ సంఘాల నేతలకు ఆహ్వానం
ఓపీఎస్ అమలుపై స్పష్టత ఇస్తేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు
సీఎంతో మాట్లాడాక ప్రత్యేక సమావేశం పెడతామన్న మంత్రులు
ఈనాడు, అమరావతి: ఓపీఎస్పై స్పష్టమైన హామీ లేనిదే ప్రభుత్వంతో చర్చలకు హాజరు కాబోమని వివిధ ఉద్యోగసంఘాలు స్పష్టం చేయడంతో.. ప్రభుత్వం పిల్లిమొగ్గ వేసింది. సీపీఎస్పై ఏర్పాటుచేసిన సమావేశాన్ని.. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్దేశించినదిగా మార్చేసింది. సీపీఎస్పై చర్చించేందుకే సమావేశమని 21 ఉద్యోగసంఘాల నేతలకు తొలుత సమాచారం పంపిన ప్రభుత్వం.. తర్వాత సమాచార లోపంతోనే అలా జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఉద్యోగసంఘాల నేతలకు ఫోన్ చేసి ఉద్యోగుల సమస్యలపైనే చర్చిద్దామని పిలిచింది. సమావేశ వేదికనూ ఆర్థికశాఖ కార్యాలయం నుంచి సచివాలయానికి మార్చింది. దీంతో సీపీఎస్ ఉద్యోగుల సంఘం (సీపీఎస్యూఎస్), సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్ఈఏ), ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) మినహా మిగిలిన సంఘాలు హాజరయ్యాయి. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి పాల్గొని ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. సీఎంతో మాట్లాడిన తర్వాత సీపీఎస్పై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపైనా ఏ విషయంలోనూ మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం, చేద్దాం, సీఎంతో చర్చించి చెబుతామనే వైఖరిలోనే సాగిందని కొందరు నాయకులు పేర్కొన్నారు. బిల్లులు నెలలోపు చెల్లిస్తామనే విషయంలోనూ స్పష్టత లేదని చెప్పారు.
బకాయిల్లో కొంత సంక్రాంతి లోపు చెల్లిస్తాం
ఉద్యోగులకు 2018 నుంచి చెల్లించాల్సిన బకాయిల్లో కొంత మొత్తాన్ని సంక్రాంతిలోపు చెల్లిస్తామని, మిగతా వాటిని మార్చిలోపు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చినట్లు ఉద్యోగసంఘాల నేతలు విలేకరులకు చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలపై అధికారులతో గురువారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అంగీకారం తెలిపారని వివరించారు.
కొన్నింటికి న్యాయ వివాదాలున్నాయి: మంత్రి బొత్స
‘సీపీఎస్ అంశంపై సమావేశం ఉంటుందని చెప్పడం సమాచార లోపమే. నాలుగురోజుల నుంచి కొన్ని సమస్యలపై చర్చించాలని నాయకులు కోరడంతోనే ఈ సమావేేశం నిర్వహించాం. సీపీఎస్పై మరో సమావేశం నిర్వహిస్తాం. చర్చలపై ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నాం. బోధన సిబ్బందికి పదవీవిరమణ వయస్సును 62ఏళ్లకు పెంచడంపై గతంలో సీఎం హామీ ఇచ్చారు. ఇది అమలుచేస్తాం. మిగతా వాటిలో న్యాయ వివాదాలున్నాయి. పరిష్కరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం.’
ఉద్యోగుల సమస్యలపై అని చెప్పడంతోనే హాజరయ్యాం
ప్రతినెలా జీతాలు, పింఛన్లు ఒకటో తేదీన గత కొంతకాలంగా రాకపోవడం బాధాకరమని ఉద్యోగసంఘాల నేతలు పేర్కొన్నారు. ‘అధికారులు ఫోన్ చేసి ఉద్యోగుల సమస్యలపై చర్చ జరుగుతుందని చెప్పడంతోనే హాజరయ్యాం. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోరాం. ఉద్యోగుల పీఆర్సీ పేస్కేళ్లను శాఖాధిపతుల కార్యాలయాలకు పంపాలని చెప్పాం. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత బలోపేతం చేసేలా ఆస్పత్రుల యాజమాన్యాలు, ఉద్యోగులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు’ అని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్రావు తదితరులు పేర్కొన్నారు. ‘ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చించాం. పొరుగుసేవల ఉద్యోగులు 17మంది తొలగింపు అధికారులు అనుకోకుండా చేసిన తప్పని.. ఎవర్నీ తొలగించబోమని చెప్పారు. ముఖ అధారిత హాజరుపై అధికారులు ఒకలా.. మంత్రులు మరోలా చెప్పారు. హాజరు నమోదు కాకపోతే జీతంలో కోత పెడతామని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతుండగా.. మంత్రివర్గ ఉపసంఘం మాత్రం కోత లేదని, హాజరు కోసమే అంటున్నారు. ఓపీఎస్ అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశాం. డీఎస్సీ-2003కి ఎంపికైన వారికి పాత పింఛను అమలుచేయాలని కోరాం’ అని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి, ఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్, తిమ్మన్న తదితరులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కొందరు ఉన్నతాధికారులు వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి మేలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి... ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ కూడా వైకాపాకు మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. -
ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?
ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. -
పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. -
జగనన్న వస్తున్నారు... మిద్దెలపైకి నోఎంట్రీ!
సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు
రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులు.. ‘ఎదిరిస్తే హత్యలు’
వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు.. రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు... అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్ డెలివరీలు... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రికార్డు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాజధాని గ్రామాల్లో భూసేకరణ ప్రకటన ఉపసంహరణ తగదు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. -
ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దెలు చెల్లించని సర్కారు
ఆరోగ్య ఉప కేంద్రాలకు గత ఆరేడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడంలేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధులు ఇవ్వడం లేదు. -
జగన్ పాలనలో హిందువులపై ముప్పేట దాడి
‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. -
అక్రమాల్లో బ‘కాసు’రుడు!
‘తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడమెలా?’ .. జగన్ను ఈ ప్రశ్న అడగాలని ప్రతిపక్షాలు సూచిస్తుంటాయి. తానూ తక్కువేం కాదంటున్నారో పల్నాడు ప్రజాప్రతినిధి. -
రాష్ట్రంలో ముస్లింలపై 107 సార్లు దాడులు
జగన్ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. -
అంకెల గారడీ.. ‘అగ్ర’ పేదలకు బురిడీ
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. -
నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం! -
సీఎం సభలో వడదెబ్బ.. వృద్ధుడి మృతి
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. -
మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట
మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. -
ఎమ్మార్ కేసులో డిశ్ఛార్జి పిటిషన్ల కొట్టివేత
ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య