రైతు భరోసాపై ఎన్ని మడతలో?
రాష్ట్రంలో 70లక్షల రైతు, కౌలు రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.8,750 కోట్లు అందించబోతున్నాం. దాదాపు 16 లక్షల కౌలు రైతులకు రైతు భరోసాను ఇస్తాం.
నాలుగేళ్లలో రూ.50 వేలిస్తామంటూ.. కోత పెట్టారు
42% నిధులు పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేవే
కౌలు రైతులనూ ఊరించి ఉసూరనిపించారు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో 70లక్షల రైతు, కౌలు రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.8,750 కోట్లు అందించబోతున్నాం. దాదాపు 16 లక్షల కౌలు రైతులకు రైతు భరోసాను ఇస్తాం. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఇదో రికార్డు.
2019 జులై 12న అసెంబ్లీలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటన
రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏడాదికి సగటున రూ.4వేల కోట్లే.. అంటే హామీ ఇచ్చిన మొత్తంలో సగమూ ఇవ్వడం లేదు. కౌలు రైతులకు ఏడాదికి సగటున లక్ష మందికి కూడా భరోసా దక్కడం లేదు. రాష్ట్రం ఇచ్చేది ఒక్కో రైతుకు ఏడాదికి రూ.7,500 మాత్రమే. మిగిలిన రూ.6వేలను కేంద్రమే నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తోంది. వాస్తవానికి వైకాపా అధికారంలోకి వచ్చే నాటికే పీఎం కిసాన్ అమల్లో ఉంది. దానితో కలిపి ఇస్తామని ఎన్నికల సమయంలో ఒక్కమాటా చెప్పలేదు.
ఏడాదికి ఒకేసారి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50వేలు రైతుల చేతిలో పెడతామని 2019 ఎన్నికల ముందు చెప్పిన జగన్మోహన్రెడ్డి.. తీరా సీఎం అయ్యాక.. ఏడాదికి రూ.7,500 చొప్పున రూ.37,500 మాత్రమే రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చి సరిపెడుతున్నారు. కేంద్రం ఏడాదికి ఇచ్చే రూ.6వేలను(మూడు విడతల్లో) కూడా తన ఖాతాలో వేసుకుని.. చెప్పిన దానికంటే మిన్నగా ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామంటూ ఏటా బటన్ నొక్కుతున్నారు. వాటిలోనూ ఈ ఏడాది మూడో విడత కింద సంక్రాంతికి ఇవ్వాల్సిన రూ.2వేలను ఇంకా విడుదల చేయలేదు. మొత్తంగా చూస్తే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఏటా రూ.8,750 కోట్లను ఇస్తుందంటూ ఘనంగా ప్రకటించిన ముఖ్యమంత్రి అందులో.. తమ ప్రభుత్వం సొంతగా సగమూ ఇవ్వలేకపోతోందనే అంశాన్ని కప్పి పెడుతున్నారు. 16లక్షల మంది కౌలు రైతులకూ రైతు భరోసాను వర్తింప జేస్తామన్న హామీపైనా జగన్మోహన్రెడ్డి నాలుక మడతేశారు. వారిని సామాజికవర్గాలుగా విభజించారు. 94% మందికి రిక్తహస్తం చూపారు.
సంక్రాంతి సొమ్ము ఏదీ?
కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.13,500 ఇస్తోంది. ఇందులో ఏటా సంక్రాంతికి ఒక్కో రైతుకు రూ.2వేలు ఇవ్వాలి. పీఎం కిసాన్కు ఈ-కేవైసీ చేయడంలో జాప్యంతో కేంద్రం ఇవ్వాల్సిన మూడో విడత సొమ్ము ఇంకా రైతుల ఖాతాల్లో పడలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం కౌలు రైతులకు నిధులు విడుదల చేయలేదు.
కౌలు రైతులకు ఒట్టి మాటలే!
ఏటా 16 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పినా.. తొలి మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా అందుకున్నవారు 2.68 లక్షల మందే. సగటున ఏడాదికి లక్ష మందైనా లేరు. మొత్తం కౌలుదారుల్లో సుమారు 6% మందికే సాయం దక్కుతోంది. అటవీ భూముల సాగుదారులు 85వేల మంది వరకు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు ఏడాదికి రూ.13,500 మొత్తం అందేది వీరికే.
* ఎన్నికల సమయంలో కౌలు రైతులందరినీ ఆదుకుంటామని చెప్పిన జగన్.. అధికారం చేపట్టాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికే రైతు భరోసా ఇస్తామన్నారు. కౌలు కార్డులు లేవంటూ 90% మందికిపైగా మొండి చేయి చూపిస్తున్నారు.
మూడేళ్లలో రూ.11,661 కోట్లే
రాష్ట్రంలో 70లక్షల రైతు, కౌలు రైతు కుటుంబాలకు సాయం చేస్తామన్నా.. లబ్ధిదారుల సంఖ్య గత మూడేళ్లలో ఎప్పుడూ 53 లక్షలకు మించలేదు. రాష్ట్రం తమ సొంత నిధుల నుంచి ఏడాదికి సగటున రూ.3,887 కోట్లు మాత్రమే ఇచ్చింది. మొత్తంగా మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చింది రూ.11,661 కోట్లు మాత్రమే. అందులో రూ.3,108 కోట్లు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నుంచే ఖర్చు చేశారు. మూడేళ్లలో రైతులకు ఇచ్చిన మొత్తం నిధుల్లో కేంద్రం వాటా 42% ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య