ఉన్నత విద్యలో అమ్మాయిలు తక్కువే..!
జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది.
జాతీయ సగటు 105.. రాష్ట్రంలో 94
తగ్గుతున్న పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశాలు
ఏఐఎస్హెచ్ఈ సర్వేలో వెల్లడి
ఈనాడు, అమరావతి: జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతి వంద మంది అబ్బాయిలకు 94మంది అమ్మాయిలే ఉన్నత విద్యలో ఉన్నారు. అదే జాతీయ సరాసరి చూస్తే 105మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలో లింగ సమానత్వ సూచిక(జీపీఐ) క్రమంగా పెరుగుతున్నా ఇంకా రాష్ట్రం వెనుకబడే ఉంది. పక్క రాష్ట్రాలతో చూసినా ఈ అంకెల్లో రాష్ట్రానిది వెనకబాటే. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మన కంటే ముందు వరసలో ఉన్నాయి. ఎంతో వెనుకబడిన రాష్ట్రం అనుకునే ఒడిశా సైతం ఏపీతో సమానంగానే ఉంది. అత్యధికంగా కేరళలో 100మంది అబ్బాయిలకు 152మంది అమ్మాయిలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ విభాగాల్లోనూ రాష్ట్రంలో తక్కువగానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే 2020-21లో ఇది బహిర్గతమైంది. రాష్ట్రంలో 18-23 ఏళ్లు వయసున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2016లో 55.76లక్షల మంది ఉండగా.. 2020కి వచ్చేసరికి 53,43,200 మాత్రమే ఉన్నారు. ఈ ఐదేళ్లలోనే 2.32లక్షల మంది తగ్గారు. ఈ వయసులో ఉన్న వారంతా ఉన్నత విద్య చదివేవారే. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యకు పక్క రాష్ట్రాలకు వెళ్లడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది విద్యార్థులకు 49 కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. 2019-20లో 51 చొప్పున ఉండగా.. 2020-21 వచ్చే సరికి రెండు చొప్పున తగ్గాయి.
తగ్గుతున్న పీజీ ప్రవేశాలు..
రాష్ట్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రెగ్యులర్, దూర విద్య కలిపి 2016-17లో 2,54,650మంది ప్రవేశాలు పొందగా 2020-21 నాటికి 19,5,814మందికి పడిపోయింది. అన్ని యూజీ కోర్సుల్లో కలిపి 13లక్షల నుంచి 16 లక్షలకు పెరిగినా పీజీ చదివేవారు మాత్రం తగ్గుతున్నారు. యూజీ తర్వాత విద్యార్థులు పీజీపై ఆసక్తి చూపడం లేదు. బీటెక్ లాంటి సాంకేతిక కోర్సుల్లో యూజీతోనే ఎక్కువ మంది ఆపేస్తున్నారు. ఎంఫిల్ ప్రవేశాలు సైతం భారీగా తగ్గాయి. 2020-21లో కేవలం 118మంది మాత్రమే చేరారు. పీహెచ్డీ ప్రవేశాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 2016-17లో 4,672మంది ప్రవేశాలు పొందగా.. 2020-21లో ఇది 6,991కి పెరిగింది.
జీఈఆర్ మెరుగు..
ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్) పెరిగింది. 2019-20లో 35.1శాతంగా ఉన్న జీఈఆర్ 2020-21లో 37.2శాతానికి పెరిగింది. జాతీయ సగటు కంటే దాదాపు 10శాతం అధికంగా ఉంది. ఎస్సీల్లో 33.6శాతం, ఎస్టీల్లో 31.8శాతంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,601 కళాశాలలు ఉండగా.. వీటిల్లో సరాసరిన 541మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 604, ప్రైవేటులో 519మంది చొప్పున ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్