Budget 2023: పది బడ్జెట్లు గడిచినా... పనికొచ్చే ప్రాజెక్టే లేదు
కేంద్రాన్ని నిలదీయలేని, పూర్తిగా సాగిలపడిన రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, కేంద్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్కు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది.
విభజన హామీల్నీ పట్టించుకోని కేంద్రం
తాజా బడ్జెట్లోనూ రాష్ట్రానికి దగా
ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈ దుస్థితి
ఈనాడు - అమరావతి
కేంద్రాన్ని నిలదీయలేని, పూర్తిగా సాగిలపడిన రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, కేంద్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్కు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్ర ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజన జరిగాక.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పది బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వ హయాంలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే! రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయింది. ఒక రాష్ట్ర చరిత్రలో తొమ్మిదేళ్లంటే ఆషామాషీ కాదు. అందులోనూ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో తొమ్మిదేళ్లు అత్యంత కీలకం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది బడ్జెట్లలో రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప ఆంధ్రప్రదేశ్కంటూ నిర్దిష్టంగా, రాష్ట్ర స్వావలంబనకు ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదు. కనీసం విభజన చట్టంలోని పెండింగ్ అంశాల్ని, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ లోక్సభలో ఇచ్చిన ప్రత్యేక హోదా వంటి హామీల్నీ నెరవేర్చలేదు. కేంద్రంతో పోరాడలేని రాష్ట్ర ప్రభుత్వాల నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న అంతులేని ఉదాసీనతే దీనికి కారణం. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా మొదటి నాలుగేళ్లూ.. కేంద్రంతో సామరస్యంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాలని ప్రయత్నించింది. చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సహా విభజన హామీల కోసం కేంద్రంపై పోరాడాల్సిందేనని రంకెలు వేసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే, 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీల్ని సాధిస్తామని అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ పదేపదే చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్లేటు ఫిరాయించేశారు. గత ప్రభుత్వం కనీసం చివరి సంవత్సరమైనా కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడింది. జగన్ మాత్రం.. కేంద్ర పెద్దలంటే అంతులేని విధేయత చూపుతూ, కనీసం గట్టిగా అడిగేందుకూ జంకుతూ నాలుగేళ్లు గడిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటం కేంద్ర ప్రభుత్వానికి మరింత లోకువగా మారింది. ఇంకా విభజన గాయాల నుంచి కోలుకోని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక, ఆర్థికలోటుతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్పై దిల్లీ పెద్దల అంతులేని నిర్లక్ష్యానికి ఇదే ప్రధాన కారణం. ఈ బడ్జెట్లో కూడా పోలవరం ప్రాజెక్టు, విశాఖలో రైల్వే జోన్కు నిధులు కేటాయింపుపై మాట్లాడలేదు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ప్లాంట్, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం.. ఇలా విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీ గురించీ కనీస ప్రస్తావనా లేదు. అయినా ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి విలేకర్ల సమావేశం పెట్టి మరీ ప్రశంసించడం.. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వైకాపా ప్రభుత్వం ఎంతగా తహతహలాడుతోందో చెప్పడానికి నిదర్శనం. ఆయన స్పందన చూశాక... జగన్ ప్రభుత్వం అంతగా వణికిపోతుంటే ఇక కేంద్రం మాత్రం రాష్ట్రాన్ని ఎందుకు పట్టించుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి ఒరిగిందేమిటి?
ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా అండగా ఉంటామని 2014 ఎన్నికల సమయంలో భాజపా నాయకులు ఇచ్చిన హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. ప్రతి బడ్జెట్లోనూ భాజపా పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వరాలు కురిపిస్తూ, అప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరాల్లోని ప్రాజెక్టులకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం తాజా బడ్జెట్లోనూ అదే ధోరణి కనబరిచింది.
* రాష్ట్ర విభజన జరిగిన ఈ తొమ్మిదేళ్లలో రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇవ్వడం, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం వంటి హామీల్ని మాత్రమే అరకొరగా నెరవేర్చింది.
* కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్లో రూ.5,300 కోట్లు కేటాయించిన కేంద్రం.. పోలవరం ప్రాజెక్టు గురించిన కనీస ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.
* దేశంలోని వివిధ నగరాల్లోని మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు 2021-22లో కేంద్రం రూ.23,262 కోట్లు ఖర్చు చేసింది. బెంగళూరు, చెన్నై, కోచి, నాగ్పుర్, నాసిక్లలో మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసింది. బెంగళూరు మెట్రో రెండో దశ ప్రాజెక్టుకే ఏకంగా రూ14,788 కోట్లు ఇచ్చింది. నిరుటి బడ్జెట్లోనూ మెట్రోలకు రూ.19,130 కోట్లు కేటాయించింది. అందులోనూ ఎక్కడా విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. మెట్రో అనే కాదు.. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకూ కేంద్రం గత బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించింది.
* విశాఖకు రైల్వే జోన్ ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. ఎందుకు అడుగు ముందుకు పడటం లేదు?
* వెనుకబడిన రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం కేటగిరీ కింద.. పరిశ్రమలకు కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని తిరిగిచ్చేందుకు ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు 2022-23 బడ్జెట్లో రూ.3,631 కోట్లు కేటాయించింది. తాజా బడ్జెట్లోనూ రూ.1,714 కోట్లు పెట్టింది. ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్కూ ఆ ప్రయోజనం చేకూరేది కదా? ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ఆ రాయితీలన్నా ఇస్తే ఇక్కడా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతుంది కదా? ఇంత అన్యాయం జరుగుతున్నా.. పెండింగ్లో ఉన్న ప్రధానమైన విభజన హామీల గురించి కేంద్రం వీసమెత్తు పట్టించుకోకపోయినా నిలదీయాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు