Budget 2023: పది బడ్జెట్లు గడిచినా... పనికొచ్చే ప్రాజెక్టే లేదు
కేంద్రాన్ని నిలదీయలేని, పూర్తిగా సాగిలపడిన రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, కేంద్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్కు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది.
విభజన హామీల్నీ పట్టించుకోని కేంద్రం
తాజా బడ్జెట్లోనూ రాష్ట్రానికి దగా
ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈ దుస్థితి
ఈనాడు - అమరావతి
కేంద్రాన్ని నిలదీయలేని, పూర్తిగా సాగిలపడిన రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, కేంద్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్కు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్ర ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజన జరిగాక.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పది బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వ హయాంలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే! రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయింది. ఒక రాష్ట్ర చరిత్రలో తొమ్మిదేళ్లంటే ఆషామాషీ కాదు. అందులోనూ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో తొమ్మిదేళ్లు అత్యంత కీలకం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది బడ్జెట్లలో రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప ఆంధ్రప్రదేశ్కంటూ నిర్దిష్టంగా, రాష్ట్ర స్వావలంబనకు ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదు. కనీసం విభజన చట్టంలోని పెండింగ్ అంశాల్ని, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ లోక్సభలో ఇచ్చిన ప్రత్యేక హోదా వంటి హామీల్నీ నెరవేర్చలేదు. కేంద్రంతో పోరాడలేని రాష్ట్ర ప్రభుత్వాల నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న అంతులేని ఉదాసీనతే దీనికి కారణం. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా మొదటి నాలుగేళ్లూ.. కేంద్రంతో సామరస్యంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాలని ప్రయత్నించింది. చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సహా విభజన హామీల కోసం కేంద్రంపై పోరాడాల్సిందేనని రంకెలు వేసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే, 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీల్ని సాధిస్తామని అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ పదేపదే చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్లేటు ఫిరాయించేశారు. గత ప్రభుత్వం కనీసం చివరి సంవత్సరమైనా కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడింది. జగన్ మాత్రం.. కేంద్ర పెద్దలంటే అంతులేని విధేయత చూపుతూ, కనీసం గట్టిగా అడిగేందుకూ జంకుతూ నాలుగేళ్లు గడిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటం కేంద్ర ప్రభుత్వానికి మరింత లోకువగా మారింది. ఇంకా విభజన గాయాల నుంచి కోలుకోని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక, ఆర్థికలోటుతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్పై దిల్లీ పెద్దల అంతులేని నిర్లక్ష్యానికి ఇదే ప్రధాన కారణం. ఈ బడ్జెట్లో కూడా పోలవరం ప్రాజెక్టు, విశాఖలో రైల్వే జోన్కు నిధులు కేటాయింపుపై మాట్లాడలేదు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ప్లాంట్, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం.. ఇలా విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీ గురించీ కనీస ప్రస్తావనా లేదు. అయినా ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి విలేకర్ల సమావేశం పెట్టి మరీ ప్రశంసించడం.. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వైకాపా ప్రభుత్వం ఎంతగా తహతహలాడుతోందో చెప్పడానికి నిదర్శనం. ఆయన స్పందన చూశాక... జగన్ ప్రభుత్వం అంతగా వణికిపోతుంటే ఇక కేంద్రం మాత్రం రాష్ట్రాన్ని ఎందుకు పట్టించుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి ఒరిగిందేమిటి?
ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా అండగా ఉంటామని 2014 ఎన్నికల సమయంలో భాజపా నాయకులు ఇచ్చిన హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. ప్రతి బడ్జెట్లోనూ భాజపా పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వరాలు కురిపిస్తూ, అప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరాల్లోని ప్రాజెక్టులకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం తాజా బడ్జెట్లోనూ అదే ధోరణి కనబరిచింది.
* రాష్ట్ర విభజన జరిగిన ఈ తొమ్మిదేళ్లలో రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇవ్వడం, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం వంటి హామీల్ని మాత్రమే అరకొరగా నెరవేర్చింది.
* కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్లో రూ.5,300 కోట్లు కేటాయించిన కేంద్రం.. పోలవరం ప్రాజెక్టు గురించిన కనీస ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.
* దేశంలోని వివిధ నగరాల్లోని మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు 2021-22లో కేంద్రం రూ.23,262 కోట్లు ఖర్చు చేసింది. బెంగళూరు, చెన్నై, కోచి, నాగ్పుర్, నాసిక్లలో మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసింది. బెంగళూరు మెట్రో రెండో దశ ప్రాజెక్టుకే ఏకంగా రూ14,788 కోట్లు ఇచ్చింది. నిరుటి బడ్జెట్లోనూ మెట్రోలకు రూ.19,130 కోట్లు కేటాయించింది. అందులోనూ ఎక్కడా విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. మెట్రో అనే కాదు.. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకూ కేంద్రం గత బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించింది.
* విశాఖకు రైల్వే జోన్ ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. ఎందుకు అడుగు ముందుకు పడటం లేదు?
* వెనుకబడిన రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం కేటగిరీ కింద.. పరిశ్రమలకు కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని తిరిగిచ్చేందుకు ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు 2022-23 బడ్జెట్లో రూ.3,631 కోట్లు కేటాయించింది. తాజా బడ్జెట్లోనూ రూ.1,714 కోట్లు పెట్టింది. ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్కూ ఆ ప్రయోజనం చేకూరేది కదా? ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ఆ రాయితీలన్నా ఇస్తే ఇక్కడా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతుంది కదా? ఇంత అన్యాయం జరుగుతున్నా.. పెండింగ్లో ఉన్న ప్రధానమైన విభజన హామీల గురించి కేంద్రం వీసమెత్తు పట్టించుకోకపోయినా నిలదీయాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి