‘సంకల్ప దీక్ష’పై పోలీసుల నిర్బంధం
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) చేపట్టిన ‘సంకల్ప దీక్ష’ను భగ్నం చేసేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేశారు.
సీపీఎస్ రద్దు చేయాలంటూ దీక్షకు పిలుపునిచ్చిన యూటీఎఫ్
ఉపాధ్యాయుల ముందస్తు హౌస్ అరెస్టు
ఈనాడు, అమరావతి, గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) చేపట్టిన ‘సంకల్ప దీక్ష’ను భగ్నం చేసేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేశారు. దీక్ష నిర్వహణకు అనుమతి లేదంటూ ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కొందర్ని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. దీక్షాస్థలికి ఎక్కువ మంది రాకుండా నిలువరించేందుకు గురువారం రాత్రి నుంచే చాలా మందిని గృహనిర్బంధం చేశారు. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ప్రధానంగా హనుమాన్జంక్షన్ నుంచి గన్నవరం వరకు శుక్రవారం తెల్లవారు జాము నుంచే భారీగా పోలీసులు మోహరించారు. అడుగడునా చెక్పోస్టులు పెట్టి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉపాధ్యాయుడిగా అనుమానిస్తే వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని కృష్ణా జిల్లా గన్నవరం శివారులోని ‘ధర్మస్థలి’ ఆవరణలో సంకల్ప దీక్షకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. దీనికీ అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయులు సభాస్థలికి చేరుకునే ఆస్కారం లేకుండా చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు టోల్ప్లాజా, పిన్నమనేని కూడలి, హనుమాన్జంక్షన్, విమానాశ్రయం, గన్నవరం పరిసరాల్లో ఎనిమిది చెక్పోస్టులను ఏర్పాటు చేసి 418మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని వీరవల్లి, ఉంగుటూరు, గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, హనుమాన్జంక్షన్, ఆత్కూరు స్టేషన్లకు తరలించారు.
పాఠశాలల వద్ద పోలీసుల కాపలా..
ఉపాధ్యాయులు సంకల్ప దీక్షకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలల వద్ద పోలీసులు ఉదయం నుంచి కాపలా కాశారు. గుంటూరులో యూటీఎఫ్ సహాధ్యక్షురాలు కుసుమకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, నెల్లూరులో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బాబురెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు మచ్చా శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు డి.అపర్ణను హౌస్అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ షేక్సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్లను పెదఅవుటపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆత్కూరు పోలీసుస్టేషన్ వద్ద ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. కేసులు నమోదుచేసిన పోలీసులు..మధ్యాహ్నం తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సంకల్ప దీక్ష కొనసాగింపుగా ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు నిర్వహించాలని యూటీఎఫ్ పిలుపునిచ్చింది. రానున్న రోజుల్లో తమ పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటెడ్ పెన్షన్ పథకంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయం ఆవరణలో సంకల్ప దీక్ష నిర్వహించారు. ‘ప్రతిపక్ష నేతగా సీపీఎస్ను రద్దు చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు జీపీఎస్ అమలు చేస్తామంటున్నారు. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్