Amaravati: విభజన చట్ట నిబంధనల మేరకే రాజధానిగా అమరావతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ -సీఆర్డీఏ (రద్దు) చట్టం-2020, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల్లో సమ్మిళిత అభివృద్ధి-2020 చట్టాలు తీసుకొచ్చి 2020 జులై 31న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆ చట్టంలోని సెక్షన్ 5, 6లలో రాజధాని గురించి ఉంది
సెక్షన్ 94లో కేంద్ర నిధులకు హామీ
ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇచ్చాం
సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల చట్టాలు చేసేటప్పుడు ఏపీ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదు
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ
ఈనాడు - దిల్లీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ -సీఆర్డీఏ (రద్దు) చట్టం-2020, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల్లో సమ్మిళిత అభివృద్ధి-2020 చట్టాలు తీసుకొచ్చి 2020 జులై 31న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా రాష్ట్రంలో మూడు పరిపాలనా కేంద్రాలు ఉంటాయని పేర్కొంది. ఈ రెండు చట్టాలు చేసే ముందు/ రూపొందించే ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరించే 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అందుకే చట్టంలోని సెక్షన్ 94ను అనుసరించి రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చట్టం చేసే శాసనాధికారం ఏపీ అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేంద్ర హోం శాఖ అండర్ సెక్రటరీ శ్యామల్కుమార్ బిత్ బుధవారం 14 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం విభజన చట్టంలోని సెక్షన్ 5, 6తో ముడిపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం రాజధానికి ప్రత్యామ్నాయాల అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నివేదికను తగిన చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని, ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 94లో కొత్త రాజధానిలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మద్దతు ఇవ్వాలని ఉందన్నారు. దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.2,500 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సీఆర్డీఏను రద్దు చేసి, రాష్ట్రంలో మూడు రాజధానులకు వీలు కల్పించే వికేంద్రీకరణ చట్టాలను తెచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. అఫిడవిట్లో ఏపీ విభజన చట్టం, శివరామకృష్ణన్ కమిటీ నివేదికల్లోని ముఖ్యాంశాలను జత చేశారు.
అఫిడవిట్లోని అంశాలు
* ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 చేశారు. ఆ చట్టంలోని 5వ నిబంధనలో ‘ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్ కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఉంటుంది’ అని పేర్కొన్నారు.
* ‘ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించిన విభిన్న ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి, విభజన చట్టం రూపొందిన ఆరు నెలల్లోపు తగిన సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది’ అని విభజన చట్టంలోని సెక్షన్ 6లో పేర్కొన్నారు.
* సెక్షన్ 6ను అనుసరించి.. కేంద్ర ప్రభుత్వం 2014 మార్చి 28న విశ్రాంత ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కొత్త రాజధాని ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి స్థూల మార్గదర్శకాలతో ఆగస్టు 30న నివేదిక సమర్పించింది.
* తగిన చర్య కోసం కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను ఆంధ్రప్రదేశ్కు పంపింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న అమరావతి పేరుతో రాజధాని నగరాన్ని నోటిఫై చేసింది.
* విభజన చట్టంలోని సెక్షన్ 94లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో రాజ్భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, శాసనసభ, శాసనమండలి, ఇతర ముఖ్యమైన మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మద్దతు ఇవ్వాలని ఉంది.
* దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.2,500 కోట్లు విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలో పట్టణ మౌలిక వసతుల కల్పన కోసం 2014-15లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఇచ్చినరూ.1,000 కోట్లు కూడా ఇందులో ఉంది.
న్యాయ నిపుణులు ఏమంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ద్వారా నూతన రాజధాని ఏర్పాటు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్లే దానిపై చట్టం చేసే అధికారం ఏపీ శాసన వ్యవస్థకు లేదని హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ద్వారా రాజధాని ఎంపిక ఆ రెండు సెక్షన్లకు లోబడే జరగాలని రూఢి అయిందన్నారు. వాటిని అనుసరించి కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడం, దాని నివేదికపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం, దాన్ని అనుసరించి 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడం జరిగిపోయినందున దాన్ని తిరగదోడటానికి వీల్లేదని హైకోర్టు చెప్పిందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎంపిక బాధ్యతలను తీసుకొని, దాన్ని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పూర్తి చేసినందున అదే అధికారాన్ని పునఃప్రయోగించడానికి వీల్లేదన్న ఉద్దేశంతోనే హైకోర్టు శాసనసభకు దీనిపై శాసనాధికారాలు లేవని చెప్పిందని పేర్కొన్నారు. ఏదైనా రాష్ట్రానికి రాజధాని ఎంపిక కోసం అనుసరించాల్సిన నిర్దేశిత విధానం ఏదైనా ఉందా? అని 2020 ఫిబ్రవరి 11న తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఇదే కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ‘రాజధాని నగరంపై సంబంధిత రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చు.. అందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదు’ అని చెప్పారని గుర్తు చేశారు. కానీ బుధవారం విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ప్రత్యేకంగా అడిగినందున అదే కేంద్ర మంత్రి విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల గురించి ప్రత్యేకంగా చెప్పారని న్యాయనిపుణులు ఉదహరిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో రాజధాని గురించి ప్రత్యేకంగా చెప్పకపోతే వాటిని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉంటుందని.. కానీ ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఆ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి ఎంపిక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనలను అనుసరించే జరిగిందని అభిప్రాయపడ్డారు.
హామీలు చాలా అమలు చేశాం
రాజ్యసభలో కేంద్రం వెల్లడి
విభజన చట్టంలో చెప్పిన చాలా హామీలు ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన వాటి అమలు వివిధ దశల్లో ఉందని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. విభజన చట్టంలోని అంశాల అమలు గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. మూడేళ్లలో 5 సమీక్షలు జరిగినట్లు వెల్లడించారు. సమస్యలను ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని కేంద్రం సంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్