EPFO: వేతన జీవికి వెసులుబాటు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిష్యనిధి పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను ప్రయోజనాలు పొందేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.
అధిక పింఛను సౌలభ్యం కల్పించిన ఈపీఎఫ్వో
ఎక్కువ వేతనం పొందుతూ ఈపీఎస్ -2014 చట్టసవరణకు ముందు ఆప్షన్ ఇవ్వనివారికి అవకాశం
4 నెలల్లోగా ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి
ఈనాడు, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిష్యనిధి పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను ప్రయోజనాలు పొందేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది. ఈపీఎఫ్వో విధించిన గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనాలు పొందుతూ.. ఆ మేరకు వేతనాలపై ఉద్యోగి, యజమాని ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగులకు ఈ అవకాశమిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం-2014 చట్ట సవరణకు ముందు పేరా 11(3) కింద అధిక వేతనంపై అధిక పింఛను సదుపాయం కోసం ‘ఉమ్మడి ఆప్షన్’ ఇవ్వలేకపోయిన వారందరికీ 4 నెలల గడువు ఇచ్చింది. అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు, సుప్రీంకోర్టు తీర్పులోని పేరా 44(3), 44(4), 44(5)ల అమలులో భాగంగా ఈపీఎఫ్వో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్-1(పింఛన్లు) అప్రజిత జగ్గీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల ఈపీఎస్లో డిపాజిట్ సర్దుబాటు, అదనపు చెల్లింపుల వివరాలు, అధిక పింఛను లెక్కింపు విధానంపై తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ కార్యాలయాల ఇన్ఛార్జులు వారానికోసారి దరఖాస్తుల పరిష్కార వివరాల్ని జోనల్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జోనల్ కార్యాలయాలు వారానికోసారి కేంద్ర కార్యాలయ పింఛను డివిజన్కు వివరాలు అందించాలని తెలిపారు. యజమానితో కలిసి ఉద్యోగులు ఉమ్మడి ఐచ్ఛికం ఇచ్చిన తరువాత ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్ఐజీఎంఎస్ (గ్రీవెన్స్) పోర్టల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
* అర్హులైన ఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు చేయాలి. ఉమ్మడి ఆప్షన్ల దరఖాస్తు విధానం, వివరాలు, గడువు తేదీని ప్రాంతీయ కమిషనర్ వెల్లడిస్తారు.
* అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్య నిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు, అదనపు నిధి డిపాజిట్ అంశంపై ఉమ్మడి ఆప్షన్ ఫారంలో కచ్చితంగా అంగీకారం తెలపాలి.
* ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్ను మినహాయిస్తున్న సంస్థలు భవిష్య నిధి ట్రస్ట్ నుంచి పింఛను నిధికి నగదు బదిలీ కోసం ట్రస్టీ నుంచి హామీపత్రం జతచేయాలి. నిధి సర్దుబాటు సమయానికి ఈపీఎస్ చందా బకాయిలు, వడ్డీ సహా సకాలంలో చెల్లించేలా హామీపత్రంలో స్పష్టంగా పేర్కొనాలి.
* ఉమ్మడి ఆప్షన్తోపాటు అధిక వేతనంపై యజమాని చెల్లించిన వాటా జమకు సంబంధించిన ఆధారాలు, అధిక వేతనంపై పీఎఫ్ చెల్లించేందుకు అనుమతించాలని కోరుతూ గతంలో పేరా 26(6) కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ రుజువును యజమాని ధ్రువీకరించాలి.
* దరఖాస్తు కోసం త్వరలో ప్రత్యేకంగా లింకు(యూఆర్ఎల్)ను ఈపీఎఫ్వో అందుబాటులోకి తీసుకురానుంది. అది అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రాంతీయ కమిషనర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
* ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో పూర్తి చేసి.. డిజిటల్గా పంపించాలి. దరఖాస్తుదారుడికి ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. యజమాని లాగిన్కు దరఖాస్తు చేరుతుంది. దానిపై డిజిటల్ సంతకం చేసి.. తదుపరి పరిష్కారానికి ప్రాంతీయ కమిషనర్కు సమర్పించాలి.
గడువు తేదీ లేకపోవడంతో...
ఈపీఎఫ్ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి (బేసిక్+డీఏ) రూ.6,500గా ఉంది. అంతకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్లో చేరేందుకు.. ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్లో జమ చేయాలి. కానీ, ఈ పథకంలో చేరేందుకు అప్పట్లో గరిష్ఠ గడువు తేదీని పేర్కొనలేదు. 2014లో చట్ట సవరణ ద్వారా గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. చట్ట సవరణకు ముందు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు.. అధిక వేతనంపై ఈపీఎస్లో చేరేందుకు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్ ఇవ్వాలని ఈపీఎఫ్వో సూచించింది. అయితే, 2014 సవరణకు ముందు ఈ పథకంలో చేరని ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించలేదు. చట్ట సవరణకు ముందు కచ్చితమైన గడువు లేకపోవడంతో అర్హులైన ఉద్యోగుల్లో చాలామంది ఆప్షన్ ఇవ్వలేకపోయారని, వారికి మరోసారి నాలుగు నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆప్షన్కు అవకాశమిస్తూ ఈపీఎఫ్వో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరు అర్హులు?
* తాజా ఆదేశాల ప్రకారం.. 2014 నాటి చట్ట సవరణకు ముందు ఈపీఎఫ్ చట్టంలోని పేరా 11(3) ప్రకారం అధిక వేతనంపై పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన చందాదారులు, చట్ట సవరణ తరువాత 11(4) కింద నిర్ణీత గడువులోగా ఆప్షన్ సదుపాయాన్ని వినియోగించుకోలేకపోయిన ఉద్యోగులు తాజాగా ఆప్షన్ నమోదు చేయవచ్చు. ఇందుకు నాలుగు నెలల సమయం ఉంది.
* 2014 సెప్టెంబరు 1 నాటి చట్ట సవరణకు ముందు ఈపీఎఫ్ చందాదారులుగా ఉంటూ... చట్టంలోని పేరా 26(6) ప్రకారం ఉద్యోగులు, యజమాని ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి (రూ.5 వేలు/రూ.6,500) కన్నా ఎక్కువ వేతనంపై చందా చెల్లిస్తూ.. 2014 సెప్టెంబరు 1 తరువాత కూడా సభ్యులుగా కొనసాగుతున్నవారు అర్హులు. చట్ట సవరణకు ముందు 11(3) కింద యజమానితో కలిసి ఉమ్మడి ఐచ్ఛికం ఇవ్వలేకపోయిన సభ్యులు అర్హులు.
* చట్ట సవరణకు ముందు 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినప్పటికీ, సవరణ తరువాత 11(4) కింద అధిక పింఛనుకు ఆరు నెలల గడువులోగా ఆప్షన్ ఇవ్వలేకపోయిన ఉద్యోగులెవరూ ప్రస్తుతం ఆప్షన్ ఇచ్చేందుకు అర్హులు కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల