సంక్షిప్త వార్తలు(10)
సీనియర్ పాత్రికేయుడు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి అనారోగ్యంతో బుధవారం సాయంత్రం హైదరాబాద్లో మరణించారు.
ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి మృతి
సింహాద్రిపురం, న్యూస్టుడే: సీనియర్ పాత్రికేయుడు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్రెడ్డి అనారోగ్యంతో బుధవారం సాయంత్రం హైదరాబాద్లో మరణించారు. వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లెకు చెందిన ఆయన.. గత 30 ఏళ్లుగా పలు వార్తాపత్రికల్లో పనిచేసి, ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 1978లో జర్నలిజంలోకి అడుగుపెట్టి ఏపీయూడబ్ల్యూజే కడప జిల్లా అధ్యక్షుడిగా 24 ఏళ్లపాటు సేవలందించారు. అనంతరం పలు పత్రికల్లో పనిచేశారు. శ్రీనాథ్రెడ్డి మృతికి సీఎం జగన్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.
ఇసుక తవ్వకాలకు అక్రమ బాట
శ్రీకాళహస్తి గ్రామీణం (ఏర్పేడు), న్యూస్టుడే: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం సుబ్బానాయుడుకండ్రిగ సమీపంలోని సువర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు కొందరు వ్యక్తులు బుధవారం రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల నదిలో పెద్దఎత్తున యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో స్థానికులు ఏకమై తవ్వకాలను అడ్డుకున్నారు. గతంలో నదిలో ఏర్పాటు చేసిన రోడ్డును తవ్వేశారు. మరలా కొందరు వ్యక్తులు జేసీబీతో నదిలో రోడ్డును ఏర్పాటు చేసి ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. దీన్ని గుర్తించిన స్థానిక రైతులు వెళ్లి అడ్డుకున్నా ప్రయోజనం లేకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.
కాటి కాపరులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: కాటి కాపరులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 వేల మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు చనిపోతే పూడ్చేందుకు శ్మశాన స్థలాలు కేటాయించడంలో వివక్ష కొనసాగుతోంది. వారికి వృత్తి పరికరాలు, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి’ అని డిమాండ్ చేశారు.
వక్ఫ్ బోర్డు ప్రత్యేక టాస్క్ఫోర్స్కు అధికారి నియామకం
ముస్లిం సంఘాల నుంచి విమర్శలు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రత్యేక టాస్క్ఫోర్స్ అధికారిగా తెలంగాణకు చెందిన విశ్రాంత అధికారి మూస బిన్ ఇబ్రహీంను నియమిస్తూ ఆ సంస్థ సీఈవో అబ్దుల్ ఖదీర్ ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అద్దెల వసూళ్లను ఆయన పర్యవేక్షిస్తారు. ఆరు నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు. నెలకు రూ.60 వేల వరకు పారితోషికం వక్ఫ్ నిధుల నుంచే చెల్లిస్తారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ అధికారిగా తెలంగాణకు చెందిన విశ్రాంత అధికారి నియామకంపై ముస్లిం సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. జీవో నంబర్ 2323 ప్రకారం విశ్రాంత అధికారులకు నెలకు రూ.40 వేలకు మించి చెల్లించడానికి వీలులేదని, అందుకు విరుద్ధంగా రూ.60 వేల చొప్పున చెల్లింపునకు ఆదేశాలివ్వడం వెనుక ఆంతర్యమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వక్ఫ్ అధికారుల్ని వివరణ కోరగా.. ర్యాటిఫికేషన్ కోసం దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపామని తెలిపారు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈనాడు, అమరావతి: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర పథ సంచాకులు సురేష్ కుమార్ తాజాగా తెలిపారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికయిన విద్యార్థుల సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశం ద్వారా సమాచారం అందిస్తామని వెల్లడించారు.
పురపాలక ఉపాధ్యాయులకు జిల్లా యూనిట్గా బదిలీలు
ముసాయిదా సర్వీసు నిబంధనలు రూపొందించిన పాఠశాల విద్యాశాఖ
ఈనాడు, అమరావతి: పురపాలక ఉపాధ్యాయులకు జిల్లా యూనిట్గా బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు సర్వీసు నిబంధనల ముసాయిదాను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. ముసాయిదా సర్వీసు నిబంధనలను వెబ్సైట్లో ఉంచింది. దీనిపై అభ్యంతరాలను ఆహ్వానించింది. ఇప్పటివరకూ విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థలకు వేర్వేరుగా.. ఆయా జిల్లాల్లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు విడివిడిగా బదిలీలు నిర్వహిస్తుండగా.. ఇక జిల్లా యూనిట్గా చేసేందుకు ముసాయిదా తీసుకొచ్చారు. ఇది కొత్త జిల్లాల ప్రకారం ఉంటుందా, పాత జిల్లా జిల్లాల ప్రకారం ఉంటుందా అనేదానిపై స్పష్టత లేదు. పురపాలక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగించడంతో ఈ సర్వీసు నిబంధనలను రూపొందించింది. దీన్ని పురపాలక ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల మార్పు వల్ల సర్వీసు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యూనిట్ నిబంధనల అమలు కంటే ముందే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని మరికొందరు కోరుతున్నారు.
ఘనంగా 24 గంటల కథా మారథాన్
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచ కథా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని బీ ప్లస్ విత్ భాస్కర్ ఛానెల్, యూట్యూబ్ వేదిక ద్వారా 24 గంటల కథా మారథాన్ను ఈనెల 19, 20 తేదీల్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, వంగూరి చిట్టెన్రాజు, ఓలేటి పార్వతీశం, సత్యం మందపాటి, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 దేశాల నుంచి దాదాపు 126 మంది కథకులు వారి కథలను ఆన్లైన్లో వినిపించారు. ఈ కథాకళతోపాటు ప్రముఖ కార్టూనిస్ట్ కూచి సాయిశంకర్ చిత్ర కళా నైపుణ్యం అబ్బుర పరిచింది. ఒక్కో కథ వింటూ అప్పటికప్పుడు కథాసారాన్ని ప్రతిబింబించే చిత్రాలను వేయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకు ఎవరూ చేయలేదని, కథ-కళ కలిపి సమ్మేళనాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.
అందుబాటులోకి యూజీసీ ఈ-సమాధాన్ పోర్టల్
ఈనాడు, అమరావతి: ఆన్లైన్ ఫిర్యాదులకు ఈ-సమాధాన్ పోర్టల్ను తీసుకొచ్చినట్లు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) తాజాగా వెల్లడించింది. ఈ పోర్టల్ ఏకగవాక్ష విధానంలో ఫిర్యాదులను పరిశీలిస్తుందని ఇక నుంచి దీని ద్వారానే ఫిర్యాదులను సమర్పించాలని సూచించింది.
ఏప్రిల్ 30 లోపు వక్ఫ్ ఆస్తుల్ని నమోదు చేయించాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు గుర్తించని వక్ఫ్ ఆస్తుల్ని వక్ఫ్ బోర్డులో నమోదు చేయించుకోవాలని ఆ సంస్థ ప్రత్యేకాధికారి షీరిన్ బేగం తెలిపారు. ప్రతి మసీదు, దర్గా ఈద్గా, పీర్ల చావిడి, పీర్ల పంజాలు, అషుర్ఖానాలు, ముసాఫిర్ఖానాలు, ముస్లిం శ్మశానవాటికలు, జెండా చెట్లు తదితర అన్ని సంస్థలూ వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ రిజిస్టర్ కానివి కూడా వక్ఫ్ సంస్థలేనన్నారు. ముస్లిం సంస్థల ముసల్లీలు, ముతవల్లీలు, కమిటీ అధ్యక్షులు ఆయా ప్రాంతాల్లోని వక్ఫ్ సంస్థలు, వాటికి చెందిన భూములు, ఇతర ఆస్తుల్లో బోర్డులో నమోదు కానివి గుర్తించి.. ఏప్రిల్ 30లోపు రిజిస్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విశ్వవిద్యాలయాలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ తప్పనిసరి
ఈనాడు, అమరావతి: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)ను తప్పనిసరి చేయాలని నీతి ఆయోగ్ పాలకమండలి సూచించింది. నూతన విద్యావిధానం-2020పై ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు కోసం దరఖాస్తు చేసుకోవాలని పాలకమండలి ఆదేశించింది. ఉన్నత విద్యలో గుణాత్మక మార్పును సాధించేందుకు సాంకేతిక విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు మెరుగుదలకు కృషి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!