‘ఆయుష్మాన్ భారత్’లో నాలుగేళ్లల్లో రూ.1,514 కోట్లు
ఆయుష్మాన్ భారత్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లల్లో రూ.1,514.75 కోట్లు ఇచ్చినట్లు మంత్రి విడదల రజని తెలిపారు.
మంత్రి రజని
ఈనాడు, అమరావతి: ఆయుష్మాన్ భారత్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లల్లో రూ.1,514.75 కోట్లు ఇచ్చినట్లు మంత్రి విడదల రజని తెలిపారు. శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయుష్మాన్ భారత్ యోజనపై తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఈ పథకం కింద 1,949 ప్రొసిజర్స్ ఉన్నాయని, 55.30 లక్షల కుటుంబాలు అర్హత పొందుతున్నాయని తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 942 ప్రొసిజర్స్ ఉండగా.. తెదేపా హయాంలో అదనంగా 117 మాత్రమే తీసుకొచ్చారని వెల్లడించారు. ఇప్పుడు వాటిని 3,148 ప్రొసిజర్స్కు పెంచామని తెలిపారు. ఆరోగ్యశ్రీని తెదేపా హయాంలో అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని విమర్శించారు.
వైకాపా సీటు రాదనుకున్నవారే అమ్ముడుపోయారు
మంత్రి జోగి రమేష్
వచ్చే ఎన్నికల్లో వైకాపా సీటు రాదనుకున్న ఎమ్మెల్యేలు చంద్రబాబుకు అమ్ముడుపోయారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ఇళ్లు కట్టిస్తే జగన్ పేరు కొన్ని తరాలపాటు నిలిచిపోతుందని, పేదలకు ఇళ్లు దక్కకూడదని తెదేపా వారు కోర్టుల్లో కేసులు వేశారని ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా సభ్యులను ప్రలోభాలకు గురి చేశారు. గతంలో వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు దొడ్డిదారిన అమ్ముడుపోయినా.. జగన్ నాయకత్వంలో 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలిచాం. కొనడం, ప్రలోభాలకు గురిచేయడంలో చంద్రబాబు దిట్ట అని అందరికీ తెలుసు. 9 రోజులుగా సభలో తెదేపా వారు చేస్తున్న చిల్లర చేష్టలను ప్రజలు చూస్తున్నారు. పార్టీ గుర్తు లేని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు గెలిస్తే తెదేపా వారు సంబరాలు చేసుకుంటున్నారు’’ అని విమర్శించారు.
మత్స్యకారులకు డీజిల్ రాయితీ పెంచాలి
ఎమ్మెల్యే పొన్నాడ
మత్స్యకారులకు డీజిల్పై ఇస్తున్న రాయితీని పెంచాలని వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయంపై ఆయన మాట్లాడుతూ..డీజిల్ లీటరు రూ.69 ఉన్నప్పుడు రాయితీ రూ.9 ఇచ్చి, ధర రూ.వందకు చేరినా అంతే ఇస్తున్నారని గుర్తుచేశారు. మత్స్యకార భరోసాను కుటుంబంలోని 18 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కుటుంబంలో ఒక్కరికే ఇవ్వడం వల్ల వేట లేని సమయంలో ఆ మొత్తం సరిపోవడం లేదని పేర్కొన్నారు. మెకనైజ్డ్ బోటుకు 12-15 మంది ఉంటారని, కానీ.. 8 మందికే బీమా అమలు చేస్తున్నారని తెలిపారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా బీమా వర్తింప చేయాలని కోరారు. వేట నిషేధ కాలంలో మార్పు చేయాలని విన్నవించారు. గతంలో మత్స్యకారులకు 75శాతం రాయితీపై వలలు, బోట్లు ఇవ్వగా.. ఇప్పుడు 40శాతంతోనే ఇస్తున్నారని తెలిపారు.
అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం అమలు చేయాలి
వైకాపా సభ్యులు
రాష్ట్రంలో ఉన్న 8,600 దేవాలయాలకూ ధూపదీప నైవేద్య పథకం అమలు చేయాలని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. అర్చకుల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ధూపదీప నైవేద్యాల కింద ఇస్తున్న రూ.5వేల మొత్తాన్ని పెంచాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. తితిదేకు లేఖలు రాస్తే సమాధానాలు రావడం లేదని, సభ్యులకు సమాధానాలు ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434