‘ఆయుష్మాన్ భారత్’లో నాలుగేళ్లల్లో రూ.1,514 కోట్లు
ఆయుష్మాన్ భారత్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లల్లో రూ.1,514.75 కోట్లు ఇచ్చినట్లు మంత్రి విడదల రజని తెలిపారు.
మంత్రి రజని
ఈనాడు, అమరావతి: ఆయుష్మాన్ భారత్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లల్లో రూ.1,514.75 కోట్లు ఇచ్చినట్లు మంత్రి విడదల రజని తెలిపారు. శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయుష్మాన్ భారత్ యోజనపై తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఈ పథకం కింద 1,949 ప్రొసిజర్స్ ఉన్నాయని, 55.30 లక్షల కుటుంబాలు అర్హత పొందుతున్నాయని తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 942 ప్రొసిజర్స్ ఉండగా.. తెదేపా హయాంలో అదనంగా 117 మాత్రమే తీసుకొచ్చారని వెల్లడించారు. ఇప్పుడు వాటిని 3,148 ప్రొసిజర్స్కు పెంచామని తెలిపారు. ఆరోగ్యశ్రీని తెదేపా హయాంలో అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని విమర్శించారు.
వైకాపా సీటు రాదనుకున్నవారే అమ్ముడుపోయారు
మంత్రి జోగి రమేష్
వచ్చే ఎన్నికల్లో వైకాపా సీటు రాదనుకున్న ఎమ్మెల్యేలు చంద్రబాబుకు అమ్ముడుపోయారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ఇళ్లు కట్టిస్తే జగన్ పేరు కొన్ని తరాలపాటు నిలిచిపోతుందని, పేదలకు ఇళ్లు దక్కకూడదని తెదేపా వారు కోర్టుల్లో కేసులు వేశారని ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా సభ్యులను ప్రలోభాలకు గురి చేశారు. గతంలో వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు దొడ్డిదారిన అమ్ముడుపోయినా.. జగన్ నాయకత్వంలో 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలిచాం. కొనడం, ప్రలోభాలకు గురిచేయడంలో చంద్రబాబు దిట్ట అని అందరికీ తెలుసు. 9 రోజులుగా సభలో తెదేపా వారు చేస్తున్న చిల్లర చేష్టలను ప్రజలు చూస్తున్నారు. పార్టీ గుర్తు లేని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు గెలిస్తే తెదేపా వారు సంబరాలు చేసుకుంటున్నారు’’ అని విమర్శించారు.
మత్స్యకారులకు డీజిల్ రాయితీ పెంచాలి
ఎమ్మెల్యే పొన్నాడ
మత్స్యకారులకు డీజిల్పై ఇస్తున్న రాయితీని పెంచాలని వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయంపై ఆయన మాట్లాడుతూ..డీజిల్ లీటరు రూ.69 ఉన్నప్పుడు రాయితీ రూ.9 ఇచ్చి, ధర రూ.వందకు చేరినా అంతే ఇస్తున్నారని గుర్తుచేశారు. మత్స్యకార భరోసాను కుటుంబంలోని 18 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కుటుంబంలో ఒక్కరికే ఇవ్వడం వల్ల వేట లేని సమయంలో ఆ మొత్తం సరిపోవడం లేదని పేర్కొన్నారు. మెకనైజ్డ్ బోటుకు 12-15 మంది ఉంటారని, కానీ.. 8 మందికే బీమా అమలు చేస్తున్నారని తెలిపారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా బీమా వర్తింప చేయాలని కోరారు. వేట నిషేధ కాలంలో మార్పు చేయాలని విన్నవించారు. గతంలో మత్స్యకారులకు 75శాతం రాయితీపై వలలు, బోట్లు ఇవ్వగా.. ఇప్పుడు 40శాతంతోనే ఇస్తున్నారని తెలిపారు.
అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం అమలు చేయాలి
వైకాపా సభ్యులు
రాష్ట్రంలో ఉన్న 8,600 దేవాలయాలకూ ధూపదీప నైవేద్య పథకం అమలు చేయాలని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. అర్చకుల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ధూపదీప నైవేద్యాల కింద ఇస్తున్న రూ.5వేల మొత్తాన్ని పెంచాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. తితిదేకు లేఖలు రాస్తే సమాధానాలు రావడం లేదని, సభ్యులకు సమాధానాలు ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్