వివేకా హత్య కేసును ఎన్నాళ్లు సాగదీస్తారు?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని నిలదీసింది.
దర్యాప్తులో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు
సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మరో దర్యాప్తు అధికారిని నియమించండి
ఇప్పుడున్న అధికారినీ కొనసాగించాలని సూచన
తదుపరి నిర్ణయాన్ని రేపటికల్లా చెప్పాలని సీబీఐ డైరెక్టర్కు నిర్దేశం
ఈనాడు - దిల్లీ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని నిలదీసింది. సీబీఐ దాఖలు చేసిన దర్యాప్తు స్థాయీ నివేదికలో.. పాత విషయాలే తప్ప కొత్తవేమీ లేవని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని సూచించింది. అలా చేస్తే దర్యాప్తు సరళి దెబ్బతిని, మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది విన్నవించడంతో ప్రస్తుత అధికారిని కొనసాగిస్తూనే కొత్త అధికారిని నియమించాలంటూ నిర్దేశించింది. దీనిపై నిర్ణయాధికారాన్ని సీబీఐ డైరెక్టర్కే వదిలిపెడుతున్నామని, వారు బుధవారానికల్లా అభిప్రాయాన్ని తమకు చెప్పాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, అందువల్ల దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్రెడ్డి సతీమణి తులశమ్మ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై గత సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం దర్యాప్తు పురోగతిపై స్థాయీ నివేదిక దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. సోమవారం దీనిపై మరోమారు విచారణ చేపట్టింది. వాదనలు ప్రారంభమైన వెంటనే జస్టిస్ ఎంఆర్ షా సీబీఐ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్త నివేదికలోనూ పాత విషయాలేనా?
‘సీబీఐ నివేదికలో గతంలో చెప్పిన విషయాన్నే చెప్పారు. గత స్థాయీ నివేదికతో పోల్చితే ఒక సహనిందితుడి వాంగ్మూలం మినహా కొత్త నివేదికలో ఎలాంటి పురోగతీ లేదు. దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. అందువల్ల దర్యాప్తు అధికారిని మార్చమని మీ డైరెక్టర్కు చెప్పండి. 2019, 2020, 2021ల్లో ఇది జరిగింది.. అది జరిగిందని మాత్రమే నివేదికలో పేర్కొన్నారు. అందులో రాజకీయ శత్రుత్వం గురించి తప్ప ఇంకేమీ లేదు. అది అంతిమంగా శిక్షకు దారి తీయకపోవచ్చు. హత్యకు రాజకీయ శత్రుత్వం కారణం కావొచ్చు.. అయితే కేవలం ఉద్దేశాల ఆధారంగా నిందితులకు శిక్ష విధించడం సాధ్యం కాదు. తదుపరి దర్యాప్తు పూర్తి చేసి హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని తేల్చకపోతే విచారణ జరగదు’ అని సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ను ఉద్దేశించి పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ చివరికల్లా దర్యాప్తు పూర్తి చేస్తామని నివేదికలో పేర్కొన్నట్లు నటరాజన్ విన్నవించారు. దర్యాప్తు జాప్యం చేయడానికి పిటిషనర్లు నిరంతరం కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. జస్టిస్ షా స్పందిస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్కు, ఆ కేసులకేమీ సంబంధం లేదన్నారు. స్థాయీ నివేదికలోని వివరాలు చూడాలని నటరాజన్ కోరగా అన్నీ చూశానని, హత్యకేసులో దర్యాప్తు చేసే తీరు ఇది కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇకపై అత్యంత వేగంగా పూర్తి చేస్తామని నటరాజన్ చెప్పారు. జస్టిస్ షా అందుకు అంగీకరించకుండా.. దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐకి సూచించారు.
కేసులు వేసి, దర్యాప్తును జాప్యం చేస్తున్నారు..
వివేకానందరెడ్డి కుమార్తె సునీత తరఫున హాజరైన మహిళా న్యాయవాది జేసల్ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో అనుమానితులు దర్యాప్తునకు అడ్డంకులు కల్పించడానికి పదేపదే కేసులు దాఖలు చేస్తున్నారని, దానివల్లే జాప్యం జరుగుతోందని చెప్పారు. కేసు దర్యాప్తు సరిగా జరగలేదని గతంలో మీరు కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు కదా అని జస్టిస్ షా గుర్తు చేశారు. జేసల్ స్పందిస్తూ దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారని నిందితులకు వ్యతిరేకంగా కేసు వేశాను కానీ, సీబీఐకి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలూ చేయలేదని పేర్కొన్నారు. ఆమె తన వాదనలను కొనసాగించబోగా.. జస్టిస్ షా స్పందిస్తూ ఈ కేసులో ఏ అధికారి ఉండాలన్నదానితో మీకేం సంబంధమని ప్రశ్నించారు. తాను ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానని, అధికారిని మారిస్తే దర్యాప్తులో కంటిన్యుటీ దెబ్బతిని, అది మరింత జాప్యానికి దారితీస్తుందని జేసల్ చెప్పారు. ఆ విషయాన్ని సీబీఐ డైరెక్టర్ చూసుకుంటారన్న న్యాయమూర్తి.. ప్రస్తుత దర్యాప్తు అధికారి కొనసాగుతారు, అదనంగా మరో దర్యాప్తు అధికారి ఉంటారని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ చెప్పినందున వారికి ఒక అవకాశమివ్వాలని ధర్మాసనాన్ని జేసల్ కోరారు. జస్టిస్ షా జోక్యం చేసుకుంటూ మరో దర్యాప్తు అధికారిని నియమించండి.. ఇప్పుడున్న అధికారిని కూడా అదనంగా కొనసాగనివ్వండి అన్నారు. అందుకు సీబీఐ న్యాయవాది అంగీకరించారు. పిటిషనర్ బెయిల్ అడిగారని, దాన్ని తిరస్కరిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. జస్టిస్ సీటీ రవికుమార్ జోక్యం చేసుకుంటూ ఫలానా వ్యక్తే దర్యాప్తు అధికారిగా ఉండాలని మీరెలా చెప్పగలుగుతారని సునీత తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. తర్వాత సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే స్పందిస్తూ సీబీఐపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, వారు ఏం నిర్ణయం తీసుకున్నా అంగీకారమేనన్నారు. జస్టిస్ షా స్పందిస్తూ కేసు దర్యాప్తు వేగంగా జరపాలని తామిచ్చిన ఉత్తర్వులను పాటించలేదన్నారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి త్వరగా విచారణ పూర్తి చేయలేకపోతున్నప్పుడు ఆ అధికారిని మార్చండి, అతని సాయంతో తదుపరి దర్యాప్తు కొనసాగించండని సూచించారు. సీనియర్ అధికారిని నియమించొచ్చని సిద్ధార్థ దవే చెప్పగా.. ఇలాంటి విషయాల్లో మీరు సూచనలు చేయకపోవడమే మంచిదని జస్టిస్ షా సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ