వివేకా హత్య కేసును ఎన్నాళ్లు సాగదీస్తారు?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని నిలదీసింది.
దర్యాప్తులో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు
సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మరో దర్యాప్తు అధికారిని నియమించండి
ఇప్పుడున్న అధికారినీ కొనసాగించాలని సూచన
తదుపరి నిర్ణయాన్ని రేపటికల్లా చెప్పాలని సీబీఐ డైరెక్టర్కు నిర్దేశం
ఈనాడు - దిల్లీ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని నిలదీసింది. సీబీఐ దాఖలు చేసిన దర్యాప్తు స్థాయీ నివేదికలో.. పాత విషయాలే తప్ప కొత్తవేమీ లేవని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని సూచించింది. అలా చేస్తే దర్యాప్తు సరళి దెబ్బతిని, మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది విన్నవించడంతో ప్రస్తుత అధికారిని కొనసాగిస్తూనే కొత్త అధికారిని నియమించాలంటూ నిర్దేశించింది. దీనిపై నిర్ణయాధికారాన్ని సీబీఐ డైరెక్టర్కే వదిలిపెడుతున్నామని, వారు బుధవారానికల్లా అభిప్రాయాన్ని తమకు చెప్పాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, అందువల్ల దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్రెడ్డి సతీమణి తులశమ్మ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై గత సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం దర్యాప్తు పురోగతిపై స్థాయీ నివేదిక దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. సోమవారం దీనిపై మరోమారు విచారణ చేపట్టింది. వాదనలు ప్రారంభమైన వెంటనే జస్టిస్ ఎంఆర్ షా సీబీఐ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్త నివేదికలోనూ పాత విషయాలేనా?
‘సీబీఐ నివేదికలో గతంలో చెప్పిన విషయాన్నే చెప్పారు. గత స్థాయీ నివేదికతో పోల్చితే ఒక సహనిందితుడి వాంగ్మూలం మినహా కొత్త నివేదికలో ఎలాంటి పురోగతీ లేదు. దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. అందువల్ల దర్యాప్తు అధికారిని మార్చమని మీ డైరెక్టర్కు చెప్పండి. 2019, 2020, 2021ల్లో ఇది జరిగింది.. అది జరిగిందని మాత్రమే నివేదికలో పేర్కొన్నారు. అందులో రాజకీయ శత్రుత్వం గురించి తప్ప ఇంకేమీ లేదు. అది అంతిమంగా శిక్షకు దారి తీయకపోవచ్చు. హత్యకు రాజకీయ శత్రుత్వం కారణం కావొచ్చు.. అయితే కేవలం ఉద్దేశాల ఆధారంగా నిందితులకు శిక్ష విధించడం సాధ్యం కాదు. తదుపరి దర్యాప్తు పూర్తి చేసి హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని తేల్చకపోతే విచారణ జరగదు’ అని సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ను ఉద్దేశించి పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు ఇంకా ఎన్నేళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ చివరికల్లా దర్యాప్తు పూర్తి చేస్తామని నివేదికలో పేర్కొన్నట్లు నటరాజన్ విన్నవించారు. దర్యాప్తు జాప్యం చేయడానికి పిటిషనర్లు నిరంతరం కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. జస్టిస్ షా స్పందిస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్కు, ఆ కేసులకేమీ సంబంధం లేదన్నారు. స్థాయీ నివేదికలోని వివరాలు చూడాలని నటరాజన్ కోరగా అన్నీ చూశానని, హత్యకేసులో దర్యాప్తు చేసే తీరు ఇది కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇకపై అత్యంత వేగంగా పూర్తి చేస్తామని నటరాజన్ చెప్పారు. జస్టిస్ షా అందుకు అంగీకరించకుండా.. దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐకి సూచించారు.
కేసులు వేసి, దర్యాప్తును జాప్యం చేస్తున్నారు..
వివేకానందరెడ్డి కుమార్తె సునీత తరఫున హాజరైన మహిళా న్యాయవాది జేసల్ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో అనుమానితులు దర్యాప్తునకు అడ్డంకులు కల్పించడానికి పదేపదే కేసులు దాఖలు చేస్తున్నారని, దానివల్లే జాప్యం జరుగుతోందని చెప్పారు. కేసు దర్యాప్తు సరిగా జరగలేదని గతంలో మీరు కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు కదా అని జస్టిస్ షా గుర్తు చేశారు. జేసల్ స్పందిస్తూ దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారని నిందితులకు వ్యతిరేకంగా కేసు వేశాను కానీ, సీబీఐకి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలూ చేయలేదని పేర్కొన్నారు. ఆమె తన వాదనలను కొనసాగించబోగా.. జస్టిస్ షా స్పందిస్తూ ఈ కేసులో ఏ అధికారి ఉండాలన్నదానితో మీకేం సంబంధమని ప్రశ్నించారు. తాను ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానని, అధికారిని మారిస్తే దర్యాప్తులో కంటిన్యుటీ దెబ్బతిని, అది మరింత జాప్యానికి దారితీస్తుందని జేసల్ చెప్పారు. ఆ విషయాన్ని సీబీఐ డైరెక్టర్ చూసుకుంటారన్న న్యాయమూర్తి.. ప్రస్తుత దర్యాప్తు అధికారి కొనసాగుతారు, అదనంగా మరో దర్యాప్తు అధికారి ఉంటారని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ చెప్పినందున వారికి ఒక అవకాశమివ్వాలని ధర్మాసనాన్ని జేసల్ కోరారు. జస్టిస్ షా జోక్యం చేసుకుంటూ మరో దర్యాప్తు అధికారిని నియమించండి.. ఇప్పుడున్న అధికారిని కూడా అదనంగా కొనసాగనివ్వండి అన్నారు. అందుకు సీబీఐ న్యాయవాది అంగీకరించారు. పిటిషనర్ బెయిల్ అడిగారని, దాన్ని తిరస్కరిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. జస్టిస్ సీటీ రవికుమార్ జోక్యం చేసుకుంటూ ఫలానా వ్యక్తే దర్యాప్తు అధికారిగా ఉండాలని మీరెలా చెప్పగలుగుతారని సునీత తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. తర్వాత సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే స్పందిస్తూ సీబీఐపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, వారు ఏం నిర్ణయం తీసుకున్నా అంగీకారమేనన్నారు. జస్టిస్ షా స్పందిస్తూ కేసు దర్యాప్తు వేగంగా జరపాలని తామిచ్చిన ఉత్తర్వులను పాటించలేదన్నారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి త్వరగా విచారణ పూర్తి చేయలేకపోతున్నప్పుడు ఆ అధికారిని మార్చండి, అతని సాయంతో తదుపరి దర్యాప్తు కొనసాగించండని సూచించారు. సీనియర్ అధికారిని నియమించొచ్చని సిద్ధార్థ దవే చెప్పగా.. ఇలాంటి విషయాల్లో మీరు సూచనలు చేయకపోవడమే మంచిదని జస్టిస్ షా సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!