ఆకర్షణీయ నగరాల్లో రూ.7,854 కోట్ల విలువైన ప్రాజెక్టులు
ఆకర్షణీయ నగరాల పథకంలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో రూ.7,854.30 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్
ఈనాడు, దిల్లీ: ఆకర్షణీయ నగరాల పథకంలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో రూ.7,854.30 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. భాజపా రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 281 ప్రాజెక్టుల్లో 90 ప్రాజెక్టుల పనులు పూర్తికాగా 191 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
కరీంనగర్, ఖమ్మం ఏపీ జాబితాలో..
విశ్రాంత సైనికోద్యోగుల ఆరోగ్య పథకం (ఈసీహెచ్ఎస్) జాబితాలో ఆంధ్రప్రదేశ్లో 67 ఆసుపత్రులు ఉన్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మంత్రి ఇచ్చిన సమాధానంలో కరీంనగర్, ఖమ్మం (ఒక్కో ఆసుపత్రి చొప్పున ఉన్నాయి) జిల్లాలను ఆంధ్రప్రదేశ్ జాబితాలో చూపారు.
* విశాఖపట్నం లైట్ మెట్రో ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు.
* ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ), అది ధ్రువీకరించిన సంస్థల్లో విక్రయించే ఖాదీ దుస్తులపై జీఎస్టీని మినహాయిస్తూ జీఎస్టీ మండలి ఆమోదించిందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* బేగంపేట విమానాశ్రయంలో 2022లో ఎయిర్ నావిగేషన్ పరికరాలను మార్చగా, 2021లో కడప విమానాశ్రయంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* మహిళా కొబ్బరిపీచు యోజన కింద ఆంధ్రప్రదేశ్లో 2009 నుంచి ఇప్పటి వరకు 5,757 మంది మహిళలకు శిక్షణ ఇప్పించినట్లు కేంద్ర సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* ఆకాంక్షిత జిల్లాల్లో ఆకాంక్షిత బ్లాక్ (మండలం) కింద ఆంధ్రప్రదేశ్లో చిప్పగిరి, మద్దికెర, హోళగుంద (కర్నూలు) వై.రామవరం, మారేడుమిల్లి, గంగవరం (అల్లూరి సీతారామరాజు), యర్రగొండపాలెం (ప్రకాశం), ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్), కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, కోడూరు (అన్నమయ్య), చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు (వైయస్ఆర్), భామిని (పార్వతీపురం మన్యం)లను ఎంపిక చేసినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
* 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 576 మంది క్రీడాకారులకు ఉద్యోగాలిచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్సభలో సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్