బ్రాండిక్స్కు ఇచ్చిన భూమిలో 500 ఎకరాలు ఖాళీ
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన బ్రాండిక్స్ ఇండియా అపరెల్ సంస్థ ఏర్పాటై పదేళ్లయినా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
పదేళ్లైనా పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు
ప్రారంభానికి నోచని నెల్లూరు ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్
ఆక్షేపించిన కాగ్
ఈనాడు, దిల్లీ: అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన బ్రాండిక్స్ ఇండియా అపరెల్ సంస్థ ఏర్పాటై పదేళ్లయినా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఆ సంస్థకు కేటాయించిన వెయ్యి ఎకరాల స్థలంలో ఇప్పటికీ 500 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు ఆక్షేపించింది. సంస్థ ఏర్పాటై పదేళ్లు పూర్తయినా పూర్తిస్థాయిలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణలో, అనుకున్న స్థాయిలో టెక్స్టైల్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యాలను చేరుకోలేక పోయిందని పేర్కొంది. ఇక్కడ 60వేల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యంగా కాగా 19వేల మందికే కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తికావడంలోనూ 27నెలల జాప్యం జరిగినట్లు తెలిపింది. అ విషయాలను గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే 14 యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఈ సెజ్కు అనుమతులు ఇచ్చామని, ఈ పార్కు ప్రారంభమైన తరవాత సెజ్ యూనిట్లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ విషయంలో పలు విధానపరమైన మార్పులు వచ్చినట్లు తెలిపింది. అది సెజ్లోని యూనిట్లకు ఇచ్చిన ఆదాయపన్ను మినహాయింపుపై తీవ్ర ప్రభావం చూపినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. వీటి కారణంగా పెట్టుబడుల ఆకర్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపింది. అయినా కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న 15 యూనిట్లలో 21వేల మంది పనిచేస్తున్నారని, మొత్తం పెట్టుబడులు రూ.1,098 కోట్లకు చేరాయని వివరించింది. మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి మరింత ప్రయత్నం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ద్వారా ఆడిట్ పరిశీలనలను అంగీకరించినట్లైందని కాగ్ పేర్కొంది.
ఇప్పటికీ ప్రారంభం కాని ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో 581.68 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్ ఇప్పటికీ ప్రారంభం కాలేదని కాగ్ పేర్కొంది. ఇక్కడ కంచెతో ప్రహరీ, కొన్ని రోడ్లు, ఒక గార్మెంట్ యూనిట్ నిర్మించడం మినహా మరే పనీ జరగలేదని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్పీవీ) సెజ్ స్థానంలో డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డీటీఏ)లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని ప్రణాళికను మార్చినట్లు కాగ్ తెలిపింది. సెజ్ను డీనోటిఫై చేసి డీటీఏగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ నిరభ్యంతర పత్రం రాలేదని పేర్కొంది. ఇక్కడ యూనిట్లు ఏర్పాటుచేయడానికి అవసరమైన అనుమతులనూ ఎస్పీవీ ఇంతవరకూ పొందలేదని గుర్తుచేసింది. ఈ పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.24కోట్లు విడుదల చేసిందని.. రూ.1,982 కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉండగా కేవలం రూ.44.41 కోట్లే వచ్చాయని 16 యూనిట్లలో ఒక్కటీ ప్రారంభం కాలేదని కాగ్ వివరించింది. 31 వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉన్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదని తెలిపింది. ఇప్పటికీ దీని నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని కాగ్ విచారం వ్యక్తం చేసింది.
* రూ.102.27 కోట్లతో 2006 జులై 1న మంజూరైన హిందూపుర్ వ్యాపార్ అపరెల్ పార్క్కు కేంద్ర ప్రభుత్వం తన వాటా రూ.40 కోట్లలో రూ.24 కోట్లు ఇచ్చిందని, ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయని కాగ్ ఆక్షేపించింది.
* అదే రోజు అనంతపురానికి మంజూరు చేసిన మరో పార్కు రద్దయినట్లు తెలిపింది.
* రూ.101.39 కోట్లతో 2011 సెప్టెంబర్లో మంజూరైన లేపాక్షి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ కూడా రద్దయినట్లు వెల్లడించింది.
* 2015 మార్చి 24న రూ.103.44 కోట్లతో మంజూరైన తారకేశ్వర్ పార్క్కి కేంద్రం తాను సమకూర్చే రూ.40 కోట్లలో రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు కూడా ఇంకా కొనసాగింపు దశలోనే ఉన్నట్లు పేర్కొంది.
* 2014 సెప్టెంబర్ 20న రూ.105.12 కోట్లతో మంజూరైన గుంటూరు టెక్స్టైల్ పార్క్ కూడా ఇదే పరిస్థితిలో ఉందని వెల్లడించింది.
* రూ.131.73 కోట్లతో 2014 సెప్టెంబర్ 20న మంజూరైన రంగరాయ టెక్స్టైల్ పార్క్, 2014 నవంబర్ 9న రూ.102.91 కోట్లతో మంజూరైన గౌతమ్ బుద్ధ టెక్స్టైల్ పార్క్ రద్దయినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.