బ్రాండిక్స్కు ఇచ్చిన భూమిలో 500 ఎకరాలు ఖాళీ
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన బ్రాండిక్స్ ఇండియా అపరెల్ సంస్థ ఏర్పాటై పదేళ్లయినా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
పదేళ్లైనా పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు
ప్రారంభానికి నోచని నెల్లూరు ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్
ఆక్షేపించిన కాగ్
ఈనాడు, దిల్లీ: అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన బ్రాండిక్స్ ఇండియా అపరెల్ సంస్థ ఏర్పాటై పదేళ్లయినా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఆ సంస్థకు కేటాయించిన వెయ్యి ఎకరాల స్థలంలో ఇప్పటికీ 500 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు ఆక్షేపించింది. సంస్థ ఏర్పాటై పదేళ్లు పూర్తయినా పూర్తిస్థాయిలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణలో, అనుకున్న స్థాయిలో టెక్స్టైల్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యాలను చేరుకోలేక పోయిందని పేర్కొంది. ఇక్కడ 60వేల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యంగా కాగా 19వేల మందికే కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తికావడంలోనూ 27నెలల జాప్యం జరిగినట్లు తెలిపింది. అ విషయాలను గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే 14 యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఈ సెజ్కు అనుమతులు ఇచ్చామని, ఈ పార్కు ప్రారంభమైన తరవాత సెజ్ యూనిట్లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ విషయంలో పలు విధానపరమైన మార్పులు వచ్చినట్లు తెలిపింది. అది సెజ్లోని యూనిట్లకు ఇచ్చిన ఆదాయపన్ను మినహాయింపుపై తీవ్ర ప్రభావం చూపినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. వీటి కారణంగా పెట్టుబడుల ఆకర్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపింది. అయినా కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న 15 యూనిట్లలో 21వేల మంది పనిచేస్తున్నారని, మొత్తం పెట్టుబడులు రూ.1,098 కోట్లకు చేరాయని వివరించింది. మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి మరింత ప్రయత్నం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ద్వారా ఆడిట్ పరిశీలనలను అంగీకరించినట్లైందని కాగ్ పేర్కొంది.
ఇప్పటికీ ప్రారంభం కాని ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో 581.68 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఎంఏఎస్ ఫ్యాబ్రిక్ పార్క్ ఇప్పటికీ ప్రారంభం కాలేదని కాగ్ పేర్కొంది. ఇక్కడ కంచెతో ప్రహరీ, కొన్ని రోడ్లు, ఒక గార్మెంట్ యూనిట్ నిర్మించడం మినహా మరే పనీ జరగలేదని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్పీవీ) సెజ్ స్థానంలో డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డీటీఏ)లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుచేయాలని ప్రణాళికను మార్చినట్లు కాగ్ తెలిపింది. సెజ్ను డీనోటిఫై చేసి డీటీఏగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ నిరభ్యంతర పత్రం రాలేదని పేర్కొంది. ఇక్కడ యూనిట్లు ఏర్పాటుచేయడానికి అవసరమైన అనుమతులనూ ఎస్పీవీ ఇంతవరకూ పొందలేదని గుర్తుచేసింది. ఈ పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.24కోట్లు విడుదల చేసిందని.. రూ.1,982 కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉండగా కేవలం రూ.44.41 కోట్లే వచ్చాయని 16 యూనిట్లలో ఒక్కటీ ప్రారంభం కాలేదని కాగ్ వివరించింది. 31 వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉన్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదని తెలిపింది. ఇప్పటికీ దీని నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని కాగ్ విచారం వ్యక్తం చేసింది.
* రూ.102.27 కోట్లతో 2006 జులై 1న మంజూరైన హిందూపుర్ వ్యాపార్ అపరెల్ పార్క్కు కేంద్ర ప్రభుత్వం తన వాటా రూ.40 కోట్లలో రూ.24 కోట్లు ఇచ్చిందని, ఇప్పటికీ ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయని కాగ్ ఆక్షేపించింది.
* అదే రోజు అనంతపురానికి మంజూరు చేసిన మరో పార్కు రద్దయినట్లు తెలిపింది.
* రూ.101.39 కోట్లతో 2011 సెప్టెంబర్లో మంజూరైన లేపాక్షి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ కూడా రద్దయినట్లు వెల్లడించింది.
* 2015 మార్చి 24న రూ.103.44 కోట్లతో మంజూరైన తారకేశ్వర్ పార్క్కి కేంద్రం తాను సమకూర్చే రూ.40 కోట్లలో రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు కూడా ఇంకా కొనసాగింపు దశలోనే ఉన్నట్లు పేర్కొంది.
* 2014 సెప్టెంబర్ 20న రూ.105.12 కోట్లతో మంజూరైన గుంటూరు టెక్స్టైల్ పార్క్ కూడా ఇదే పరిస్థితిలో ఉందని వెల్లడించింది.
* రూ.131.73 కోట్లతో 2014 సెప్టెంబర్ 20న మంజూరైన రంగరాయ టెక్స్టైల్ పార్క్, 2014 నవంబర్ 9న రూ.102.91 కోట్లతో మంజూరైన గౌతమ్ బుద్ధ టెక్స్టైల్ పార్క్ రద్దయినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్