NEET: సులభతరంగా ‘నీట్’.. పెరగనున్న పోటీ
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశ్నపత్రం ఈసారి కూడా సులభతరంగా వచ్చింది. గత ఏడాది సులువుగా ఉందని భావించగా, ఈసారి అంతకంటే సులభతరంగా ఉందని విద్యార్థులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.
రసాయనశాస్త్రంలోనే లోతుగా ప్రశ్నలు
రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
నీట్గా తయారై వస్తే..
నీట్ రాయడానికి జడలతో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద జుట్టు విరబోసుకుని లోపలికి వెళుతున్న విద్యార్థినులు
ఈనాడు, అమరావతి: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశ్నపత్రం ఈసారి కూడా సులభతరంగా వచ్చింది. గత ఏడాది సులువుగా ఉందని భావించగా, ఈసారి అంతకంటే సులభతరంగా ఉందని విద్యార్థులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పోటీతో పాటు కటాఫ్ మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నీట్-2023 ఆదివారం దేశవ్యాప్తంగా జరిగింది. మన రాష్ట్రంలో ఆఫ్లైన్ విధానంలో 140 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, ప్రశాంతంగా ముగిసింది. జీవశాస్త్రం ప్రశ్నలు ఇతర సబ్జెక్టుల కంటే అత్యంత సులువుగా ఉన్నాయని, భౌతికశాస్త్రం ప్రశ్నలు సాధారణ విద్యార్థి సైతం రాసేలా ఉన్నాయని, రసాయనశాస్త్రంలో మాత్రం కొన్ని ప్రశ్నలు లోతుగా (డెప్త్గా) ఇచ్చారని విద్యార్థులు పేర్కొన్నారు. మొత్తంగా ప్రవేశ పరీక్ష సులభంగానే ఉందని తెలిపారు. దీంతో గత ఏడాది ఓపెన్ కేటగిరీ కటాఫ్ మార్కులు 530 ఉండగా, ఈసారి 550కి పెరిగే అవకాశం ఉండొచ్చని విద్యారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం 200 నిమిషాల సమయం ఇచ్చారు. ఈసారి కూడా ఛాయిస్ విధానం, రుణాత్మక (నెగిటివ్) మార్కుల విధానం అమలు చేశారు.
విద్యారంగ నిపుణులు ఏమన్నారంటే..
భౌతికశాస్త్రం సులభంగా ఉందని, సాధారణ విద్యార్థి సైతం సులువుగా రాయొచ్చని, జీవశాస్త్రంలో గతంలో వచ్చిన ప్రశ్నలు ఈసారి ఎక్కువగా ఇచ్చారని శారదా విద్యా సంస్థలకు చెందిన వై.శారదాదేవి, జీవీ రావు తెలిపారు. మొత్తంగా ఎన్సీఆర్టీ పుస్తకాలతో సన్నద్ధమైన వారికి మంచి ర్యాంక్ తెచ్చుకునేందుకు వీలుంటుందన్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థల డీన్ సురేశ్బాబు మాట్లాడుతూ.. ఫిజిక్స్లో రోలింగ్ మోషన్ కాన్సెప్ట్పై ఇచ్చిన ఓ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్లో సమాధానం లేదని చెప్పారు. మొత్తంగా పరీక్ష మధ్యస్థంగా ఉందన్నారు.
క్షుణ్నంగా తనిఖీచేసి అనుమతి
అన్ని పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పడంతో ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేశాకే లోపలికి పంపారు. గొలుసులు, చెవి రింగులు, దిద్దులు, వాచీ, బెల్టులకు సైతం అనుమతి ఉండదని ముందే చెప్పడంతో.. దాదాపు విద్యార్థులంతా వాటిని తొలగించి పరీక్ష కేంద్రాలకు వచ్చారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరిగింది. అన్ని కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీవశాస్త్రం అత్యంత సులువు
గత ఏడాది జీవశాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉండగా, ఈసారి ఎంతో సులువుగా ఉన్నాయి. ఫిజిక్స్ కూడా బాగుంది. ఆర్గానిక్ కెమెస్ట్రీలో మాత్రం సులువుగా జవాబు ఎంపిక చేసుకునేలా ప్రశ్నలు లేవు. కొంత లోతుగా ఉన్నాయి.
ప్రియాంక, విద్యార్థిని, విజయవాడ
నిమిషం ఆలస్యం.. ‘కల’కిందులైంది!
చివరి నిమిషం ముగిశాక వచ్చిన ఓ విద్యార్థినిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దాదాపు ఇరవై నిమిషాల పాటు తల్లీకూతుళ్లు ఎంత వేడుకున్నా సిబ్బంది గేటు తీయకపోవడంతో.. అయ్యా! మీ కాళ్లు మొక్కుతా తలుపు తీయండి. ఏడాది పాటు కష్టపడి చదివింది. తండ్రి లేని పిల్ల కనికరించండి. ట్రాఫిక్ జాం కావడంతో ఆలస్యమైందని అక్కడి పోలీసును ఆ తల్లి వేడుకుంది. అయినప్పటికీ గేటు తీయకపోవడంతో.. ఏడుస్తున్న కుమార్తెను ఓదార్చుతూ వెనక్కు తీసుకెళ్లిందా తల్లి. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులోని రైజ్ కళాశాల నీట్ పరీక్షా కేంద్రం వద్ద ఆదివారం కనిపించిన దృశ్యాలివి.
ఈనాడు, ఒంగోలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా