మండే ఎండల్లో.. కారు జాగ్రత్త
రాష్ట్రం నిప్పుల కొలిమిలా ఉంది. అనేక ప్రాంతాల్లో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి వేడిలో కార్లలో ప్రయాణిస్తున్నవారు.. కొన్ని ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
రన్నింగ్లో పేలుతున్న టైర్లు, కాలిపోతున్న వాహనాలు
టైర్లలో అధిక గాలే ప్రమాదాలకు కారణం
అదనపు లైట్లు, హారన్ల వైరింగ్తో షార్ట్సర్క్యూట్కు అవకాశం
రాష్ట్రం నిప్పుల కొలిమిలా ఉంది. అనేక ప్రాంతాల్లో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి వేడిలో కార్లలో ప్రయాణిస్తున్నవారు.. కొన్ని ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల కారు టైర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అత్యంత వేగంతో వెళ్తున్న కారు టైరు పేలడంతో, నియంత్రణ తప్పి అందులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో జరిగిన ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అధిక వేడికి రన్నింగ్లో ఉన్న కార్లు, ఆగి ఉన్న కార్లలో సైతం మంటలు చెలరేగి ఆహుతవుతున్నాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల వెంకటాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు.
టైర్లలో గాలి కీలకం
* కారు టైర్లలో గాలి ప్రెజర్ ఎన్ని పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్ (పీఎస్ఐ) పాయింట్లు ఉందో తరచూ చెక్ చేయించుకోవాలి. కార్ల కంపెనీలు ఇచ్చే ప్రమాణాల కన్నా ఒకటి, రెండు పాయింట్లు తక్కువ ఉన్నా ఫర్వాలేదు గానీ ఎక్కువ ఉండకూడదు.
* కారు ప్రయాణిస్తున్నప్పుడు టైర్లలో ఒత్తిడి పెరుగుతుంది. టైర్లలో అధికంగా గాలి పట్టిస్తే టైరు లోపల ఒత్తిడి, ఎండల్లో బయటి వేడి వల్ల ఒత్తిడి మరింత పెరిగి.. వాటికి చిన్న రాయి తగిలినా పేలే ప్రమాదం ఉంది.
* టైర్లకు కంపెనీలు ఏడాది గ్యారంటీ ఇస్తాయి. తర్వాత కారు వినియోగం బట్టి మరో రెండు, మూడేళ్లు మన్నుతాయి. కారు వినియోగం, నిర్వహణ బట్టి టైరు మన్నిక 60 వేల కి.మీ.పైనే వస్తుంది. తర్వాత టైరు మార్చాలి. కొందరు నాలుగైదేళ్లయినా 10 వేల కి.మీ. మాత్రమే తిరిగామనే ఉద్దేశంతో.. టైర్లు మార్చకుండా పాతవాటితోనే నడిపిస్తారు. ఎండా వానలకు టైర్లు క్రమంగా గట్టిబడి, పగుళ్లు వస్తాయి. అవి ప్రమాదాలకు కారణమవుతాయి.
* కొత్త టైర్లు వేసినప్పుడు వాటి తయారీ సంవత్సరాన్ని చూడాలి. ఎప్పుడో తయారైనవి తీసుకోకూడదు.
టైర్లలో ఎక్కువ గాలి ఉంటే మైలేజ్ పెరుగుతుందనే భావన సరికాదు.
వైరింగ్లో మార్పులు చేస్తే షార్ట్సర్క్యూట్
* కార్ల తయారీ కంపెనీలు ప్రమాణాల ప్రకారం హెడ్లైట్లు, హారన్లు వంటివి ఏర్పాటు చేస్తాయి. ఇవికాకుండా యజమానులు అదనంగా మరికొన్ని అమరుస్తుంటారు. ఇందుకోసం వైరింగ్లో కొన్నిచోట్ల మార్పులు చేస్తారు. ఇది షార్ట్ సర్క్యూట్కు దారి తీసి, కారులో మంటలు చెలరేగేందుకు కారణమవుతుంది.
* సాధారణంగా కార్ల హెడ్లైట్లు 50-40 వాల్ట్లతో ఉంటాయి. కొందరు అధిక లైటింగ్ కోసం కంపెనీ ఇచ్చిన బల్బుల స్థానంలో 100-90 వాల్ట్ల బల్బులు ఏర్పాటు చేయిస్తారు. ఎల్ఈడీ లైట్లు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం వైరింగ్ సాకెట్ సిస్టమ్ను కట్ చేసి, దానికి అదనంగా వైర్లు కలిపి, టేప్ వేస్తారు. ఎండ వేడికి టేపులో జిగురు కరిగిపోయి, వైరు జాయింట్ బయటికొస్తుంది. అది ఇంజిన్లో అధిక వేడి ఉన్నచోట ఎక్కడైనా తగిలితే షార్ట్సర్క్యూట్ అవుతుంది.
ప్రాథమికంగా పాటించాల్సిన సూచనలు
* కారు ఇంజిన్ ఆన్ చేయగానే డిస్ప్లే బోర్డుపై అన్నీ చూపిస్తాయి. వాటిని సరిచూసుకోవాలి. ఏదైనా లైటు వెలుగుతూ ఇండికేషన్ ఇస్తే, దానిపై దృష్టిపెట్టాలి.
* దూర ప్రయాణాలు చేసేవారు 150- 200 కి.మీ. ప్రయాణించాక గానీ, రెండున్నర గంటలకోసారి గానీ కారును కొంత సమయం ఆపి మళ్లీ బయల్దేరడం మంచిది. వీలైతే కారును నీడలో ఆపాలి. అలాంటప్పుడు అద్దం కొంత దించితే, బయటి గాలి లోపలికి వెళ్లి.. వేడి కొంత తగ్గుతుంది.
* ఎక్కడికైనా బయలుదేరేందుకు సిద్ధమైనప్పుడు కారు వెంటనే స్టార్ట్ చేయకూడదు. ఏసీ ఆన్ చేయకూడదు. ముందుగా అద్దాలు దించి కారులోని గాలి బయటకు వెళ్లేలా చూడాలి. ఎండ వేడికి కారు లోపల ఉండే ప్లాస్టిక్, ఫైబర్, రెగ్జిన్తో చేసిన విడిభాగాల నుంచి వెలువడే విషవాయువులను బయటికి పంపడానికి ఇది చాలా అవసరం.
* ఎండలో కారు ఎక్కువ సమయం నిలిపి ఉంచినప్పుడు, ఇంజిన్ ఆపకుండా ఏసీ ఆన్ చేసి ఉంచుతుంటారు. దీనివల్ల ఇంజిన్ జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
పాత టైర్లలో గ్రిప్ ఉండదు
- హర్షిణ్, వాహన రంగ నిపుణుడు
పాత టైర్లలో గ్రిప్ ఉండదు. వాటి వల్ల డ్రైవరు కారును సక్రమంగా అదుపు చేయడం కష్టం. అందుకే సకాలంలో వాటిని మార్చాలి. ఎక్కువ గాలి పెట్టిస్తే.. టైరు మధ్య భాగంలో త్వరగా అరిగిపోతుంది. తక్కువ పెట్టిస్తే మధ్యభాగం కాకుండా రెండువైపులా అరిగిపోతుంది. టైరు ప్రమాణాల ప్రకారం గాలి ఉండేలా చూసుకోవాలి.
యాక్సెసరీస్ వేయించినప్పుడు జాగ్రత్తలు అవసరం
- గిరి, సీఈవో, వరణ్ మోటార్స్ కార్స్ విభాగం, విజయవాడ క్లస్టర్
కారుకు సాధారణంగా కంపెనీ ఇచ్చే లైటింగ్, హారన్, సౌండ్ సిస్టమ్ సరిపోతాయి. ఇవి కాకుండా అదనపు యాక్సెసరీలు వేయించాలనుకుంటే వైరింగ్లో సమస్య రాకుండా, సాకెట్ విధానంతో ఉన్నవాటిని చూసుకోవాలి. ఈ వైరింగ్ సక్రమంగా లేకపోతే షార్ట్సర్క్యూట్కు దారితీయొచ్చు.
లారీలకు పంక్చర్లు వేసేచోట కార్లకు గాలి పెట్టించొద్దు
- చంటి, చంటి కార్స్ నిర్వాహకులు, విజయవాడ
లారీ టైర్లకు పంక్చర్లు వేసేచోట్ల.. కార్లకు గాలి పెట్టిస్తే కొన్ని పీఎస్ఐ పాయింట్లు తక్కువగానే చూపిస్తుంది. ఉదాహరణకు కారు టైరుకు 32 పీఎస్ఐ పాయింట్ల గాలి పెట్టినట్లు మీటరులో చూపిస్తుంది. వాస్తవంగా అది ఇంకా ఎక్కువ పీఎస్ఐ పాయింట్లు ఉంటుంది. ఇది ప్రమాదకరం. అందుకే కార్లకు పెట్రోలు బంకుల వద్ద గాలి పెట్టించడం ఉత్తమం.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం