మండే ఎండల్లో.. కారు జాగ్రత్త
రాష్ట్రం నిప్పుల కొలిమిలా ఉంది. అనేక ప్రాంతాల్లో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి వేడిలో కార్లలో ప్రయాణిస్తున్నవారు.. కొన్ని ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
రన్నింగ్లో పేలుతున్న టైర్లు, కాలిపోతున్న వాహనాలు
టైర్లలో అధిక గాలే ప్రమాదాలకు కారణం
అదనపు లైట్లు, హారన్ల వైరింగ్తో షార్ట్సర్క్యూట్కు అవకాశం
రాష్ట్రం నిప్పుల కొలిమిలా ఉంది. అనేక ప్రాంతాల్లో 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటి వేడిలో కార్లలో ప్రయాణిస్తున్నవారు.. కొన్ని ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల కారు టైర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అత్యంత వేగంతో వెళ్తున్న కారు టైరు పేలడంతో, నియంత్రణ తప్పి అందులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో జరిగిన ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అధిక వేడికి రన్నింగ్లో ఉన్న కార్లు, ఆగి ఉన్న కార్లలో సైతం మంటలు చెలరేగి ఆహుతవుతున్నాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల వెంకటాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు.
టైర్లలో గాలి కీలకం
* కారు టైర్లలో గాలి ప్రెజర్ ఎన్ని పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్ (పీఎస్ఐ) పాయింట్లు ఉందో తరచూ చెక్ చేయించుకోవాలి. కార్ల కంపెనీలు ఇచ్చే ప్రమాణాల కన్నా ఒకటి, రెండు పాయింట్లు తక్కువ ఉన్నా ఫర్వాలేదు గానీ ఎక్కువ ఉండకూడదు.
* కారు ప్రయాణిస్తున్నప్పుడు టైర్లలో ఒత్తిడి పెరుగుతుంది. టైర్లలో అధికంగా గాలి పట్టిస్తే టైరు లోపల ఒత్తిడి, ఎండల్లో బయటి వేడి వల్ల ఒత్తిడి మరింత పెరిగి.. వాటికి చిన్న రాయి తగిలినా పేలే ప్రమాదం ఉంది.
* టైర్లకు కంపెనీలు ఏడాది గ్యారంటీ ఇస్తాయి. తర్వాత కారు వినియోగం బట్టి మరో రెండు, మూడేళ్లు మన్నుతాయి. కారు వినియోగం, నిర్వహణ బట్టి టైరు మన్నిక 60 వేల కి.మీ.పైనే వస్తుంది. తర్వాత టైరు మార్చాలి. కొందరు నాలుగైదేళ్లయినా 10 వేల కి.మీ. మాత్రమే తిరిగామనే ఉద్దేశంతో.. టైర్లు మార్చకుండా పాతవాటితోనే నడిపిస్తారు. ఎండా వానలకు టైర్లు క్రమంగా గట్టిబడి, పగుళ్లు వస్తాయి. అవి ప్రమాదాలకు కారణమవుతాయి.
* కొత్త టైర్లు వేసినప్పుడు వాటి తయారీ సంవత్సరాన్ని చూడాలి. ఎప్పుడో తయారైనవి తీసుకోకూడదు.
టైర్లలో ఎక్కువ గాలి ఉంటే మైలేజ్ పెరుగుతుందనే భావన సరికాదు.
వైరింగ్లో మార్పులు చేస్తే షార్ట్సర్క్యూట్
* కార్ల తయారీ కంపెనీలు ప్రమాణాల ప్రకారం హెడ్లైట్లు, హారన్లు వంటివి ఏర్పాటు చేస్తాయి. ఇవికాకుండా యజమానులు అదనంగా మరికొన్ని అమరుస్తుంటారు. ఇందుకోసం వైరింగ్లో కొన్నిచోట్ల మార్పులు చేస్తారు. ఇది షార్ట్ సర్క్యూట్కు దారి తీసి, కారులో మంటలు చెలరేగేందుకు కారణమవుతుంది.
* సాధారణంగా కార్ల హెడ్లైట్లు 50-40 వాల్ట్లతో ఉంటాయి. కొందరు అధిక లైటింగ్ కోసం కంపెనీ ఇచ్చిన బల్బుల స్థానంలో 100-90 వాల్ట్ల బల్బులు ఏర్పాటు చేయిస్తారు. ఎల్ఈడీ లైట్లు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం వైరింగ్ సాకెట్ సిస్టమ్ను కట్ చేసి, దానికి అదనంగా వైర్లు కలిపి, టేప్ వేస్తారు. ఎండ వేడికి టేపులో జిగురు కరిగిపోయి, వైరు జాయింట్ బయటికొస్తుంది. అది ఇంజిన్లో అధిక వేడి ఉన్నచోట ఎక్కడైనా తగిలితే షార్ట్సర్క్యూట్ అవుతుంది.
ప్రాథమికంగా పాటించాల్సిన సూచనలు
* కారు ఇంజిన్ ఆన్ చేయగానే డిస్ప్లే బోర్డుపై అన్నీ చూపిస్తాయి. వాటిని సరిచూసుకోవాలి. ఏదైనా లైటు వెలుగుతూ ఇండికేషన్ ఇస్తే, దానిపై దృష్టిపెట్టాలి.
* దూర ప్రయాణాలు చేసేవారు 150- 200 కి.మీ. ప్రయాణించాక గానీ, రెండున్నర గంటలకోసారి గానీ కారును కొంత సమయం ఆపి మళ్లీ బయల్దేరడం మంచిది. వీలైతే కారును నీడలో ఆపాలి. అలాంటప్పుడు అద్దం కొంత దించితే, బయటి గాలి లోపలికి వెళ్లి.. వేడి కొంత తగ్గుతుంది.
* ఎక్కడికైనా బయలుదేరేందుకు సిద్ధమైనప్పుడు కారు వెంటనే స్టార్ట్ చేయకూడదు. ఏసీ ఆన్ చేయకూడదు. ముందుగా అద్దాలు దించి కారులోని గాలి బయటకు వెళ్లేలా చూడాలి. ఎండ వేడికి కారు లోపల ఉండే ప్లాస్టిక్, ఫైబర్, రెగ్జిన్తో చేసిన విడిభాగాల నుంచి వెలువడే విషవాయువులను బయటికి పంపడానికి ఇది చాలా అవసరం.
* ఎండలో కారు ఎక్కువ సమయం నిలిపి ఉంచినప్పుడు, ఇంజిన్ ఆపకుండా ఏసీ ఆన్ చేసి ఉంచుతుంటారు. దీనివల్ల ఇంజిన్ జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
పాత టైర్లలో గ్రిప్ ఉండదు
- హర్షిణ్, వాహన రంగ నిపుణుడు
పాత టైర్లలో గ్రిప్ ఉండదు. వాటి వల్ల డ్రైవరు కారును సక్రమంగా అదుపు చేయడం కష్టం. అందుకే సకాలంలో వాటిని మార్చాలి. ఎక్కువ గాలి పెట్టిస్తే.. టైరు మధ్య భాగంలో త్వరగా అరిగిపోతుంది. తక్కువ పెట్టిస్తే మధ్యభాగం కాకుండా రెండువైపులా అరిగిపోతుంది. టైరు ప్రమాణాల ప్రకారం గాలి ఉండేలా చూసుకోవాలి.
యాక్సెసరీస్ వేయించినప్పుడు జాగ్రత్తలు అవసరం
- గిరి, సీఈవో, వరణ్ మోటార్స్ కార్స్ విభాగం, విజయవాడ క్లస్టర్
కారుకు సాధారణంగా కంపెనీ ఇచ్చే లైటింగ్, హారన్, సౌండ్ సిస్టమ్ సరిపోతాయి. ఇవి కాకుండా అదనపు యాక్సెసరీలు వేయించాలనుకుంటే వైరింగ్లో సమస్య రాకుండా, సాకెట్ విధానంతో ఉన్నవాటిని చూసుకోవాలి. ఈ వైరింగ్ సక్రమంగా లేకపోతే షార్ట్సర్క్యూట్కు దారితీయొచ్చు.
లారీలకు పంక్చర్లు వేసేచోట కార్లకు గాలి పెట్టించొద్దు
- చంటి, చంటి కార్స్ నిర్వాహకులు, విజయవాడ
లారీ టైర్లకు పంక్చర్లు వేసేచోట్ల.. కార్లకు గాలి పెట్టిస్తే కొన్ని పీఎస్ఐ పాయింట్లు తక్కువగానే చూపిస్తుంది. ఉదాహరణకు కారు టైరుకు 32 పీఎస్ఐ పాయింట్ల గాలి పెట్టినట్లు మీటరులో చూపిస్తుంది. వాస్తవంగా అది ఇంకా ఎక్కువ పీఎస్ఐ పాయింట్లు ఉంటుంది. ఇది ప్రమాదకరం. అందుకే కార్లకు పెట్రోలు బంకుల వద్ద గాలి పెట్టించడం ఉత్తమం.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.