JEE Advanced results: మనవాళ్లే అడ్వాన్స్డ్.. జేఈఈ టాప్ టెన్లో ఆరుగురు తెలుగు వారే
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఒకటి, రెండు ర్యాంకులతో పాటు ఏకంగా తొలి 10లో ఆరింటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు.
తెలంగాణ విద్యార్థి చిద్విలాస్రెడ్డికి తొలి ర్యాంకు..
ఏపీ విద్యార్థి రమేశ్ సూర్యతేజకు రెండో ర్యాంకు
ప్రొద్దుటూరు బాలిక నాగ భవ్యశ్రీకి.. అమ్మాయిల్లో తొలి స్థానం
100 లోపు ర్యాంకుల్లో 30 మంది జయకేతనం
ఈనాడు- హైదరాబాద్, అమరావతి, న్యూస్టుడే యంత్రాంగం: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఒకటి, రెండు ర్యాంకులతో పాటు ఏకంగా తొలి 10లో ఆరింటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో నలుగురు ఏపీ, ఇద్దరు తెలంగాణ విద్యార్థులు. హైదరాబాద్లో చదివిన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన వావిలాల చిద్విలాస్రెడ్డి 360 మార్కులకు 341 సాధించి జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేశ్ సూర్యతేజ రెండో ర్యాంకు సాధించాడు. అడ్డగడ వెంకటశివరామ్ (ఏపీ) 5, బిక్కిన అభినవ్చౌదరి (ఏపీ) 7, నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 9, యక్కంటి ఫణి వెంకటమణీందర్రెడ్డి (ఏపీ) 10వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో వైయస్ఆర్ జిల్లా అమ్మాయి నయకంటి నాగభవ్యశ్రీ 298 మార్కులు సాధించి దేశంలో మొదటి ర్యాంకు పొందగా.. జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు సాధించింది. ఈ నెల 4న జరిగిన అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ గువాహటి ఆదివారం విడుదల చేసింది. టాప్ 100లో 40 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ) విద్యార్థులు ఉన్నారని తెలిపింది. వారిలో 30 మంది తెలుగు వారు ఉండటం ఖాయమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
కౌన్సెలింగ్కు 43,773 మందికి అర్హత
ఈసారి జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.52 లక్షల మందిలో అడ్వాన్స్డ్ రాసేందుకు 1,89,744 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,80,372 మంది పరీక్ష రాశారు. అందులో కటాఫ్ మార్కుల ఆధారంగా 43,773 మందికి జోసా కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. వారిలో 36,264 మంది అబ్బాయిలు, 7,509 మంది అమ్మాయిలున్నారు. గతేడాది ఐఐటీల్లో మొత్తం 16,598, ఎన్ఐటీల్లో 23,994 సీట్లు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచే 7 వేల మంది వరకు!
ఈసారి టాప్ 200 ర్యాంకుల్లో 75 మంది, 300లోపు 121 మంది, 400లోపు 149 మంది, 500 ర్యాంకులోపు 174 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్కు చెందిన వారే ఉన్నారు. అంటే 500 ర్యాంకుల్లోపు 35 శాతం మంది ఈ జోన్ వారే. వారిలో కనీసం 125 మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. అడ్వాన్స్డ్లో అన్ని కేటగిరీల వారు కలిపి 43,773 మంది ఐఐటీల్లో సీట్లకు పోటీపడేందుకు అర్హత సాధించగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది వరకు ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి 10,432 మంది అర్హత పొందారు. వారిలో కనీసం 6 వేల మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో పరీక్షలు రాసిన వారు ఐఐటీ ఖరగ్పూర్ జోన్ కిందకు వస్తారు. ఆ జోన్ నుంచి 4,618 ఎంపికకాగా.. అందులో కనీసం 500 మంది ఈ మూడు జిల్లాల వారు ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తం మీద జోసా కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీ సీట్ల కోసం 7 వేల మంది వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడనున్నారు. కొన్నేళ్లుగా ఐఐటీల్లో ఏటా 18-20% సీట్లను తెలుగు విద్యార్థులు సాధిస్తున్నారు.
- జేఈఈ మెయిన్లో ప్రథమ ర్యాంకు సాధించిన హైదరాబాద్కు చెందిన వెంకటకౌండిన్య అడ్వాన్స్డ్లో 84వ ర్యాంకుకు పరిమితమయ్యాడు. సాయిదుర్గారెడ్డి మెయిన్లో 6వ ర్యాంకు పొందగా.. అడ్వాన్స్డ్లో 35 ర్యాంకు సాధించాడు. మెయిన్లో తొలి 10 ర్యాంకుల్లో ఉన్న మిగతా విద్యార్థులు అడ్వాన్స్డ్లో 100లోపు కనిపించలేదు. మెయిన్లో 15వ ర్యాంకు పొందిన వావిలాల చిద్విలాస్రెడ్డి అడ్వాన్స్డ్లో 1వ ర్యాంకు పొందటం విశేషం.
8వ తరగతి నుంచే లక్ష్యంగా పెట్టుకున్నా
- వావిలాల చిద్విలాస్రెడ్డి, ప్రథమ ర్యాంకు
జేఈఈ సాధించాలనే లక్ష్యం 8వ తరగతిలోనే పెట్టుకున్నా. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులందరికీ సాఫ్ట్వేర్ విద్యను అందుబాటులోకి తేవాలనేది నా లక్ష్యం. జేఈఈ కోసం సిద్ధమయ్యే విద్యార్థులు మొదటి నుంచి ఒకే రకమైన పుస్తకాలను అనుసరించాలి. ఎప్పుడు ప్రారంభించాం, ఎంత సమయం చదివామని కాకుండా ప్రణాళిక ప్రకారం చదివితే లక్ష్యం నెరవేరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!