JEE Advanced results: మనవాళ్లే అడ్వాన్స్డ్.. జేఈఈ టాప్ టెన్లో ఆరుగురు తెలుగు వారే
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఒకటి, రెండు ర్యాంకులతో పాటు ఏకంగా తొలి 10లో ఆరింటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు.
తెలంగాణ విద్యార్థి చిద్విలాస్రెడ్డికి తొలి ర్యాంకు..
ఏపీ విద్యార్థి రమేశ్ సూర్యతేజకు రెండో ర్యాంకు
ప్రొద్దుటూరు బాలిక నాగ భవ్యశ్రీకి.. అమ్మాయిల్లో తొలి స్థానం
100 లోపు ర్యాంకుల్లో 30 మంది జయకేతనం
ఈనాడు- హైదరాబాద్, అమరావతి, న్యూస్టుడే యంత్రాంగం: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఒకటి, రెండు ర్యాంకులతో పాటు ఏకంగా తొలి 10లో ఆరింటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో నలుగురు ఏపీ, ఇద్దరు తెలంగాణ విద్యార్థులు. హైదరాబాద్లో చదివిన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన వావిలాల చిద్విలాస్రెడ్డి 360 మార్కులకు 341 సాధించి జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేశ్ సూర్యతేజ రెండో ర్యాంకు సాధించాడు. అడ్డగడ వెంకటశివరామ్ (ఏపీ) 5, బిక్కిన అభినవ్చౌదరి (ఏపీ) 7, నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 9, యక్కంటి ఫణి వెంకటమణీందర్రెడ్డి (ఏపీ) 10వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో వైయస్ఆర్ జిల్లా అమ్మాయి నయకంటి నాగభవ్యశ్రీ 298 మార్కులు సాధించి దేశంలో మొదటి ర్యాంకు పొందగా.. జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు సాధించింది. ఈ నెల 4న జరిగిన అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ గువాహటి ఆదివారం విడుదల చేసింది. టాప్ 100లో 40 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ) విద్యార్థులు ఉన్నారని తెలిపింది. వారిలో 30 మంది తెలుగు వారు ఉండటం ఖాయమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
కౌన్సెలింగ్కు 43,773 మందికి అర్హత
ఈసారి జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.52 లక్షల మందిలో అడ్వాన్స్డ్ రాసేందుకు 1,89,744 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,80,372 మంది పరీక్ష రాశారు. అందులో కటాఫ్ మార్కుల ఆధారంగా 43,773 మందికి జోసా కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. వారిలో 36,264 మంది అబ్బాయిలు, 7,509 మంది అమ్మాయిలున్నారు. గతేడాది ఐఐటీల్లో మొత్తం 16,598, ఎన్ఐటీల్లో 23,994 సీట్లు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచే 7 వేల మంది వరకు!
ఈసారి టాప్ 200 ర్యాంకుల్లో 75 మంది, 300లోపు 121 మంది, 400లోపు 149 మంది, 500 ర్యాంకులోపు 174 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్కు చెందిన వారే ఉన్నారు. అంటే 500 ర్యాంకుల్లోపు 35 శాతం మంది ఈ జోన్ వారే. వారిలో కనీసం 125 మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. అడ్వాన్స్డ్లో అన్ని కేటగిరీల వారు కలిపి 43,773 మంది ఐఐటీల్లో సీట్లకు పోటీపడేందుకు అర్హత సాధించగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది వరకు ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి 10,432 మంది అర్హత పొందారు. వారిలో కనీసం 6 వేల మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో పరీక్షలు రాసిన వారు ఐఐటీ ఖరగ్పూర్ జోన్ కిందకు వస్తారు. ఆ జోన్ నుంచి 4,618 ఎంపికకాగా.. అందులో కనీసం 500 మంది ఈ మూడు జిల్లాల వారు ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తం మీద జోసా కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీ సీట్ల కోసం 7 వేల మంది వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడనున్నారు. కొన్నేళ్లుగా ఐఐటీల్లో ఏటా 18-20% సీట్లను తెలుగు విద్యార్థులు సాధిస్తున్నారు.
- జేఈఈ మెయిన్లో ప్రథమ ర్యాంకు సాధించిన హైదరాబాద్కు చెందిన వెంకటకౌండిన్య అడ్వాన్స్డ్లో 84వ ర్యాంకుకు పరిమితమయ్యాడు. సాయిదుర్గారెడ్డి మెయిన్లో 6వ ర్యాంకు పొందగా.. అడ్వాన్స్డ్లో 35 ర్యాంకు సాధించాడు. మెయిన్లో తొలి 10 ర్యాంకుల్లో ఉన్న మిగతా విద్యార్థులు అడ్వాన్స్డ్లో 100లోపు కనిపించలేదు. మెయిన్లో 15వ ర్యాంకు పొందిన వావిలాల చిద్విలాస్రెడ్డి అడ్వాన్స్డ్లో 1వ ర్యాంకు పొందటం విశేషం.
8వ తరగతి నుంచే లక్ష్యంగా పెట్టుకున్నా
- వావిలాల చిద్విలాస్రెడ్డి, ప్రథమ ర్యాంకు
జేఈఈ సాధించాలనే లక్ష్యం 8వ తరగతిలోనే పెట్టుకున్నా. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులందరికీ సాఫ్ట్వేర్ విద్యను అందుబాటులోకి తేవాలనేది నా లక్ష్యం. జేఈఈ కోసం సిద్ధమయ్యే విద్యార్థులు మొదటి నుంచి ఒకే రకమైన పుస్తకాలను అనుసరించాలి. ఎప్పుడు ప్రారంభించాం, ఎంత సమయం చదివామని కాకుండా ప్రణాళిక ప్రకారం చదివితే లక్ష్యం నెరవేరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్