AP Police Jobs: పోలీసు ఉద్యోగాలెక్కడ?
ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చినా దానికీ మోక్షం కల్పించట్లేదు.
నాలుగేళ్లలో ఒక్క పోస్టూ భర్తీ చేయని జగన్ సర్కారు
ఏటా 6,500 కొలువుల భర్తీ హామీ ఏమైపోయింది?
విడుదల చేసిన నోటిఫికేషన్కూ దక్కని మోక్షం
దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు ఇంకెన్నాళ్లు?
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాతపరీక్షల్లో
అర్హత సాధించిన లక్షన్నర మంది ఎదురుచూపులు
ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్
రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.
2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్
రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. డిసెంబరులో ఖాళీల్ని గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం. వారాంతపు సెలవు విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపడతాం.
2020 అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా సీఎం జగన్ ప్రకటన
నోటిఫికేషన్ల కోసం నిరీక్షణ ఉండదు
ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందోనని యువత ఎదురుచూస్తారు. నెలల తరబడి నోటిఫికేషన్లు రాక, అవి ఎప్పుడిస్తారో తెలియక ఒక్కోసారి మనోధైర్యం కోల్పోతుంటారు. ఈ పరిస్థితిని మారుస్తూ రాబోయే తొమ్మిది నెలల్లో జులై నుంచి 2022 మార్చి వరకూ ఏయే ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తామో వివరిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. ఈ వ్యవధిలో 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వాటిలో 450 పోలీసు పోస్టులున్నాయి.
2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంలో సీఎం జగన్
ఈనాడు - అమరావతి
ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చినా దానికీ మోక్షం కల్పించట్లేదు. ఉద్యోగ ప్రకటన విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ దేహదారుఢ్య, శారీరక్ష సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. కనీసం అవి ఎప్పుడు జరుపుతారో కూడా స్పష్టతివ్వడం లేదు. దీంతో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన 1.53 లక్షల మందికి నెలల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఎలాగూ ఇవ్వట్లేదు. కనీసం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకైనా ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి చేయకపోవటం ఏంటి? సీఎం గారూ... పోలీసు ఉద్యోగాలు ఇంకెప్పుడు ఇస్తారు? దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించేందుకు మీకు ఇంకెన్నాళ్లు పడుతుంది? ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా? ఇది నిరుద్యోగుల జీవితంతో చెలగాటం ఆడటం కాదా?
షెడ్యూల్ ప్రకటించటానికి ఇంకెన్నాళ్లు?
రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నవంబరు 28న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. నాలుగు నెలలు గడిచినా ఈ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ను పోలీసు నియామక మండలి ప్రకటించకపోవడంపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహిస్తామంటూ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త షెడ్యూల్ మాటే లేదు. ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన పీఎంటీ, పీఈటీ పరీక్షల షెడ్యూల్ను కూడా ఖరారు చేయలేదు.
తెదేపా హయాంలో మూడు నెలల్లోనే మొత్తం పూర్తి
తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం మూణ్నెలల్లోనే (2019 ఫిబ్రవరి నాటికే) పూర్తి చేసేశారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో తుది ఫలితాల విడుదల ఆగిపోయింది. అంతకు ముందే సిద్ధంగా ఉన్న తుది ఫలితాలను 2019 మేలో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం జూన్లో విడుదల చేసింది. అలా చూసినా మొత్తం భర్తీ ప్రక్రియ ఏడు నెలల్లోనే పూర్తయిపోయింది. తెదేపా హయాంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా శరవేగంగా జరగ్గా.. ఇప్పుడు వైకాపా హయాంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్ విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటికీ కనీసం పీఎంటీ, పీఈటీ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించని పరిస్థితి ఉంది. కనీసం ఆ దిశగా చొరవ కూడా కనిపించడం లేదు. దీనిపై వివరణ కోసం ‘ఈనాడు’ ప్రతినిధి పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్సింగ్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
జాబ్ క్యాలెండర్పై మాట తప్పారు
- 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి 450 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆ ఏడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అందులో పొందుపరిచారు. పోలీసు శాఖలో వేల ఖాళీలున్నా కేవలం 450 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇస్తామనటంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్యాలెండర్లో పేర్కొన్న గడువు ముగిసిపోయినా ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా జగన్ మాట తప్పారు.
- రాబోయే నాలుగేళ్లలో ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2020 అక్టోబరులో జగన్ చెప్పారు. ఆ లెక్కన చూసినా ఇప్పటికే 19,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాలి. కానీ ఆ జాడే లేదు.
- ఎట్టకేలకు అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత 6,511 కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి 2022 నవంబరులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ భర్తీ ప్రక్రియను కూడా ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు.
- తెదేపా హయాంలో అన్ని రకాల పరీక్షలు పూర్తయిన పోలీస్ ఉద్యోగాల ఫలితాలను జగన్ అధికారంలోకి వచ్చాక విడుదల చేశారు. అర్హత సాధించిన వారికి పోస్టింగులిచ్చారు. అది మినహా వైకాపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో సొంతంగా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ భర్తీ చేయకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!