AP Police Jobs: పోలీసు ఉద్యోగాలెక్కడ?
ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చినా దానికీ మోక్షం కల్పించట్లేదు.
నాలుగేళ్లలో ఒక్క పోస్టూ భర్తీ చేయని జగన్ సర్కారు
ఏటా 6,500 కొలువుల భర్తీ హామీ ఏమైపోయింది?
విడుదల చేసిన నోటిఫికేషన్కూ దక్కని మోక్షం
దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు ఇంకెన్నాళ్లు?
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాతపరీక్షల్లో
అర్హత సాధించిన లక్షన్నర మంది ఎదురుచూపులు
ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్
రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.
2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్
రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. డిసెంబరులో ఖాళీల్ని గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం. వారాంతపు సెలవు విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపడతాం.
2020 అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా సీఎం జగన్ ప్రకటన
నోటిఫికేషన్ల కోసం నిరీక్షణ ఉండదు
ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందోనని యువత ఎదురుచూస్తారు. నెలల తరబడి నోటిఫికేషన్లు రాక, అవి ఎప్పుడిస్తారో తెలియక ఒక్కోసారి మనోధైర్యం కోల్పోతుంటారు. ఈ పరిస్థితిని మారుస్తూ రాబోయే తొమ్మిది నెలల్లో జులై నుంచి 2022 మార్చి వరకూ ఏయే ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తామో వివరిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. ఈ వ్యవధిలో 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వాటిలో 450 పోలీసు పోస్టులున్నాయి.
2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంలో సీఎం జగన్
ఈనాడు - అమరావతి
ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్.. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చినా దానికీ మోక్షం కల్పించట్లేదు. ఉద్యోగ ప్రకటన విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ దేహదారుఢ్య, శారీరక్ష సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. కనీసం అవి ఎప్పుడు జరుపుతారో కూడా స్పష్టతివ్వడం లేదు. దీంతో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన 1.53 లక్షల మందికి నెలల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఎలాగూ ఇవ్వట్లేదు. కనీసం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకైనా ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి చేయకపోవటం ఏంటి? సీఎం గారూ... పోలీసు ఉద్యోగాలు ఇంకెప్పుడు ఇస్తారు? దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించేందుకు మీకు ఇంకెన్నాళ్లు పడుతుంది? ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా? ఇది నిరుద్యోగుల జీవితంతో చెలగాటం ఆడటం కాదా?
షెడ్యూల్ ప్రకటించటానికి ఇంకెన్నాళ్లు?
రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నవంబరు 28న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. నాలుగు నెలలు గడిచినా ఈ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ను పోలీసు నియామక మండలి ప్రకటించకపోవడంపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహిస్తామంటూ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త షెడ్యూల్ మాటే లేదు. ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన పీఎంటీ, పీఈటీ పరీక్షల షెడ్యూల్ను కూడా ఖరారు చేయలేదు.
తెదేపా హయాంలో మూడు నెలల్లోనే మొత్తం పూర్తి
తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం మూణ్నెలల్లోనే (2019 ఫిబ్రవరి నాటికే) పూర్తి చేసేశారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో తుది ఫలితాల విడుదల ఆగిపోయింది. అంతకు ముందే సిద్ధంగా ఉన్న తుది ఫలితాలను 2019 మేలో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం జూన్లో విడుదల చేసింది. అలా చూసినా మొత్తం భర్తీ ప్రక్రియ ఏడు నెలల్లోనే పూర్తయిపోయింది. తెదేపా హయాంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా శరవేగంగా జరగ్గా.. ఇప్పుడు వైకాపా హయాంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్ విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటికీ కనీసం పీఎంటీ, పీఈటీ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించని పరిస్థితి ఉంది. కనీసం ఆ దిశగా చొరవ కూడా కనిపించడం లేదు. దీనిపై వివరణ కోసం ‘ఈనాడు’ ప్రతినిధి పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్సింగ్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
జాబ్ క్యాలెండర్పై మాట తప్పారు
- 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి 450 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆ ఏడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అందులో పొందుపరిచారు. పోలీసు శాఖలో వేల ఖాళీలున్నా కేవలం 450 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇస్తామనటంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్యాలెండర్లో పేర్కొన్న గడువు ముగిసిపోయినా ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా జగన్ మాట తప్పారు.
- రాబోయే నాలుగేళ్లలో ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2020 అక్టోబరులో జగన్ చెప్పారు. ఆ లెక్కన చూసినా ఇప్పటికే 19,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాలి. కానీ ఆ జాడే లేదు.
- ఎట్టకేలకు అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత 6,511 కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి 2022 నవంబరులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ భర్తీ ప్రక్రియను కూడా ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు.
- తెదేపా హయాంలో అన్ని రకాల పరీక్షలు పూర్తయిన పోలీస్ ఉద్యోగాల ఫలితాలను జగన్ అధికారంలోకి వచ్చాక విడుదల చేశారు. అర్హత సాధించిన వారికి పోస్టింగులిచ్చారు. అది మినహా వైకాపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో సొంతంగా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ భర్తీ చేయకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం