YSRCP: వైకాపా వారి.. రేషన్ మాఫియా
వైకాపా అధికారంలోకి వచ్చాక.. రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. నిత్యావసరాల పంపిణీని గాల్లో దీపంలా మార్చేసి, చౌక బియ్యాన్ని పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలిస్తున్నారు.
ఎక్కడ పట్టుబడ్డా కేరాఫ్ కాకినాడే
కార్డుదారుకు చేరక ముందే దోపిడీ మొదలు
డీలర్లకు తూకం తగ్గించి సరఫరా
ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.4 వేల కోట్ల నష్టం
అధికారపార్టీ నేతలు, అనుచరుల దోపిడీ
ఈనాడు - అమరావతి
ఈనాడు, న్యూస్టుడే యంత్రాంగం
వైకాపా అధికారంలోకి వచ్చాక.. రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. నిత్యావసరాల పంపిణీని గాల్లో దీపంలా మార్చేసి, చౌక బియ్యాన్ని పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలిస్తున్నారు. వైకాపా నేతల భాషలోనే చెప్పాలంటే.. పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చౌక బియ్యం స్వాధీనం అని వార్తలు వస్తుండటమే దీనికి నిదర్శనం. మిల్లుల్లోనూ వందల టన్నుల్లో రేషను బియ్యం బయటపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకు 2.12 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే అందులో 40% వరకు పక్కదారి పడుతున్నాయంటే దోపిడీ ఎంత భారీ స్థాయిలో సాగుతుందో తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు సేకరించేది వేర్వేరు ప్రాంతాల్లో అయినా అధిక శాతం అక్రమ రవాణా వాహనాల గమ్యస్థానం మాత్రం కాకినాడలోని కొన్ని మిల్లులే. కొన్ని కృష్ణపట్నం వెళుతున్నాయి. అక్కడ నుంచి నౌకల్లో విదేశాలకు చేరిపోతున్నాయి.
బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడంతో.. అక్రమ వ్యాపారుల గొంతులో వెలక్కాయ పడినట్లయింది. అయినా కొనుగోలు మాత్రం ఆపలేదు. క్షేత్రస్థాయిలో బియ్యం సేకరించడం మాత్రం ఆగలేదు. నౌకల ద్వారా ఎగుమతులకు అవకాశం లేకపోవడంతో.. వాటిని మిల్లుల్లో నిల్వ చేస్తున్నారు. మొత్తంగా అధికార పార్టీ నేతల అండతో ఈ అక్రమ రవాణా మూడు వ్యాన్లు.. ఆరు లారీల్లా సాగిపోతోంది. పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొని తరలించడంతోపాటు.. తూకంలో తరుగు రూపంలో భారీగా గోదాముల నుంచి మాయం చేస్తున్నారు. కొన్నిచోట్ల పేదలకు నెలల తరబడి పంపిణీ కూడా జరగడం లేదు. మొత్తంగా ఏడాదికి రూ.4 వేల కోట్ల విలువైన బియ్యాన్ని వైకాపా నేతలు మింగేస్తున్నారు.
ఇంటింటికీ రేషన్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ
రాష్ట్రంలోని రేషను కార్డుదారులకు గత నాలుగేళ్లుగా ఏ నెలలోనూ బియ్యం సరిగా అందుతాయనే భరోసా దక్కలేదు. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో బియ్యం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి. రేషన్ బండ్ల (ఎండీయూ) ద్వారా పంపిణీ చేస్తారో, డీలర్ల ద్వారా ఇప్పిస్తారో కూడా అంతుపట్టదు. వచ్చినప్పుడు తీసుకోవడమే అన్నట్లుగా తయారైంది. ఎండీయూ ద్వారా బియ్యం వచ్చినా కొన్నిచోట్ల 20 కిలోలకు బదులు.. 10, 15 కిలోలే ఇస్తున్నారు. మిగిలిన బియ్యం లేవంటున్నారు. మొత్తంగా ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతో అవకతవకలు మరింత పెచ్చుమీరాయి. అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముచ్చటపడి ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కావడంతో, అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అక్రమాలు బయటపడినా, చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరొస్తుందనే భయంతో మిన్నకుంటున్నారు. అందులోనూ ముఖ్యమంత్రికి సన్నిహితుడైన కాకినాడ జిల్లాకు చెందిన నేత కుటుంబమే చక్రం తిప్పుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. ఒకటి రెండుచోట్ల మొక్కుబడి తనిఖీలతో సరిపెట్టేస్తున్నారు. దీంతో అక్రమార్కులు పట్టపగలే కార్డుదారుల నుంచి కిలోల లెక్కన బియ్యం కొనేసి, బాహాటంగానే తరలిస్తున్నారు. చౌకబియ్యం అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ పౌరసరఫరాలశాఖ.. రైస్ ఏజ్ టెస్టింగ్ యంత్రాలను ఏర్పాటుచేసినా ప్రయోజనం సున్నా.
- రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా పథకం, రాష్ట్ర ప్రభుత్వ కార్డుల కింద ఏటా 25 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఒక్కో కిలో బియ్యంపై రాయితీగా రూ.39.35 చొప్పున ఖర్చు చేస్తున్నాయి. అయితే ఇందులో 40% బియ్యం నల్లబజారుకు, అక్కడ నుంచి వివిధ రూపాల్లో మార్కెట్కు, విదేశాలకు చేరుతున్నాయి.
రాష్ట్రమంతా అదే తీరు
- విశాఖపట్నం జిల్లాలో ఎండీయూ వాహనాల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత పెడుతున్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్ సీ-2 జోన్ పార్క్ ఏరియాలోని రేషన్ బండి వద్ద అధిక శాతం కార్డుదారులకు.. ఇవ్వాల్సిన బియ్యం కన్నా తక్కువలో తక్కువ పది కేజీల వరకు కోత విధించారు. వాటికి బదులుగా డిజిటల్ రూపంలో నగదు చెల్లించారు. కొందరు వాచ్మన్లు తమకు బియ్యం కావాలన్నా ఇవ్వలేదు. అగనంపూడి 85వ వార్డు తలారివానిపాలెంలో ఈ నెల 9న చాలామందికి కిలోన్నర నుంచి రెండు కేజీల వరకు తగ్గించి ఇచ్చారు. దీనిపై కార్డుదారులు ప్రశ్నించగా ‘అధికారులు అంతే ఇమ్మన్నారు.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’ అని సమాధానం ఇచ్చారు. వంశీ అనే కార్డుదారుకు 15 కేజీల బియ్యానికి 13.50 కేజీలే ఇచ్చారు. మరికొందరికి 20 కేజీలకు 18.30, 19.30 కేజీలే దక్కాయి. అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎండీయూ నిర్వాహకుణ్ని సస్పెండ్ చేశారు.
- అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపో సేల్స్మన్, ఎండీయూ ఆపరేటర్ కలిసి.. 3.65 టన్నుల బియ్యం, 305 కేజీల పంచదార, 339 కేజీల కందిపప్పును పక్కదారి పట్టించారు. గ్రామాలకు వస్తే సిగ్నల్ సరిగ్గా ఉండదంటూ గిరిజనులను నమ్మించి ముందే వేలిముద్రలు తీసుకున్నారు. వ్యవహారం వెలుగులోకి రావడంతో సేల్స్మన్ను సస్పెండ్ చేసిన అధికారులు.. ఎండీయూ ఆపరేటర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో.
- ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం వ్యాపారానికి సూత్రధారులు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్సెంటర్ కేంద్రంగా.. మూతపడిన మిల్లులో దందా జరుగుతోంది. చౌక బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, తెల్లసంచుల్లో నింపి బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం పేరుతో విక్రయిస్తున్నారు. పెళ్లూరు ప్రాంతంలోనూ వైకాపా నేత ఆధ్వర్యంలో చౌకబియ్యం వ్యాపారం జరుగుతోంది. బాపట్ల జిల్లాలోని చీరాల, అద్దంకి ప్రాంతాలతోపాటు ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల పరిధిలోని డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో కొన్ని మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ తేలికపాటి పాలిష్ చేసి తెల్ల సంచుల్లోకి మారుస్తున్నారు. ఒంగోలుకు చెందిన అధికార పార్టీ కార్పొరేటర్ భర్త మరికొందరితో కలిసి నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో నిర్వహించే మిల్లులో ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడుసార్లు తనిఖీలు చేసి, 2వేల బస్తాలకు పైగా అక్రమ నిల్వలు గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లు రావడంతో కేవలం వంద బస్తాలే పట్టుబడ్డాయని తేల్చారు. ఒంగోలులో ఒక మహిళా ప్రజాప్రతినిధి కూడా స్నేహితురాలితో కలిసి డీలర్ల నుంచి బియ్యం సేకరించి వ్యాపారం చేస్తున్నారు.
- ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబం బియ్యం వ్యాపారంలో ఆరితేరారు. ఆయన భార్య ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని కాకినాడకు తరలిస్తున్నారు. గుడివాడలో ఇటీవల ధాన్యం మిల్లు నుంచి కాకినాడ తరలించేందుకు సిద్ధం చేసిన 380 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. మిల్లు లైసెన్సు సస్పెండ్ చేసి, 6ఏ కేసు పెట్టారు.
- తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది 118 కేసులు నమోదవగా పీడీఎస్ బియ్యం 3,117 క్వింటాళ్లు, కందిపప్పు 19 క్వింటాళ్లు, పంచదార 16 కింటాళ్లు పట్టుబడింది. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 82 కేసులు కట్టి.. 2,314 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మే 5న రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు తరలిస్తున్న 16.25 టన్నుల బియ్యాన్ని స్వాధీనపరుచుకుని, 6ఏ కేసు నమోదు చేశారు. గత నెల 29న రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు కొవ్వూరు హైవే కూడలి వద్ద రూ.17.08 లక్షల విలువైన సుమారు 23.70 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన వద్ద సుమారు రూ.9 లక్షల విలువైన బియ్యాన్ని పట్టుకున్నారు.
- డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేసి 1,350 క్వింటాళ్ల బియ్యం స్వాధీనపరుచుకున్నారు.
- కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ పురపాలక సంఘం కౌన్సిలర్ 144 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. ఈయనపై నిత్యావసర వస్తువుల చట్టం 6(ఏ) కేసు నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఏటా అక్రమంగా తరలించే రేషన్ బియ్యానికి సంబంధించి రెండొందల 6(ఏ) కేసులు నమోదవుతున్నాయి. రెండు జిల్లాల్లో పౌరసరఫరాల గోదాముల్లో 3 వేల టన్నులకు పైగా పట్టుబడిన రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
- విజయనగరంలోని బాలాజీనగర్ -నాగోజిపేట ప్రాంతంలో ఇటీవల ఎండీయూ వాహనాన్ని ఆహార సలహా కమిటీ సభ్యుడు బి.కాంతారావు తనిఖీ చేశారు. బియ్యం పంపిణీలో అవకతవకలు గుర్తించి 6ఏ కేసు నమోదు చేయడం అక్రమాలకు అద్దం పడుతోంది.
సరఫరాలోనే టన్నుకు 80 కిలోల దోపిడీ
మండల స్థాయి నిల్వ కేంద్రాలకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు పంపే బియ్యం తూకంలోనే భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఒక్కో బస్తాకు 3 నుంచి 5 కిలోల వరకు బియ్యం తగ్గుతున్నాయి. సగటున 4 కిలోల లెక్కన చూసినా.. టన్నుకు 80 కిలోలు అక్కడే వెనకేసుకుంటున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా నెలకు సుమారు 17 టన్నుల బియ్యాన్ని.. డీలర్లకు చేరక ముందే మింగేస్తున్నారు.
- మిల్లుల నుంచి గోదాములకు చేరే బియ్యంలో కొంత తరుగు ఉంటోంది. గోదాముల నుంచి డీలర్లకు చేరేసరికి ఇది మరింత పెరుగుతోంది. ఇలా మిగిలే బియ్యాన్ని నేరుగా గోదాముల నుంచే అక్రమ వ్యాపారుల మిల్లులకు చేరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గోదాముల నుంచి డీలర్లకు బియ్యం సరఫరా చేసే వాహన కాంట్రాక్టులకు భారీ డిమాండు ఉండటానికి ఇదే ప్రధాన కారణం. వీరికి బియ్యం అక్రమ రవాణా రూపంలో రూ.కోట్లు మిగులుతున్నాయి.
- బియ్యం బస్తా 50 కిలోలు ఉండటం లేదని డీలర్లు, ఎండీయూలు గగ్గోలు పెడుతున్నా.. పరిశీలిస్తామనే మాటలకే అధికారులు పరిమితమవుతున్నారు. దీంతో కొన్నిచోట్ల ఎండీయూ ఆపరేటర్లు కార్డుదారులకు ఇచ్చే బియ్యాన్ని తగ్గించి ఇస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు చందాన అందరికీ వాటాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం.
- రేషన్ డీలర్లకు ఇకపై తూకం వేయించి బియ్యం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు రెండు రోజుల కిందట హామీ ఇవ్వడం గమనార్హం.
జిల్లాల వారీగా రీసైక్లింగ్
కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని.. బస్తాలు మార్చి మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు చేరవేస్తున్నారు. బియ్యం తరలింపులో ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టమవుతోంది. ప్రతి జిల్లాలోనూ కొందరు వైకాపా నేతలకు చెందిన మిల్లుల్లోనే రీసైక్లింగ్ జరుగుతోందని ఇటీవల బియ్యం పట్టుబడిన సందర్భాల్లో వెల్లడైంది. మూతపడిన మిల్లులను అద్దెకు తీసుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తరలింపు సమయంలో ఒక్కో లారీకి రూ.లక్ష వరకు ముట్టచెబుతున్నారు. వాహనం రోడ్డెక్కిన దగ్గర నుంచి మిల్లుకు, అక్కడ నుంచి పోర్టు సమీపంలోని మిల్లుకు చేరే వరకు.. అంతా అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది.
పట్టపగలే కొనుగోలు.. యథేచ్ఛగా రవాణా
ఎండీయూ వాహనాలు లేక ముందు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసేవారు. కార్డుదారుల నుంచి కొన్నవి, ఇవ్వకుండా మిగుల్చుకున్న బియ్యాన్ని రాత్రి సమయాల్లో నల్లబజారుకు తరలించి విక్రయించేవారు. పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉండేది. విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తుండేవి. ఎండీయూ వ్యవస్థ ఏర్పాటయ్యాక.. వాటి ఆపరేటర్లే కొన్నిచోట్ల బియ్యం వ్యాపారం చేస్తున్నారు. చాలాచోట్ల కార్డుదారుల నుంచి నేరుగా వారే కిలో రూ.10 నుంచి రూ.15 వరకు ఇచ్చి కొంటున్నారు. అవే వాహనాల్లో అక్రమ వ్యాపారులకు చేరవేస్తున్నారు. బియ్యం వాహనాలే కావడంతో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయని తనిఖీ చేయడం దాదాపుగా జరగదు. ఇదే వారికి మరింత కలిసొస్తోంది. కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలుపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. సగటున ఒక్కో వాహనదారు రోజువారీ పంపిణీ చేసే బియ్యంలో 30% నుంచి 40% వరకు కార్డుదారుల నుంచి తిరిగి కొంటున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల రోజుకు 30 క్వింటాళ్లు పంపిణీ చేస్తే అందులో 12 క్వింటాళ్ల వరకు కొనేస్తున్నారు.
కేరాఫ్ కాకినాడే!
రాష్ట్రంలో ఏ మూలన రేషన్ బియ్యం పట్టుబడినా.. వాటి గమ్యస్థానం కాకినాడే అని బయటపడుతోంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేరాయి. కొన్నేళ్లుగా విదేశాలకు పెరుగుతున్న బియ్యం ఎగుమతుల లెక్కలే దీనికి నిదర్శనం. మండల తహసీల్దారు నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ఈ విషయం తెలిసినా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. తమ పార్టీలోని కొందరు నేతలే అక్రమ బియ్యం సేకరణ, ఎగుమతుల్లో సూత్రధారులుగా ఉన్నారని.. వైకాపా కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో బియ్యం వ్యాపారం మొత్తం వారి చేతుల్లోనే నడుస్తోంది. ఇతర దేశాలకు ఎగుమతులు, అవసరమైన గోదాములు కూడా వారే నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు జోరుగా సాగిన ఎగుమతులు.. కేంద్రం నిషేధం విధించడంతో తాత్కాలికంగా నిలిచాయి. అక్రమ బియ్యాన్ని సేకరించి ఎక్కడికక్కడే నిల్వలు చేసి, నిషేధం తొలగిన తర్వాత పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. కొన్నిచోట్ల రీసైక్లింగ్ చేసి మళ్లీ పౌరసరఫరాలశాఖ ద్వారా కార్డులకు పంపే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!