విశాఖలో ‘భూ’చోళ్లు!
ఎసైన్డ్ భూముల చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకున్న వైకాపా నేతలు కొందరు విశాఖలోని పేదల భూములపై కన్నేశారు.
ఎసైన్డ్ భూములపై వైకాపా కీలక నేతల కన్ను
చట్టసవరణ వస్తుందని తెలిసి వ్యూహాలు
ముందుగానే వందల ఎకరాల కొనుగోలు
ఈనాడు, విశాఖపట్నం, వన్టౌన్, న్యూస్టుడే: ఎసైన్డ్ భూముల చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకున్న వైకాపా నేతలు కొందరు విశాఖలోని పేదల భూములపై కన్నేశారు. ఎక్కడికక్కడ రైతుల మీద ఒత్తిడి తెచ్చి విలువైన భూముల్ని కొన్నారు. అడ్వాన్సులు చెల్లించి పత్రాలు రాయించుకున్నారు. కొంతకాలంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా ఎసైన్డ్ భూములపై 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులు ఆ ఎసైన్డ్ భూముల్ని అమ్ముకునే అవకాశం ఏర్పడినట్లయింది. ఇప్పటికే వాటిని ఒప్పందాల ద్వారా తమ పరం చేసుకున్న పెద్దలు... త్వరలో అధికారికంగా తమ పేరున మార్చుకోవటానికి ప్రభుత్వ తాజా నిర్ణయం అవకాశమిస్తోంది.
మంత్రి వ్యూహాలతో..
ఎసైన్డ్ భూముల్ని సొంతం చేసుకునేందుకు అమరావతి ప్రాంతానికి చెందిన ఒక మంత్రి వ్యూహాల మేరకు వారి కుటుంబీకులు విశాఖలో చక్రం తిప్పినట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇటీవల విశాఖ జిల్లాలోని 4 మండలాల పరిధిలో ముమ్మరంగా తిరిగారు. వీరికి ఇద్దరు విశ్రాంత రెవెన్యూ అధికారులు సహకారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం. పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో 300 ఎకరాలకుపైగా భూముల్ని ఒప్పంద పత్రాల ద్వారా కొన్నట్లు చెబుతున్నారు. మధురవాడ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందంటున్నారు.
- ఆనందపురం మండలం గుడిలోవలో మూడెకరాల భూమి కొనుగోలు విషయంలో రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఎకరాకు రూ.35 లక్షలు చెల్లిస్తామని, 9 నెలల్లోపు అభివృద్ధి ఒప్పందం చేసుకుంటామని అలా జరగకుంటే ఇచ్చిన ముందస్తు చెల్లింపును వదులుకొని భూమిని తిరిగిచ్చేస్తామని బేరసారాలు సాగించారు. తమకు రాజధాని స్థాయిలో ఉన్న పలుకుబడిని వివరించడంతో రైతులు భయపడి ఒప్పందం చేసుకోక తప్పలేదు. ఇదంతా మంత్రి కుటుంబసభ్యుల కనుసన్నల్లోనే జరిగిందంటున్నారు. ఆ మంత్రి కూడా ఇటీవల పలుమార్లు తనిఖీల పేరుతో విశాఖ వచ్చి వెళ్లారు. ఆయనకు విశాఖతో ఎక్కువ అనుబంధం ఉంది. గతంలో పనిచేసినప్పటి పరిచయాలను ఈ భూముల కొనుగోలుకు వినియోగించుకున్నట్లు చెబుతున్నారు.
ఈ ప్రాంతాల్లో..
అధికార పార్టీ నేతలు.. విశాఖ జిల్లాలోని పద్మనాభం, ఆనందపురం, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలాల్లో భారీగా భూముల్ని కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.30 లక్షల వరకు, మరికొందరు ఇంకా తక్కువకు కొన్నారు. ఓ నేత అండతో ఒకే చోట ఆనందపురం మండల పరిధిలో 30 ఎకరాల వరకు ఒక వ్యక్తి కొన్నట్లు సమాచారం. వీరందరికీ ప్రభుత్వ నిర్ణయం గురించి ముందే తెలియడంతో పేదల భూములను తమ పరం చేసుకున్నారు.
వెయ్యి ఎకరాలకు..
విశాఖలో 11 మండలాలున్నాయి. ఐదు మండలాల్లో దాదాపు పది వేల ఎకరాలకుపైగా పేదలకు ఎసైన్ చేశారు. వీటిలో జగనన్న కాలనీల కోసం ఇటీవల 6 వేల ఎకరాలు సమీకరించారు. వీఎంఆర్డీఎ, ఇతర అవసరాలకు 770 ఎకరాలు సమీకరిస్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్ద 3 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. ఆరు నెలలుగా స్థిరాస్తి వ్యాపారులు, అధికార పార్టీ నేతల అండదండలున్న వారు.. వెయ్యి ఎకరాలకు అడ్వాన్సులు చెల్లించి కొనుగోలు ఒప్పందాలు రాయించుకున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట