Mangalagiri: తమిళిసై గారూ.. ఏపీ రోడ్ల దుస్థితి చూడండి: కురగల్లులో వెలసిన ఫ్లెక్సీ
ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితిని తెలియజేయడానికి తమ గ్రామ రోడ్లే నిదర్శనమని తెలుపుతూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో తెలుగు యువత ఆధ్వర్యంలో శనివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఏర్పాటు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మంగళగిరి, తాడేపల్లి, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితిని తెలియజేయడానికి తమ గ్రామ రోడ్లే నిదర్శనమని తెలుపుతూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో తెలుగు యువత ఆధ్వర్యంలో శనివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై తుళ్లూరు మండలంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన నేపథ్యంలో ఆమె కురగల్లు మీదుగా వెళతారని తెలిసి దీన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ వస్తున్నారని గుంతలు పూడ్చారు తప్ప.. రోడ్ల అసలు పరిస్థితి ఇదంటూ చిత్రాలు, వివరాలను ఫ్లెక్సీలో ముద్రించారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై దాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు అక్కడకు చేరుకుని ఫ్లెక్సీ తొలగించాలని తెలుగు యువత నాయకుడు గుడారి గోపాలరావును ఆదేశించారు. ఆయన ససేమిరా అనడంతో గోపాలరావు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఫ్లెక్సీని చించేసి, ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్కు తరలించారు. గవర్నర్ వెళ్లిపోయిన తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా గుడారి గోపాలరావు మాట్లాడుతూ కురగల్లు రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఆర్డీఏ కమిషనర్, ఆర్అండ్బీ, గ్రామ పంచాయతీ అధికారులకు నాలుగేళ్లుగా అర్జీలు ఇస్తూనే ఉన్నామన్నారు. వారెవరూ స్పందించకపోవడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని తెలిపారు. గవర్నర్ లాంటి వారు వస్తేనే రోడ్లకు మరమ్మతులు చేస్తారా? అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?