జాగ్రత్త.. ఎండార్స్ చేసినా కేసులు పెడుతున్నారు: మంత్రి ధర్మాన
‘పూర్వం మాదిరిగా తప్పు చేస్తే తప్పించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. డిజిటలైజేషన్ విస్తృతమైన నేపథ్యంలో తప్పులు చేస్తే వెంటనే దొరికిపోయే అవకాశం ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు నేను సింపుల్గా ఎండార్స్ చేస్తే సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈనాడు - అమరావతి, విద్యాధరపురం - న్యూస్టుడే: ‘పూర్వం మాదిరిగా తప్పు చేస్తే తప్పించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. డిజిటలైజేషన్ విస్తృతమైన నేపథ్యంలో తప్పులు చేస్తే వెంటనే దొరికిపోయే అవకాశం ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు నేను సింపుల్గా ఎండార్స్ చేస్తే సీబీఐ కేసు నమోదు చేసింది. ‘ప్లీజ్ ఎగ్జామిన్, డూ నెససరీ యాక్షన్’ అని మంత్రి రాస్తే తప్పేమిటి?’ అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘భూముల సమస్యల పరిష్కారంలో ఉద్యోగులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. కొందరు రకరకాల వాదనలు చేస్తారు. నిబంధనలు వివరించి సున్నితంగా వాటిని తిరస్కరించే విధానాన్ని అలవర్చుకోవాలి. చిన్నచిన్న అపోహలు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఉంటాయి. ఉద్యోగులు ప్రతి విషయంపై అప్డేట్ కాకుండా ఉంటే అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖ పేరును ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని పేరు పెట్టడంపై సీఎం జగన్తో త్వరలోనే చర్చిస్తా. ‘టైటిల్ యాక్ట్’ త్వరలోనే రాష్ట్రంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రెవెన్యూ శాఖలో ముఖ్యమైన సంస్కరణలు అమల్లోనికి తెచ్చాం. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తాం’ అని పేర్కొన్నారు.
భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ టైటిల్ యాక్ట్ అమల్లోకి వస్తే తహసీల్దార్ల బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏసీబీ అధికారులు తనిఖీల పేరుతో మూడు, నాలుగు రోజులపాటు ఇబ్బంది పెడుతున్నారని చెప్పగానే ముఖ్యమంత్రి నిలిపివేయించారన్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోందన్నారు. జూన్ 20ని రెవెన్యూ డే గా ప్రకటించాలని, తమను ఉమ్మడి సర్వీస్ రూల్్్స పరిధిలోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ల సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మచంద్రారెడ్డి, విశ్వేశ్వరనాయుడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు దిల్లీరావు, వేణుగోపాలరెడ్డి, వీఆర్ఏ, వీఆర్ఓ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
టీసీ, వీసీల బెడద నుంచి కాపాడండి: ఉద్యోగులు
టెలీ కాన్ఫరెన్స్ (టీసీ), వీడియో కాన్ఫరెన్స్ (వీసీ)ల ఒత్తిడితో రోజువారీ కార్యకలాపాలను కూడా చేసుకోలేకపోతున్నామని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో కనీసం 25 రోజుల పాటు టీసీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నిర్వహిస్తూ ఉన్నతాధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం సందర్భంగా టీసీ, వీసీల గురించి వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఏకరవు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?