CM Jagan: చంద్రబాబు జైల్లో ఉన్నా బయటున్నా ఒకటే
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆయనపై నాకెలాంటి కక్షా లేదు
పవన్ జీవితమంతా చంద్రబాబును మోయడమే
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు ఆ పార్టీలోని సగం మంది తెదేపావారే
వైకాపా ప్రతినిధుల సభలో సీఎం జగన్ విమర్శలు
జనవరిలో పింఛను రూ.3వేలకు పెంపు
ఫిబ్రవరిలో పార్టీ మ్యానిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడి
ఈనాడు, అమరావతి: చంద్రబాబుకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబును ఎవరూ కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనపై నాకెలాంటి కక్షా లేదు. నేను లండన్లో ఉన్నప్పుడు బాబును పోలీసులు ఎత్తారు (అరెస్టు చేశారు)’ అంటూ నవ్వులు చిందించారు. ‘కేంద్రంలో భాజపా ఉంది. దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) భాజపాతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు ఆ పార్టీలోని సగం మంది తెదేపా మనుషులే. అయినా కేంద్రంలోని ఐటీ, ఈడీలు చంద్రబాబుపై విచారణ జరిపి అవినీతిపరుడని నిరూపించాయి. ఈడీ అయితే కొందరు దోషులనూ అరెస్టు చేసింది. ఐటీ విభాగం బాబుకు నోటీసులిచ్చింది. బాబు మీద మోదీ అవినీతి ఆరోపణలు చేసిన సమయానికి మనం (వైకాపా) ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే అప్పటికే మోదీకి, కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టే సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వనని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉపసంహరించుకున్నారు. ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన ఆ వ్యక్తిమీద విచారణ చేయకూడదట, ఆధారాలను చూసి కోర్టు రిమాండ్కు పంపినా చంద్రబాబులాంటి వారిని చట్టానికి పట్టివ్వడానికి వీల్లేదని పచ్చ బ్యాచ్లు వాదిస్తున్నాయి’ అని అన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన వైకాపా ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బాబును సమర్థిస్తే పేదవాడిని వ్యతిరేకించడమే, పెత్తందారీ వ్యవస్థను సమర్థించడమే అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. చంద్రబాబు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు మోసాలు, అబద్ధాలు గుర్తొస్తే.. మన పార్టీని చూసినప్పుడు, జగన్ను చూసినప్పుడు సామాజికన్యాయం గుర్తుకొస్తాయని జగన్ చెప్పారు.
పొత్తుల కోసం ప్రతిపక్షాల వెంపర్లాట
‘మన ప్రతిపక్షాలన్నీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. ప్రజలకు వారు చేసిన మంచి.. పెద్ద సున్నా కాబట్టి వారిలాంటి ఎన్ని సున్నాలు కలిసినా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే. ఒకరైతే (పవన్ కల్యాణ్ను ఉద్దేశించి) పార్టీ పెట్టి 15 సంవత్సరాలైంది. ఈ రోజుకూ ఆయనకు ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి లేడు, గ్రామంలో జెండా మోసే మనిషి లేడు. ఆయన జీవితమంతా చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోయడానికే. చంద్రబాబు చేసిన మోసాల్లో, దోచుకున్న దాంట్లో ఆయన భాగస్వామి. ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలనే ఆలోచిస్తారే తప్ప మంచి చేయాలనుకోరు. మీ బిడ్డ పొత్తులను నమ్ముకోడు. ప్రజలతోనే మనకు పొత్తు. ప్రజలకు మనం చేసిన మంచే మన బలం. ఏ గ్రామం, ఏ నియోజకవర్గంలోనైనా 87 శాతం పైచిలుకు ఇళ్లల్లో మనం చేసిన మంచే కనిపిస్తుంది. అలాంటప్పుడు వై నాట్ 175 అని అడుగుతున్నా’ అని జగన్ పేర్కొన్నారు.
అధికారమనే బాధ్యతతోనే చేయగలిగాం
‘అధికారమనేది మనకు బాధ్యతను మాత్రమే నేర్పింది. బాధ్యతగా వ్యవహరించాం కాబట్టే 52 నెలల పాలనలో రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సువర్ణాక్షరాలతో లిఖించబడేలా పాలన అందించాం. లంచాలు, వివక్షకు చోటు లేకుండా పౌరసేవల పంపిణీలో డీబీటీ ద్వారా గొప్ప విప్లవాత్మక మార్పులు చేయగలిగాం. లంచాలు, వివక్ష లేకుండా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగాం. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, మూడు రాజధానులను ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం. 13 జిల్లాల ఏపీని 26 జిల్లాలుగా అడుగులు వేశాం. మ్యానిఫెస్టోలోని 99 శాతం వాగ్దానాలను అమలు చేయడం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని.. మాట నిలబెట్టుకుంటాడని.. కష్టమైనా నష్టమైనా అండగా ఉంటాడని మంచి పేరు తెచ్చుకోగలిగాం. రాష్ట్రంలో 2.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. నా పాదయాత్రలో నేను తెలుసుకున్న వివిధ వర్గాల సమస్యలన్నింటికీ ఈ 52 నెలల్లో పరిష్కారం చూపగలిగాం’ అని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టో అమలు తీరుపై వాలంటీర్ల ప్రచారం
‘మార్చి, ఏప్రిల్లలో ఎన్నికలు జరగొచ్చు. మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికీ మన ఎన్నికల మ్యానిఫెస్టోను తీసుకువెళ్లాలి. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవ్వాలి’ అని జగన్ పార్టీ శ్రేణులకు చెప్పారు.
- గత నెల 30న మొదలైన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని నవంబరు 30 వరకు చేపట్టాలి.
- నవంబరు 1 నుంచి డిసెంబరు 10 వరకు 40 రోజులు ‘ఎందుకు ఆంధ్రప్రదేశ్కు జగనే కావాలి’ కార్యక్రమం ఉంటుంది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి మన మ్యానిఫెస్టో అమలు తీరును వివరిస్తారు. అదే సమయంలో 2014లో తెదేపా మ్యానిఫెస్టో అమలు చేయలేదని గృహసారథులు, సచివాలయ సమన్వయకర్తలు ఆ ఇంట్లో వారికి వివరించాలి.
- అక్టోబరు 25 నుంచి డిసెంబరు 31 వరకు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో రోజుకో నియోజకవర్గం చొప్పున 175 నియోజకవర్గాలను చుడుతూ ‘సామాజిక న్యాయ బస్సు యాత్ర’ ఉంటుంది. అందులో పార్టీకి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సీనియర్ నాయకులుంటారు. ఎమ్మెల్యేల అధ్యక్షతన వారి నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలి.
- జనవరి 1న సామాజిక పింఛన్లను రూ.3 వేలకు పెంచుతాం. జనవరి 10 వరకు ప్రతి గ్రామంలోనూ దీనికి సంబంధించిన సంబరాలు నిర్వహించాలి.
- జనవరి 10 నుంచి 20 వరకు ‘వైఎస్సార్ చేయూత’ కింద గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్లు పంపిణీ చేస్తాం.
- జనవరి 20 నుంచి 30 వరకు ‘వైఎస్సార్ ఆసరా’ చివరి విడతగా పొదుపు సంఘాల మహిళలకు రూ.6,500 కోట్లు ఇస్తాం’ అని ప్రకటించారు.
12న సామర్లకోటకు సీఎం జగన్
సీఎం జగన్ ఈ నెల 12న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో హెలికాప్టర్ ఎక్కి ఉదయం 10 గంటలకు పెద్దాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సామర్లకోట లే-ఔట్కు వెళతారు. ఇక్కడి జగనన్న కాలనీ నుంచి రాష్ట్రస్థాయి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
వైకాపా ప్రతినిధుల సభలో ఐప్యాక్ హంగామా
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రతినిధుల సమావేశానికి ఐప్యాక్ సభ్యులు దాదాపు 100 మందికి పైగా తరలివచ్చారు. సభాప్రాంగణానికి వచ్చీపోయే నేతలతో మాట్లాడారు. క్రూ పేరుతో వీరికి ప్రత్యేకంగా పాస్లు ఇవ్వడంతో వారు లోపలా కలియదిరిగారు. నేతలతో కలిసిపోయి.. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనే వివరాలు సేకరించారు. కొందరు మాత్రం వైకాపా పథకాలపై ఎలా ప్రచారం చేయాలో నేతలకు వివరించారు. తెదేపా, జనసేనలకు సంబంధించిన వ్యతిరేక అంశాలను జనంలోకి ఎలా తీసుకెళ్లాలో తెలిపారు.
పార్టీ సేవలో వాలంటీర్లు!
విజయవాడ, న్యూస్టుడే: సభకు నగరపాలక సంస్థ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ఎటువంటి సంబంధం లేకపోయినా... అధికారులు కొందరు స్వామిభక్తి ప్రదర్శించారు. సభ జరిగే ప్రాంతానికి రావాలని విజయవాడలోని వార్డు వాలంటీర్ల గ్రూపుల్లో ముందుగానే మెసేజ్లు పెట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు, ప్రజాప్రతినిధులకు సభా ప్రాంగణం చిరునామా, గేట్ల వివరాలు తెలిపేందుకు వాలంటీర్లు ముఖ్యంగా సభా ప్రాంగణం సమీపంలోని విజయవాడ తూర్పు, మధ్య నియోజకవర్గాల వాలంటీర్లంతా తప్పక హాజరు కావాలంటూ సమాచారం పంపారు. మహిళా వాలంటీర్లు స్వల్పంగా హాజరైనా, పురుష వాలంటీర్లు మాత్రం అధిక సంఖ్యలోనే వచ్చారు. వారంతా లోపలికి వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకు తరలించడంపై విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి