AP CID: కిలారు విషయంలో పొరపాటు జరిగింది
తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ పేరును వెబ్సైట్లో పొరపాటున నిందితుడిగా పేర్కొన్నట్లు సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ వివేకానంద హైకోర్టుకు నివేదించారు.
వెబ్సైట్లో రాజేష్ను నిందితుడిగా పేర్కొన్నాం
తొలగించాలని అధికారులకు తెలిపాం
హైకోర్టుకు నివేదించిన సీఐడీ న్యాయవాది
ఈనాడు, అమరావతి: తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ పేరును వెబ్సైట్లో పొరపాటున నిందితుడిగా పేర్కొన్నట్లు సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ వివేకానంద హైకోర్టుకు నివేదించారు. ఆ పేరును తొలగించాలని అధికారులకు సూచించానని తెలిపారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ఆయన కోరడంతో విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో తనను సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షిగా హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేస్తూ మరోవైపు వెబ్సైట్లో తనను నిందితుడిగా చూపుతోందని, లుకౌట్ నోటీసులు జారీచేసిందంటూ కిలారు రాజేష్ శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీసులను రద్దు చేయాలని కోరారు. తనను విచారించేందుకు ఇంటెలిజెన్స్ డీజీ, మరికొందరిని అనుమతించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ, సీమెన్స్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
వ్యాజ్యంలో పేర్కొన్న అంశాలివి..
‘విచారణ నిమిత్తం ఈ ఏడాది అక్టోబర్ 16న సీఐడీ ముందు హాజరు కాగా.. మోహన్, సుదర్శన్ అనే వ్యక్తులు సుమారు 50 నిమిషాలు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు చెందినవారి గురించి అడిగారు. మధ్యాహ్నం తర్వాతా మళ్లీ ప్రశ్నించారు. ‘డీజీ నిన్ను రమ్మన్నారు’ అని సీఐడీ డీఎస్పీ చెప్పడంతో డీజీ ఛాంబర్కు వెళ్లాను. ఇంటిలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి అక్కడ ఉన్నారు. ఆంజనేయులు నన్ను బెదిరించారు. నాపై కేసు పెట్టడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని, తమకు సహకరించకపోతే ఉపేక్షించబోమని కేసు దర్యాప్తుతో సంబంధం లేకున్నా ఆయన హెచ్చరించారు. తర్వాత సిబ్బంది సెక్షన్ 160, 91 నోటీసులు ఇచ్చి, మరుసటి రోజు (17న) మళ్లీ రావాలని చెప్పారు. మూడేళ్ల కిందటి దస్త్రాలను తీసుకురావాలని చెప్పడంతో మర్నాడు రావడం సాధ్యం కాదని చెప్పాను. దీనిపై సీఐడీ డీఎస్పీకి 17న సమాచారం ఇచ్చాను. రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరచకుండా అణచివేయడం కోసం, తెదేపా కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నానన్న ఉద్దేశంతో నన్ను వేధిస్తున్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నోటీసులు ఇవ్వకుండా సీఐడీని నిలువరించండి’ అని రాజేష్ తన పిటిషన్లో కోరారు.
సీఐడీ స్వేచ్ఛను హరిస్తోంది: న్యాయవాది ఆదినారాయణరావు
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్కు ఓ వైపు సాక్షిగా విచారణకు హాజరుకావాలని నోటీసు ఇస్తూ.. మరోవైపు నిందితుడిగా పేర్కొన్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న రాజేష్పై నిఘా పెట్టారు. బెదిరిస్తున్నారు. ఇంటిలిజెన్స్ వారు వెంబడిస్తున్నారు. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ వ్యక్తి ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్కు చెందిన హెడ్ కానిస్టేబుల్గా తేలింది. మొదటి నోటీసును గౌరవించి ఆయన సీఐడీ ముందు హాజరయ్యారు. నేరానికి పాల్పడినట్లు అంగీకరించాలని బెదిరించారు. తెలంగాణలో నివసించే ఆయనకు నోటీసిచ్చి తమ ముందు హాజరుకావాలని కోరే పరిధి ఏపీ సీఐడీకి లేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సీఐడీని నిలువరించండి’ అని కోరారు. సీఐడీ తరఫున వివేకానంద వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. పిటిషనర్ పేరును వెబ్సైట్లో నిందితునిగా పేర్కొనడంలో పొరపాటు జరిగిందన్నారు. తొలగించాలని అధికారులకు మౌఖికంగా తెలిపానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?