Kakinada: ‘2024లో ఓటరంటే ఏంటో చూపిస్తాం’.. సీఎం జగన్పై విరుచుకుపడ్డ యువతి
కాకినాడకు చెందిన ఎస్సీ యువతి బొజ్జా ఐశ్యర్య సీఎం జగన్ పాలన తీరుపై విరుచుకుపడ్డారు. ఆమె విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: కాకినాడకు చెందిన ఎస్సీ యువతి బొజ్జా ఐశ్యర్య సీఎం జగన్ పాలన తీరుపై విరుచుకుపడ్డారు. ఆమె విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆమె ఏమన్నారంటే.. ‘వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో 2014లో వైకాపాకు ఓటేశా. 2019లో కాళ్లచిప్పలు అరిగేలా ప్రచారం చేశా. మా మద్దతుతో సీఎం అయ్యావ్. మా సొంత అన్నయ్య సీఎం అయ్యాడన్నంతగా ఆనందించాం. ఆ సీటు ఎక్కాక మాకు ఏం చేశావ్? పిల్లలకు పెట్టే ఆహారంనుంచి అన్నింటినీ కలుషితం చేశావ్. నీ వెనుక ఉన్న డప్పులబ్యాచ్ మాటే వింటున్నావ్. బ్రిటిష్ పాలన తెచ్చావ్. నువ్వు పెంచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను చూసి మేమెందుకు భయపడాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఎస్సీలకు కార్లు ఇచ్చారు. నీ పాలనలో వాటిని అమ్మేసుకున్నాం.
మా రోదన, వేదన వినిపించడం లేదా? 2024లో నీకు ఓటరంటే ఏంటో చూపిస్తాం. కంగారు పడకు. నీకున్న బలం, దొంగ ఓట్లు, డబ్బుతో నెగ్గినా నువ్వు దిగే వరకు నీ గేటు ముందు కూర్చుంటా. ఏం చేస్తావో చేసుకో. నన్ను చంపేసినా నీ ఇష్టం. అన్నింటికీ తెగించి ఉన్నా. నీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళుతున్నారు. అదే ప్రతి గడపకూ నేనూ వెళతా. జగన్ మాకు ఎందుకు వద్దో కరపత్రాలనిస్తా. ఇంతకంటే దారుణ పాలన చూడలేం. బైబిల్ ఎంత బలమైందో నీకు తెలుసు. దేవుడే నీకు సమాధానం చెబుతారు. జగన్కు మాత్రం ఓటేయొద్దు. తెదేపా, జనసేన, నోటా ఎవరికి ఓటేస్తారో వేయండి. ఇప్పుడు వ్యవస్థను అవినీతిమయం చేశారు. దీన్ని సరిచేయడానికి రెండేళ్లు పడుతుంది. 2024లో డౌన్డౌన్ జగన్..’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి
ఎన్నికల ముందు వైకాపాను వీడి తెదేపాలో చేరారనే కక్షతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేష్పై వైకాపా బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండలం వైకాపా ఇన్ఛార్జి, సినీ రచయిత కోన వెంకట్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. -
షిర్డిసాయి కార్యాలయంలో సోదాల కలకలం
సీఎం జగన్కు సన్నిహితుడైన విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎన్నికలకు ఒక్క రోజు గడువు ఉన్న తరుణంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. -
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం చిత్తూరులో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం హెలికాప్టర్లో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాదగయలో హీరో రామ్చరణ్ పూజలు
కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని హీరో రామ్చరణ్, ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ సందర్శించారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగిన వారు రోడ్డు మార్గాన పిఠాపురం చేరుకున్నారు. -
అమ్మ.. అమరనాతూ!
వైకాపా ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే ఏదైనా సాధ్యమే. నిబంధనల్ని అడ్డగోలుగా అతిక్రమించి కావాల్సినవారికి దోచిపెట్టడానికి వారు సర్వదా సిద్ధమే. ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు మార్చేసి, అయినవారికి లబ్ధి చేకూర్చడమే. -
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న
ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని.. ఈ ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం, పెన్షన్ అందని పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
బోగస్ ఓటర్లపై ఫిర్యాదులతో తిరుపతిలో పెద్దఎత్తున తనిఖీలకు ఆదేశించాం
తిరుపతిలో పెద్దఎత్తున దొంగ ఓట్లు వేయించడానికి బయట ప్రాంతాల వారిని తీసుకొస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా స్థానిక లాడ్జిలు, అతిథిగృహాల్లో తనిఖీలు చేయాలని ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీల్ని ఆదేశించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా పేర్కొన్నారు. -
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
జగన్ ఆటవిక రాజ్యాన్ని అంతం చేయండి!
నమ్మి అధికారం అప్పగించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాలెన్నో లెక్కతేల్చడం ఆ బ్రహ్మ తరమైనా కాదు. జగన్ కిరాతకాలను వర్ణించేందుకు తెలుగు భాషలో పదాలేవీ సరిపోవు. -
ఊరూరా దన ప్రవాహం
-
అభివృద్ధా.. వినాశనమా.. ఎటువైపో తేల్చుకోండి
ఈ గట్టున.. అభివృద్ధి, ఆకాంక్షల పొద్దు. ఆ గట్టున.. అరాచకాలు, అప్పుల పద్దు. ఏ గట్టున ఉంటావో నిర్ణయించుకోవాలి. రేప్పొద్దున.. పోలింగ్ బూత్ ఎదుట నిల్చున్నప్పుడు, వేలికి ఇంకు పెట్టుకునేటప్పుడూ.. మీ పసివాళ్ల భవిష్యత్తు గురించీ ఆలోచించుకోవాలి. -
జగన్ మళ్లీ గెలిస్తే సర్వనాశనమే
‘‘పెత్తందారీ, భూస్వామ్య, ఫ్యాక్షన్ మనస్తత్వం, హింసాత్మక నేపథ్యం, ప్రజల్ని మభ్యపెట్టే కొద్దిపాటి రాజకీయ తెలివితేటలు కలగలిసిన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి జగన్. రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన ఉగ్రవాదానికి, కులాలు, ప్రాంతాల వారీగా సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందే కుట్రలకు ఆయన మారుపేరు. -
మద్యం దుకాణాల వద్ద బారులు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేశారు. పోలింగ్ అయ్యే వరకు దుకాణాలు తెరవరు. రెండు రోజుల పాటు దుకాణాలు తెరవరని తెలిసి మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు. -
అంతర్వేది, వాడపల్లి క్షేత్రాల్లో భువనేశ్వరి పూజలు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరి లోకేశ్వరి తదితరులు శనివారం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, కోనసీమ తిరుమల వాడపల్లిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
జగన్ సభలకేనా బస్సులు.. ఓటేసే వారికి ఉండవా!
జగన్ సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు. -
ప్రతిపక్షాలపై దాడులను నిలువరించాలి
పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయని ఏపీ ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ రవీంద్రబాబు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. -
సుపరిపాలన అందించే నేతను ఎన్నుకోవాలి
అరాచకానికి పరిష్కారం సుపరిపాలన.. దాన్ని అందిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగలిగే దార్శనిక నేతను ఎన్నుకోవాలని ‘ఏపీ టుమారో’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. -
దండనా ఆయనదే..
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రమాదంపై 60 ఏళ్ల వృద్ధురాలు పూందోట రంగనాయకమ్మ తన ఫేస్బుక్ పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం కక్ష పూని ఆమెకు సీఐడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. -
ఇదీ సంగతి!
-
ఓటు పాశుపతాస్త్రం.. సక్రమంగా వినియోగించుకుందాం
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన సమాజం, వ్యక్తిగత జీవితాలు బాగుపడాలన్నా, భవిష్యత్తు ఉజ్వలంగా మారాలన్నా మనం వేసే ఓటే కీలకం. ప్రస్తుతం మన రాష్ట్ర భవితను నిర్దేశించే అత్యంత కీలక ఎన్నికలు జరుగుతున్నవి.