ఆయనో ‘భూ’చోడు
ఈ వ్యవహారాలన్నింటిలో ఆయన ఆరితేరారు. రూ.కోట్ల ఆర్జనకు భూదందాలనే ఎంచుకున్నారు. ఖాళీ స్థలమైనా.. వివాదంలో ఉన్న భూమైనా కనపడితే చాలు సెటిల్ చేసేసుకుంటారు. అంతేకాదు.. అవకాశమున్న అన్ని అక్రమ మార్గాల్లోనూ చేతివాటం చూపిస్తారు.
వివాదాస్పద భూముల సెటిల్మెంట్లతో రూ.కోట్లలో సంపాదన
మట్కా, మద్యం, బెట్టింగుల్లోనూ చెయ్యి
కర్నూలు జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి దందా
ఈనాడు - అమరావతి
భూ కబ్జాలు.. దందాలు.. సెటిల్మెంట్లు..
ఈ వ్యవహారాలన్నింటిలో ఆయన ఆరితేరారు. రూ.కోట్ల ఆర్జనకు భూదందాలనే ఎంచుకున్నారు. ఖాళీ స్థలమైనా.. వివాదంలో ఉన్న భూమైనా కనపడితే చాలు సెటిల్ చేసేసుకుంటారు. అంతేకాదు.. అవకాశమున్న అన్ని అక్రమ మార్గాల్లోనూ చేతివాటం చూపిస్తారు. మాట వినని అధికారులను బదిలీ చేయిస్తారు. కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన ఆ సీనియర్ ప్రజాప్రతినిధి హస్తం బెట్టింగ్, కర్ణాటక మద్యం, రేషన్ బియ్యం, పేకాట.. ఇలా అన్ని అక్రమాల్లోనూ ఉంటుంది. ఆయన వారసుడూ వీటిని అందుకున్నారు. సెటిల్మెంట్ల కోసం 20 మంది ప్రైవేటు ఏజెంట్లను నియమించుకుని మరీ దందా కొనసాగిస్తున్నారు.
సెటిల్మెంట్లతో రూ.కోట్ల ఆర్జన
పంచాయితీ చేశారంటే.. ఆ ఆస్తి ఆయనకో, అనుచరులకో రావాల్సిందే. ఇదే ఆయన ప్రధాన ఆదాయవనరు. రూ.కోట్ల విలువ చేసే భూములు సెటిల్ చేసి, తానే రాయించుకుంటారు. ఈ సెటిల్మెంట్లను తన దగ్గరకు తెచ్చేందుకు 20 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఎక్కడ ఏ పంచాయితీ ఉన్నా ఈ సైన్యం వాలిపోతుంది. ఆదోని చుట్టుపక్కల సమస్యాత్మకంగా ఉన్న భూముల పంచాయితీలను వీరు తీసుకొస్తారు. ముందుగా ఆయన ప్రధాన అనుచరుడు తమ మనుషుల్లోని ఎస్సీలను బాధితుల వద్దకు పంపి ఆ భూమిని తమకే అమ్మేయాలని బెదిరిస్తారు. వారిపై బాధితులు తిరగబడితే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయిస్తామంటారు. చివరకు భూములు స్వాధీనం చేసుకుని, వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. బాధితులు స్టేషన్కు వెళ్తే.. పోలీసులే వారిని ఆ ప్రజాప్రతినిధి వద్దకు పంపుతున్నారు.
పంచాయతీ బోర్డు పీకేసి.. ప్లాట్లు వేసి..
ఆదోని శివారు మండిగిర పంచాయతీ తిరుమలనగర్లో ఒక వెంచర్లో పార్కు కోసం వదిలిన 72 సెంట్ల స్థలానికి పంచాయతీ భూమి అని గతంలోనే బోర్డు పెట్టారు. ఇప్పుడు దాన్ని తొలగించి, ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేశారు వైకాపా నేతలు. ఇక్కడ సెంటు రూ.10-15 లక్షల వరకు పలుకుతోంది. సరాసరి రూ.8-10 కోట్ల విలువైన భూమి ఇది. దీనిపై స్థానికులు జేసీకి ఫిర్యాదు చేయగా, వారిని ఆ ముఖ్య ప్రజాప్రతినిధి తన ఇంటికి పిలిపించుకుని.. ‘ఆ భూమి మా వాళ్లదే. వాళ్లు కోర్టులో కేసు వేశారు. అవసరమైతే మీరూ కోర్టుకు వెళ్లండి’ అని హెచ్చరించినట్లు తెలిసింది.
క్రికెట్ బెట్టింగ్కు అండగా..
ఆదోని కేంద్రంగా పెద్దఎత్తున క్రికెట్ బెట్టింగ్ కొనసాగుతోంది. నిర్వాహకులకు ఆ ప్రజాప్రతినిధి అండ ఉంటోంది. గత మేలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేసి రూ.80 లక్షల నగదు, ఒక స్కార్పియో, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక నిర్వాహకుడిని వదిలిపెట్టాలని ప్రజాప్రతినిధి చెప్పినా వినలేదని సీఐని వీఆర్లోకి పంపేశారు. ఇదే నిర్వాహకుడు ప్రపంచకప్పైనా బెట్టింగులు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై ఇప్పటి వరకూ 10కిపైగా కేసులున్నా ఆ ప్రజాప్రతినిధి వెంట పార్టీ కార్యక్రమాల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నారు.
కర్ణాటక అక్రమ మద్యం
ఈ ప్రజాప్రతినిధి అనుచరుల్లో కొందరు కర్ణాటక అక్రమ మద్యం రవాణా, విక్రయాలు చేస్తారు. పోలీసులు నామమాత్రపు దాడులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడైనా తన అనుచరులను పట్టుకుంటే వెంటనే వారిని విడిచిపెట్టాలని పోలీసులకు ఫోన్లు వెళ్తాయి.
వారసుడా.. వారెవ్వా!
రేషన్ బియ్యం రవాణాలో ఈ ప్రజాప్రతినిధి వారసుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ దందా నిర్వహణకు ఒక సిండికేట్ను ఏర్పాటు చేయించారు. ఆ సిండికేట్ బియ్యాన్ని కర్ణాటక వంటి ప్రాంతాలకు తరలిస్తోంది. అధికారులు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ముందే చూసుకుంటున్నారు.
సాయం కోసం వస్తే ఆక్రమణ
ఆదోని శివారులోని 352 సర్వే నంబరులో దాదాపు 4.54 ఎకరాల్లో 1992లో ఇద్దరు వ్యక్తులు వెంచర్ వేసి, కొందరికి ప్లాట్లు కేటాయించారు. తర్వాత వీరు ఆ ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించారు. భూమి తమదేనంటూ 424 మంది బయటకొచ్చారు. పంచాయితీ ఆ ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. బాధితులకు సెంటుకు రూ.లక్ష చొప్పున నామమాత్రపు ధర చెల్లించి లాక్కున్నారు. అదే భూమిని సెంటు రూ.8-10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మండిగిరి పంచాయతీలో ఓ మహిళకు చెందిన 70 సెంట్ల భూమిని ఆక్రమించుకొని వెంచర్ వేశారు. ప్రశ్నిస్తే ఆమె కుటుంబానికి నామమాత్రపు ధర చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
మట్కా మామూళ్లు..
ఆదోనిలో దాదాపు 40 మంది మట్కా నిర్వాహకులు ఉన్నారని పోలీసుల అంచనా. ఒక్కొక్కరు రోజూ రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ఆడిస్తున్నారు. ప్రతి నిర్వాహకుడి నుంచి నెలవారీ మామూళ్లు ప్రజాప్రతినిధి భార్యకు వెళ్తాయి.
అరగంటలో ఐపీఎస్ అధికారి బదిలీ
ఆదోని సబ్ డివిజన్ ఏఎస్పీగా అధిరాజ్సింగ్ రాణాను గత మేలో ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన అరగంటలోనే హెడ్క్వార్టర్కు బదిలీ చేశారు. డీఎస్పీ స్థానంలో ఐపీఎస్ అధికారి ఉంటే తమకు కష్టమని.. అప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి వైకాపా ముఖ్యనేతకు చెప్పి బదిలీ చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!