ఓటర్ల జాబితా బాధ్యతలు సచివాలయ సిబ్బందికా?
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం నిర్వహిస్తున్న ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు, ప్రభుత్వ అధికారుల్ని, సిబ్బందిని వినియోగించడాన్ని ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ)’ తీవ్రంగా తప్పుబట్టింది.
‘జగనే ఎందుకు కావాలంటే’లో అధికారులు ఎలా పాల్గొంటారు?
గవర్నర్, ఈసీకి ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ ఫిర్యాదు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం నిర్వహిస్తున్న ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు, ప్రభుత్వ అధికారుల్ని, సిబ్బందిని వినియోగించడాన్ని ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ)’ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు సీఎఫ్డీ ఇటీవల ఫిర్యాదు చేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ‘‘ప్రభుత్వం వేరు. పార్టీ వేరు. పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం అనైతికం, అధర్మం. ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు చేపట్టిన ఆ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బందిని వినియోగించడం తీవ్రమైన అధికార దుర్వినియోగమే. వైకాపాకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ల నుంచి వాలంటీర్ల వరకు అంతా అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలసి పాల్గొనడం దురదృష్టకరం. ఇది సివిల్ సర్వీస్ కోడ్కి విఘాతం కలిగించడమే. ప్రభుత్వ ఉద్యోగులు నిష్పాక్షికంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి’’ అని సీఎఫ్డీ పేర్కొంది. ఈ మేరకు సీఎఫ్డీ అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.గోపాలరావు, సీఎఫ్డీ కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ గవర్నర్కు లేఖ రాశారు. దీంతో పాటు ఓటర్ల జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సీఎఫ్డీ ఫిర్యాదు చేసింది.
వారికి ఓటర్ల జాబితాల బాధ్యతా?
రాష్ట్రంలో అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజకీయరంగు పులుముకున్న వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఓటర్ల జాబితా రూపకల్పన వంటి బాధ్యతల్లో కొనసాగించడం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వైఫల్యంగా సీఎఫ్డీ అభిప్రాయపడింది. ఓటర్ల జాబితాలో గతంలో ఎన్నడూ లేనంతగా అవకతవకలు చోటు చేసుకోవడానికి, తప్పులు దొర్లడానికి ఈ ప్రక్రియలో సచివాలయ సిబ్బందిని వినియోగించడమే కారణమని పేర్కొంది. ‘గతంలో ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇన్ని తప్పులు ఎప్పుడూ దొర్లలేదు. ఇప్పటికైనా ఎన్నికల జాబితాల బాధ్యతల నుంచి సచివాలయ సిబ్బందిని తొలగించి, ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులకు అప్పగించాలి. ఎన్నికల్ని స్వేచ్ఛగా సక్రమంగా నిర్వహించేందుకు కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితాలు అవసరం. అలాంటి ఓటర్ల జాబితాల రూపకల్పనలో సచివాలయ సిబ్బందిని వినియోగించినందుకు, గతంలో ఎన్నడూ లేనంతగా తప్పులు దొర్లడానికి పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘం, ప్రత్యక్షంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాధ్యత వహించాలి’’ అని పేర్కొంది.
తప్పులు సరిదిద్దకుండా జాబితా ఎలా?
ఎన్నికల జాబితాల్లో అనేక తప్పులు దొర్లాయని ఈ ఏడాది సెప్టెంబరు 8న రాసిన లేఖలో సీఈఓ స్వయంగా అంగీకరించారని సీఎఫ్డీ పేర్కొంది. వాటిలో కొన్ని తప్పుల్ని మాత్రమే సరిదిద్దారని తెలిపింది. సీఈఓ లేఖ ప్రకారం... ‘సున్న’ నంబరుతో ఉన్న ఇళ్లు 2,51,767 ఉంటే, వాటిలో 61,374 మాత్రమే సరిదిద్దారని, పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు 1,57,939గా నమోదైతే, వాటిలో 21,347 మాత్రమే సరిదిద్దారని పేర్కొంది. సీఈఓ స్వయంగా అంగీకరించిన తప్పుల్ని సరిదిద్దకుండా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించడం తీవ్ర అభ్యంతరకరమని, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ‘‘కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయాల్లో పనిచేస్తున్న అనుభవం, నిష్పాక్షికత కొరవడిన సిబ్బందిని ఓటర్ల జాబితాల రూపకల్పనలో భాగస్వాముల్ని చేయడం అనేక అనుమానాలకు, అభ్యంతరాలకు తావిస్తోంది. ఆ జాబితాల్లో దొర్లిన తప్పుల్ని సరిదిద్దే బాధ్యతను మళ్లీ వారికే అప్పగించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఎన్నికల సంఘం, సీఈఓ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’’ అని కోరారు.
అర్హులందరికీ ఓటు హక్కు పునరుద్ధరించాలి
రాష్ట్రంలో దురుద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు పెట్టి ఓట్లు తొలగించిన వారందరికీ ఓటు హక్కు పునరుద్ధరించాలని సీఎఫ్డీ డిమాండ్ చేసింది. అధికార పార్టీకి మేలు చేసేందుకు జరిగిన ఓట్ల తొలగింపు కుట్రలో సచివాలయ సిబ్బందిని బాధ్యులుగా పేర్కొంది. ఓట్లర్ల జాబితాలను సక్రమంగా, నిష్పాక్షికంగా రూపొందించాలని, తప్పులన్నీ వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల