కడపలో ఉన్నాం.. వచ్చి ఓట్లు వేస్తాం!
ఈ ఇంటిని చూశారా... కింద దుకాణం ఉంది. ఒకటో అంతస్తులో నలుగురు సభ్యుల కుటుంబం నివసిస్తోంది. ఈ ఇంటి నంబరు 77-149-20తో ఓటరు జాబితాలో 51 ఓట్లున్నాయి. ఇంట్లోని వారివి తప్ప, మిగతా వాటిని తొలగించాలని కొందరు దరఖాస్తులు చేస్తే.. ఎట్టకేలకు 30 తొలగించారు.
మా పేర్లను జాబితా నుంచి తొలగించవద్దు
బీఎల్వోలకు దొంగ ఓటర్ల విన్నపాలు
విజయవాడ సెంట్రల్లో విచిత్రం
15 వేల మంది మృతుల పేర్లు యథాతథం
ఈనాడు, అమరావతి
ఈ ఇంటిని చూశారా... కింద దుకాణం ఉంది. ఒకటో అంతస్తులో నలుగురు సభ్యుల కుటుంబం నివసిస్తోంది. ఈ ఇంటి నంబరు 77-149-20తో ఓటరు జాబితాలో 51 ఓట్లున్నాయి. ఇంట్లోని వారివి తప్ప, మిగతా వాటిని తొలగించాలని కొందరు దరఖాస్తులు చేస్తే.. ఎట్టకేలకు 30 తొలగించారు. మరో 21 ఓట్లు అలాగే ఉన్నాయి. జాబితాలో పేర్లున్న వారికి ఫోన్లు చేస్తే... ‘మేం కడపలో ఉన్నాం. మా ఓట్లు తీసేయకండి. ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లేస్తాం’ అని బీఎల్వోలకు సమాధానం చెబుతున్నారు. దీంతో వారు వాటిని తొలగించలేదు. ఈ విచిత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్లో చోటుచేసుకుంది. దీనిపై నున్న పోలీసుస్టేషన్లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. విచారణ చేయలేదు.
ఇలాంటి చిత్రవిచిత్రాలు నియోజవకర్గంలో చాలానే ఉన్నాయి. జాబితాల్లో ఓట్ల తొలగింపునకు సంబంధించి ఫోన్లు చేస్తే... ‘మేం కడపలో ఉన్నాం.. హైదరాబాద్లో ఉన్నాం.. ఖమ్మంలో ఉన్నాం అనీ... మా శాశ్వత చిరునామా విజయవాడే’ అని చెబుతున్నారంటూ బీఎల్వోలు వాపోతున్నారు. అంతేనా... తమ వారు ఎక్కడ ఉన్నా.. వారి ఓట్లను జాబితాలో అలాగే ఉంచుతున్నారు. తమవారు కాకపోతే... ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఓటు హక్కు కల్పించడం లేదు. దీనిపై పలుమార్లు ఎన్నికల అధికారి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు.
ఎన్నెన్నో అభ్యంతరాలు... అనుమానాలు
నియోజకవర్గంలో ముసాయిదా జాబితా ప్రకటించాక అభ్యంతరాలు తెలుపుతూ భారీగా 26,458 దరఖాస్తులొచ్చాయి. 257 బూత్లు ఉంటే... కేవలం 98 బూత్ల పరిధిలోనే ఇన్ని దరఖాస్తులు రావడం గమనార్హం. మార్పుల కోసమూ 49,195 దరఖాస్తులు అందాయి. మిగిలిన బూత్లలో డిసెంబరు 3, 4 తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి బొండా ఉమా కేవలం 25 ఓట్లతో ఓడిపోయారు. ఈసారి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. దీంతో జాబితా సవరణల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- మధురానగర్ 162 పోలింగ్ బూత్ పరిధిలో ఇంటింటి సర్వే జరగనేలేదు. ఇక్కడ 35 మంది మృతుల ఓట్లు, 29వ డివిజనులోని పది పోలింగ్ బూత్ల పరిధిలో 305 మంది మృతుల పేర్లు జాబితాలో యథాతథంగా ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 15 వేల మంది మృతుల పేర్లు ఉన్నాయి.
- 162వ పోలింగ్ బూత్ పరిధిలో వి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రెండేళ్ల కిందట చనిపోయారు. ఆయన తనయుడు తన తండ్రి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ముసాయిదాలో వెంకటేశ్వరరావు పేరు తొలగించకపోగా.. ఆయన తనయుడు, భార్య పేర్లతో రెండేసి చోట్ల (సీరియల్ నంబర్లు 180, 173, 177, 174) ఓటు హక్కు కల్పించారు. దీనిపై డబుల్ ఎంట్రీ కింద ఫిర్యాదు చేసినా చర్యల్లేవు.
- వైకాపా కార్పొరేటర్ ఆలంపూర్ విజయలక్ష్మికి వేర్వేరు పోలింగ్ బూత్లలో రెండు ఓట్లున్నాయి. ఇలా రెండేసి ఓట్లు దాదాపు 4,232 ఉన్నట్లు గుర్తించారు.
- సింగ్నగర్, న్యూరాజరాజేశ్వరి పేట, జేఎన్యూఆర్ఎం కాలనీల్లో వందల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపణలున్నాయి.
ప్రతిపక్ష సానుభూతి పరులంటూ...
58వ డివిజన్ తోటవారి వీధిలోని రెండు అపార్టుమెంట్లలో 18 ఏళ్ల వయసు దాటిన వారు 178 మంది ఉన్నారు. ఓటు హక్కు కోసం రెండుసార్లు దరఖాస్తులు చేసినా వారికి జాబితాలో స్థానం దక్కలేదు. మూడోసారి దరఖాస్తులిచ్చారు. ఇక్కడ తెదేపా సానుభూతిపరులు ఉన్నారనే కారణంతో ఓట్లు ఇవ్వడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో కృష్ణా ఒడ్డున నివసించే 714 మంది 59వ డివిజన్ రామానగర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో కొందరు తమ ఓట్లను సెంట్రల్ నియోజకవర్గానికి మార్చాలని, మరికొందరు కొత్తగా ఓటు హక్కు ఇవ్వాలని దరఖాస్తు చేసినా ఫలితం శూన్యం.
మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ...
నియోజకవర్గ ఎన్నికల అధికారి, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ను సంప్రదించగా.. జాబితాలో మార్పులు, చేర్పులు నిరంతరం కొనసాగుతాయన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పరిశీలన చేశారని చెప్పారు. చెట్టుకు ఓటున్నట్లు జాబితాలో పొరపాటున ముద్రితమైందని, దాన్ని తొలగించేందుకు నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ