AP Officers: ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి?
‘అధికారాంతమునందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్..’ అని కవివాక్కు. ఇది ప్రభుత్వ పెద్దలకే కాదు... వారి అండ చూసుకొని విర్రవీగిన అధికారులకూ వర్తిస్తుంది.
అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న అధికారుల్లో అంతర్మథనం
కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన
ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్న మరికొందరు..
ఈనాడు - అమరావతి
‘అధికారాంతమునందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్..’ అని కవివాక్కు. ఇది ప్రభుత్వ పెద్దలకే కాదు... వారి అండ చూసుకొని విర్రవీగిన అధికారులకూ వర్తిస్తుంది. రేపు ప్రభుత్వం మారితే అనేక కేసులు వారి మెడకూ చుట్టుకోవచ్చు..! టైం బాగోకపోతే కారాగారవాసమూ తప్పకపోవచ్చు..!
- నాలుగున్నరేళ్లకుపైగా జగన్ ప్రభుత్వంలో తమకు తిరుగే లేదన్నట్టుగా చెలరేగిపోయిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు, అఖిల భారత సర్వీసులకు చెందిన కొద్దిమంది అధికారుల్లో దడ పుట్టిస్తున్న భావన ఇది.
‘‘చంద్రబాబుతో ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, లోకేశ్, ఇతర నేతలు ఊరుకునేలా లేరు. ప్రభుత్వం మారితే నాకు ఇబ్బందే. ప్రైవేటు సెక్టార్లో మంచి పోస్టు ఏదైనా ఉంటే చూడు బాస్..’’
- ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్ అధికారి మరో ఐఏఎస్ అధికారితో ఇటీవల అన్న మాటలివి.
‘‘నేను పోస్టింగ్ కోసం ప్రయత్నం కూడా చేయడం లేదు. అనవసరంగా ఈ రొంపిలోకి దిగి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు?’’
- గతంలో కీలక శాఖల్లో పనిచేసి, వైకాపా ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టులకే పరిమితమై.. ప్రస్తుతం పోస్టింగ్ కూడా లేని అధికారి తన సహచరుడితో అన్న మాటలు.
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే తమ గతేంటని కొందరు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా ఎలాంటి ఆధారాల్లేకపోయినా, ప్రతిపక్ష నాయకులపైనా, ప్రభుత్వానికి గిట్టని వారిపైనా అక్రమ కేసులు బనాయించి, మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసి.. ఇప్పటి ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు భయపడో, ఒత్తిళ్లకు తలొగ్గో, ప్రలోభాలకు లొంగిపోయో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అధికారుల్లోనూ అంతర్మథనం సాగుతున్నట్టు తెలుస్తోంది. మద్యం, గనులు, ఇసుక, మట్టి దోపిడీ, భూముల కబ్జా.. వంటి అనేక అక్రమ వ్యవహారాలకు, అవినీతికి, అడ్డగోలు నిర్ణయాలకు సహకరిస్తూ, పనిలో పనిగా స్వయంగా దొరికినంత మేసేసిన అధికారుల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. వారంతా ఆంతరంగిక చర్చల్లోను, సహచర అధికారులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. తమ మనసులోని ఆందోళన పంచుకుంటున్నట్టు సమాచారం. మాజీ సీఎం, మాజీ మంత్రులు సహా విపక్ష పార్టీకి చెందిన నాయకులపైనా, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా అక్రమ కేసులు బనాయించి ఎలా వేధించవచ్చో జగన్ ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే దానికో కారణం అవసరమే లేదన్నట్టుగా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి, మరో పార్టీ అధికారంలోకి వస్తే, వాళ్లూ జగన్ బాటలోనే కేసుల కొరడా ఝళిపిస్తే... మొదట బలయ్యేది తామేనన్న విషయాన్ని గుర్తించిన అధికారులు ఇప్పుడు కలవరపడుతున్నారు. ఆ పరిస్థితి రాకముందే తప్పించునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారని తెలిసింది.
అధికారం అండ చూసుకుని పలువురు అధికారులు ఇన్నాళ్లు చెలరేగిపోయారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మారితే గడ్డుకాలమేనన్న అభిప్రాయం రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ పక్కన ప్రత్యక్షమై, అప్పటి నుంచి సీఎంఓలో చక్రం తిప్పుతున్న అధికారి, గతంలో సీఎంఓలో హల్చల్ చేసి, సహచర అధికారుల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మరో అధికారి, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి, వైకాపా అధికారంలోకి వచ్చాక పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్రంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మరో అధికారి, గత ప్రభుత్వంలోనూ మూడు నాలుగు శాఖలకు ముఖ్యకార్యదర్శిగా పనిచేసి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి, మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురిపై పెట్టిన అక్రమ కేసుల్లో వారికి ప్రతికూలంగా వాంగ్మూలం ఇచ్చిన ఉన్నతాధికారి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రతిపక్ష నాయకులపై ఫిర్యాదులు చేసి అక్రమ కేసులు పెడుతున్న అధికారులు... ఇలా ఆ జాబితాలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ కోవలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు మొదలు... డీఎస్పీలు, సీఐల వరకు ఉన్నారు.
ఎక్కడికెళ్లినా తప్పించుకోలేరు!
‘‘ఎక్కువ మంది ఐఏఎస్ అధికారుల్లో అభద్రతాభావం ఉంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులు ప్రభుత్వం మారితే దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో... వారు ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిడి మేరకు నిధులు విడుదల చేశారు? వంటి వివరాలు, ఆధారాల్ని జాగ్రత్త చేసుకుంటున్నారు’’ అని ఒక అధికారి తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారినా, మారకపోయినా కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న నిర్ణయానికి మరికొందరు అధికారులు వచ్చారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలు, అక్రమాలకు అన్ని విధాలా సహకరిస్తూ, ఆ రొంపిలో పూర్తిగా కూరుకుపోయిన ఒకరిద్దరు మాత్రం నిండా మునిగాక చలేంటనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి కొందరు తమకున్న పరిచయాలతో ప్రతిపక్ష నేతల్ని కలుస్తున్నట్టు సమాచారం. నిజంగా తప్పులు చేసిన, అవకతవకలకు పాల్పడిన అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లినా, సొంత కేడర్కు వెళ్లిపోయినా... ప్రభుత్వం మారితే కేసుల నుంచి తప్పించుకోలేరని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..