అనగనగా అవుకు.. పూర్తికాకుండానే టముకు
అనగనగా అదొక అవుకు టన్నెల్. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండలను తొలచి నిర్మిస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలాశయానికి తరలించేలా నిర్మించారు.
లైనింగు పనులు కాకుండానే మమ
ఎన్నికలొస్తున్నాయని ప్రారంభించేస్తున్న జగన్
రూ.30 కోట్ల పనులు పెండింగ్
నీళ్లు వదిలి.. ఫొటోలతో సరి
అవుకు ప్రాజెక్టు కథ ఈ ఏడాదికి అంతే
అనగనగా అదొక అవుకు టన్నెల్. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండలను తొలచి నిర్మిస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలాశయానికి తరలించేలా నిర్మించారు. 2018-19లోనే నీటిని మళ్లించారు. మరో టన్నెల్ పనులు సాగుతుండగానే ఎన్నికలు వచ్చాయి.కర్నూలు, కడప జిల్లాల్లో జగన్ తిరుగుతూ తానే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే అవుకు ప్రాజెక్టును ఎప్పుడో పూర్తి చేసేవాడినని, రాయలసీమ కరవు జిల్లాలు ఆ 20 వేల క్యూసెక్కుల నీటితో సస్యశ్యామలం అయ్యేవని చెప్పారు. తానైతే కరవు సీమను పచ్చని సీమగా మార్చేసేవాడినని ఎన్నికల ముందు జనాన్ని నమ్మించారు. అధికారంలోకి వస్తూనే జలవనరులశాఖ అధికారులతో సమీక్షించారు. 2020-21లో పూర్తి చేసేసే ప్రాజెక్టుల్లో అవుకును చేర్చారు. 2021 మార్చి నాటికల్లా అవుకు టన్నెళ్ల తవ్వకాలు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కులు మళ్లించేస్తామని అధికారులు చెప్పారు. ఒక ఏడాదిలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అలా మాటలు చెప్పి నాలుగున్నరేళ్లు అయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికైనా అవుకు టన్నెల్ పనులు పూర్తయ్యాయా అంటే లేదు అనే చెప్పాలి.
వెయ్యి మీటర్ల లైనింగ్ పనులు పూర్తి కాలేదు
అధికారులు 150 మీటర్ల వరకు లైనింగు పనులు పూర్తి చేయాలని అంటున్నారు. వాస్తవానికి దాదాపు వెయ్యి మీటర్ల మేర ఇంకా లైనింగు పూర్తి చేయనేలేదు. లోపల టన్నెల్లోకి వెళ్లి చూస్తాం అని పత్రికా ప్రతినిధులు అడిగితే కుదరదంటే కుదరదంటున్నారు. నీళ్లు మళ్లిస్తాం కదా అప్పుడు ఫొటోలు తీసుకోవచ్చని చెబుతున్నారు. తానే సీఎంగా ఉంటే సీమకు నీళ్లు ఇచ్చి పచ్చగా మార్చేసేవాడినని చెప్పిన జగన్ ఇప్పుడు ఉన్న ఆయకట్టును ఎండబెట్టి మరీ అవుకులో నీళ్లు పారించేందుకు తంటాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి అవుకు రెండో టన్నెల్ను బుధవారం ప్రారంభించబోతున్నారు. గోరకల్లు నుంచి 20వేల క్యూసెక్కులు రెండు టన్నెళ్ల ద్వారా మళ్లిస్తారు. ఆ నీళ్లు అవుకు జలాశయానికి చేరతాయి. ఆ ఫొటోలు తీసి టన్నెల్ తవ్వాం, ప్రారంభించాం అని చెప్పబోతున్నారు. ఆ తరవాత నీళ్లు బంద్.. ఈ సీజన్కు ఇక ఇంతే. మళ్లీ పెండింగ్లో ఉన్న లైనింగు పనులు చేసుకోవడమే. అవుకు టన్నెల్ అయ్యిందా అంటే అయ్యింది. మరి నీటిని నిరంతరం పారిస్తారా అంటే వచ్చే వర్షాకాలం తర్వాతే ఆ విషయంపై ఆలోచిస్తారు. అంటే ప్రస్తుతానికి అవుకు అయిపోయిందని చెప్పి ఎన్నికల ప్రచారం చేసుకుంటారు.
ఏమిటీ అవుకు టన్నెల్?
- శ్రీశైలం జలాలు ఎస్ఆర్బీసీ ద్వారా గోరకల్లు జలాశయానికి చేరతాయి. గోరకల్లు మొత్తం నీటి నిల్వ 12 టీఎంసీలు. గోరకల్లు నుంచి గాలేరు నగరి వరద కాలువ తవ్వి అవుకు టన్నెల్కు అక్కడి నుంచి గండికోట జలాశయానికి నీళ్లు తీసుకువెళ్లే ప్రణాళికలో భాగంగా ఎప్పుడో పనులు ప్రారంభించారు.
- ఇందులో భాగంగానే అవుకు వద్ద టన్నెళ్ల తవ్వకం అవసరమైంది. చంద్రబాబు సీఎంగా ఉన్న తొలినాళ్లలో ఈ టన్నెళ్ల ప్రతిపాదనలు చేశారు. వైఎస్ హయాంలో 2008లో పనులు ప్రారంభమయ్యాయి. 2009లో ఆగిపోయాయి.
- మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రూ. 401 కోట్లతో ఎన్.సి.సి., మైటాస్ సంస్థలు పనులు చేపట్టాయి. 12 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పున 5.6 కిలోమీటర్ల మేర రెండు సొరంగాలు తవ్వాలన్నది ప్రణాళిక.
- ఒక సొరంగం తవ్వుతుండగా 280 మీటర్లకు పైగా ఫాల్ట్ జోన్ రావడంతో అక్కడ ఇక పనులు చేసే పరిస్థితి లేక ఆ సొరంగం పనులు నిలిపివేశారు. రెండో దాంట్లోనూ ఫాల్ట్ జోన్ రావడంతో ఆ సొరంగం ప్రణాళికలు మార్చారు. అందులోనే రెండు చిన్న సొరంగాలుగా మార్చి ఒక్కోదాంట్లో 10 వేల క్యూసెక్కులు మళ్లించేలా ప్రణాళిక రూపొందించారు.
- 2018-19లో ఒక సొరంగం పూర్తి చేసి 10 వేల క్యూసెక్కులు పంపించారు. రెండో సొరంగంలో 180 మీటర్ల ఫాల్ట్ జోన్, లైనింగు పని మాత్రమే మిగిలిపోయింది.
జగన్ అధికారంలోకి రాగానే పని ఆపేశారు. పాత గుత్తేదారుడి పని రద్దు చేశారు. కొత్తగా టెండర్లు పిలిచారు. రివర్స్ టెండర్ల పేరుతో మ్యాక్స్ కన్స్ట్రక్షన్ సంస్థకు మిగిలిన పనిని రూ. 108 కోట్లతో అప్పచెప్పారు. నిధులు సకాలంలో ఇవ్వక పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పటికీ లైనింగు పనులు పెండింగ్లోనే ఉన్నాయి. హడావుడిగా రిబ్బను కత్తిరించేందుకు సిద్ధమయ్యారు.
- అవుకు టన్నెల్లో ఇంకా రూ. 30 కోట్ల విలువైన పనులు పెండింగ్లో ఉన్నాయి. రూ. 24 కోట్ల వరకు బిల్లులూ పెండింగ్లో పెట్టారు.
ఈనాడు,అమరావతి, - న్యూస్టుడే,అవుకు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం
మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. -
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు నమోదుకు షెడ్యూల్ ఖరారు
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. -
ఇలాంటివి మీ ఇంట్లో తింటారా టీచర్!
తిరుపతి జిల్లాలోని బీఎన్కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాల వంట గదిలో కుళ్లిన క్యాబేజీ, అరటిపండ్లు కనిపించాయి. శుక్రవారం మండలస్థాయి అధికారులు తనిఖీ చేసి అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. -
సంక్షిప్త వార్తలు(11)
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి