మేమే ఉద్యోగాలిచ్చాం... చెప్పినట్టు చేయాల్సిందే
ఎన్నికల సంఘం తరఫున క్షేత్రస్థాయిలో పనిచేసే తొలి ప్రతినిధి బూత్ స్థాయి అధికారే (బీఎల్వో). ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ వీరివద్దే మొదలవుతుంది.
బీఎల్వో బాధ్యతల్లో ఉన్న సచివాలయాల ఉద్యోగులపై వైకాపా నాయకుల అజమాయిషీ
ఓటర్ల జాబితాలను మార్చేయాలంటూ తీవ్ర ఒత్తిడి
ఆ పర్యవసానమే అక్రమాలు, అవకతవకలు
ఈనాడు, అమరావతి: ఎన్నికల సంఘం తరఫున క్షేత్రస్థాయిలో పనిచేసే తొలి ప్రతినిధి బూత్ స్థాయి అధికారే (బీఎల్వో). ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ వీరివద్దే మొదలవుతుంది. అయితే ఈ సారి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే బీఎల్వోలుగా ఉండటంతో.. వారిపై వైకాపా నాయకులు అజమాయిషీ చలాయిస్తున్నారు. తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ‘‘మీకు మా పార్టీయే ఉద్యోగాలిచ్చింది. మేం చెప్పినట్టుగా, మాకు నచ్చినట్టుగా ఓటరు జాబితాలు తయారవ్వాల్సిందే. లేదంటే తర్వాత పర్యవసానాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరిస్తున్నారు. చిరుద్యోగులైన వీరు.. ఈ బెదిరింపులను తట్టుకోలేకపోతున్నారు. పర్యవసానంగా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలు.. వైకాపా జాబితాల్లా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, వైకాపాకు అనుకూలంగా భారీగా బోగస్ ఓట్ల చేర్పు ఉద్ధృతంగా సాగుతోంది.
సరిదిద్దుకోలేని ఘోర తప్పిదం
ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను బీఎల్వోలుగా నియమించే విధానం మొదట నుంచి కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఈ సారి దానికి ఎందుకు తూట్లు పొడిచింది? సచివాలయాల ఉద్యోగుల్ని బీఎల్వోలుగా నియమించొద్దని వివిధ ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఎందుకు బేఖాతరు చేసింది? ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ లాంటి కీలక బాధ్యతల్ని అనుభవం లేనివారి చేతుల్లో పెట్టడమేంటి? ఈ వైఫల్యం ఎన్నికల సంఘానిది కాదా? ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు బీఎల్వోలుగా వ్యవహరించినప్పుడు వారిపై అధికారపార్టీ నాయకులకు పెద్దగా అజమాయిషీ ఉండేది కాదు. ఈ సారి 46వేలకు పైగా పోలింగ్ కేంద్రాలకు గాను సుమారు 40వేల కేంద్రాల బీఎల్వోలుగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని ఎన్నికల సంఘం నియమించింది. సరిదిద్దుకోలేని ఘోర తప్పిదానికి ఇక్కడే బీజం వేసింది. సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులు కొత్త. దీంతో వైకాపా నాయకుల వారిపై స్వారీ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు బీఎల్వోలు వారి ఒత్తిళ్లకు తలొగ్గుతుండగా... మరికొందరు నిరాకరిస్తున్నారు.
‘‘రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో గతంలో ఎన్నడూ లేనంతగా అవకతవకలు చోటుచేసుకోవడానికి, తప్పులు దొర్లడానికి ఈ ప్రక్రియలో సచివాలయాల సిబ్బందిని వినియోగించడమే కారణం. ఇది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వైఫల్యం. దీనికి పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘం, ప్రత్యక్షంగా సీఈఓ బాధ్యత వహించాలి’’ అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఇటీవల రాష్ట్ర గవర్నర్కు, కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఓటర్ల జాబితాల తయారీలో భాగస్వాముల్ని చేయటం, దొర్లిన తప్పులు సరిదిద్దే బాధ్యతను మళ్లీ వారికే అప్పగించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆ ఫిర్యాదుల్లో వివరించింది.
ముందు నుయ్యి... వెనక గొయ్యి
‘‘అధికారపార్టీ నాయకులు చెప్పినట్టల్లా చేస్తే జాబితాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం మమ్మల్ని బలిచేస్తోంది. వైకాపా నాయకులు చెప్పినట్టు వినకపోతే వారినుంచి రోజూ బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చామా అనిపిస్తోంది. మా పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లుగా మారింది’’ అని శ్రీకాకుళం జిల్లాలో బీఎల్వో బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ గ్రామ సచివాలయ ఉద్యోగి వాపోయారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా మద్దతుదారుల ఓట్లు తొలగించాలంటూ బీఎల్వోగా వ్యవహరిస్తున్న ఓ వార్డు సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకులు ఇటీవల తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకు అంగీకరించకపోవడంతో ఘర్షణకు దిగి బెదిరించారు. బీఎల్వోలపై అధికార పార్టీ నాయకులు ఏ స్థాయిలో పెత్తనం చేస్తున్నారో చెప్పేందుకు ఇదో తార్కాణం మాత్రమే.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తప్పవు
పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కోసం వచ్చిన ఫారం-7 దరఖాస్తులు, వాటి పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు స్థానిక ఎస్సైలు, సీఐలకు వాట్సప్ గ్రూపుల్లో పంపించిన బీఎల్వోలపై ఎన్నికల సంఘం ఇటీవల క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వీరిలో ఎక్కువమంది మహిళా పోలీసులే. ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం తీవ్ర చర్యలు తప్పవు. అందుకే ఎవరెన్ని చెప్పినా నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉంది. మరోవైపు వారిపై ఒత్తిడి తీసుకొస్తూ తప్పులు చేయిస్తున్న అధికారపార్టీ నాయకులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవటం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలోకి వైకాపా నాయకుల చొరబాటు
ఓటర్ల జాబితా తయారీ విధుల్లో ఉన్నంత కాలం బీఎల్వోలు ఎన్నికల సంఘంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్నట్లే లెక్క. వారిపై పూర్తి అజమాయిషీ, నియంత్రణ ఎన్నికల సంఘానిదే. క్షేత్రస్థాయిలో వాస్తవ సమాచార సేకరణ, క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ, ఇంటింటి పరిశీలన, వలస వెళ్లిన, మృతిచెందిన, ఉనికిలో లేని ఓటర్ల గుర్తింపు, ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో తప్పిదాల గుర్తింపు తదితర విధులు బీఎల్వోలు చేపట్టాలి. వీటి నివేదికలను ఈఆర్ఓలకు సమర్పించాలి. ఇలా వీరి పాత్ర కీలకం కావడంతోనే ఈ ప్రక్రియలో వైకాపా నాయకులు చొరబడుతున్నారు. బీఎల్వోలపై సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి తాము చెప్పినట్లు చేయాలని ఆదేశిస్తున్నారు. వైకాపాకు ఓటేసేవారు, వేయనివారు ఎవరనేది వాలంటీర్ల ద్వారా గుర్తించి.. వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తూ.. తమకు అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేర్పించుకుంటున్నారు. ఇవి జరగకుండా చూడాల్సిన బీఎల్వోలు చేతులెత్తేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితా తప్పులు తడకలతో ఉండటానికి ఇదే ప్రధాన కారణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్