ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
వైకాపా కార్యకర్తలను మించిపోతున్నారు
ఓటర్ల జాబితాలో అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ధ్వజం
ఓట్ల అక్రమాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఈ రెండు మూడు నెలలు వాళ్లు తప్పించుకోవచ్చేమో గానీ, తర్వాత శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలపై పార్టీల విజ్ఞప్తులను కలెక్టర్లు పట్టించుకోని తీరుపై ఆధారాలతో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశామని తెలిపారు. తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్రావు, అశోక్బాబు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్బాబు, పులివర్తి నాని తదితరులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘ఏపీలో జగన్ ఓడిపోతున్నారని తెలిసి.. తెదేపా వాళ్ల ఓట్లు తొలగించి, లేని ఓట్లు చేర్పించి గెలవాలనే ఇదంతా చేస్తున్నారు. ఫారం-6, 7, 8 సహా నకిలీ ఓట్ల తొలగింపునకు తెదేపా 11.5 లక్షల దరఖాస్తులు చేస్తే, అవి ఏమయ్యాయో తెలియదు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.
అనంతపురం కలెక్టర్.. రెండు రకాల చర్యలు
‘రాప్తాడులో 20వేల బోగస్ ఓట్లు ఉన్నాయని మాజీమంత్రి పరిటాల సునీత ఫిర్యాదుచేస్తే, ఫారం-7 పెట్టుకోవాలని అనంతపురం కలెక్టర్ చెప్పారు. ఉరవకొండ నియోజకవర్గంలో 10వేల ఓట్లు తీసేయాలని అక్కడి వైకాపా ఇన్ఛార్జ్ లేఖ ఇస్తే.. ఫారం-7 లేకుండా ఫార్మాట్-బి అనే నోటీసు ఇచ్చి, తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే కలెక్టర్ ఇలా వేర్వేరుగా వ్యవహరిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 20వేల ఓట్లు వేరే ప్రాంతాలవారివి చేర్చారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెబితే అక్కడ 79 కొత్త పోలింగ్ కేంద్రాలు ఇచ్చారు. రాష్ట్రమంతటా అక్రమాలు ఉన్నాయని, 17 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లపై ఆధారాలు సీఈఓకి అందజేశామన్నారు. నోటీసు ఇవ్వకుండా తప్పు చేస్తే బీఎల్వోలు బాధ్యులవుతారని, దీనిపై మెమో పంపుతామని ఆయన చెప్పారు. అవకతవకలు చేస్తే అందుకు బీఎల్వోలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు బాధ్యులవుతారు’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
సీఈఓ ఆశ్చర్యపోయారు: పయ్యావుల కేశవ్
‘ఉరవకొండలో అక్రమాలు చెబితే ఎన్నికల సంఘం కూడా ఆశ్చర్యపోయింది. ఓటర్ల నమోదు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకోవాలి. కానీ వైకాపా నేతలు టోకుగా ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేసి, తహసీల్దారుకు ఫోన్ చేస్తే.. అధికారులు మూడురోజులు రాత్రిళ్లు కార్యాలయంలో కూర్చుని ఓకే చేశారు. ఇది అసాధ్యమని సీఈవో అన్నారు. కానీ పక్కన ఉన్న సాంకేతిక అధికారి మాత్రం అవకాశం ఉందన్నారు. బీఎల్వోలూ.. ఒత్తిళ్లకు తలొగ్గొద్దు. ఫారం-7 ఇస్తే అభ్యంతరం చెప్పిన వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వకుండా, అధికారులు ఫార్మాట్-2 కొడుతున్నారని వివరించాం. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల సంఘం ముందు అర్ధరాత్రి వరకైనా కూర్చోవాలని వచ్చాం. కానీ సీఈఓ ఇచ్చిన స్పష్టమైన హామీని నమ్మి బయటకు వచ్చాం’ అని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తెలిపారు.
తాడేపల్లి ఆదేశాలు పాటిస్తే శిక్ష తప్పదు
‘ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఇటీవల దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేయగా, అక్కడి నుంచి బృందం త్వరలో రాష్ట్రానికి రానుంది. తాడేపల్లి ఆదేశాలు పాటించి, ఏకపక్షంగా, వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కలెక్టర్లకు శిక్షలు తప్పవు. వీళ్లను జగన్ కాపాడలేరు. మూడు నెలల్లో జగన్తో, వైకాపా నేతలు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతారు. అధికారులే దొరికిపోతారు. మీపై చర్యలు చేపట్టేవరకూ తెదేపా ఊరుకోదు’ అని బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.