జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు.
ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్న వైకాపా ప్రభుత్వం
బాధితుల్ని పరామర్శిస్తే ప్రతిపక్షాలపై కేసులు
అధికార పార్టీ అక్రమాలు బయటపెట్టడానికి కదిలితే గృహనిర్బంధాలు
ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తలపెడితే అష్టదిగ్బంధాలు
ఈనాడు - అమరావతి
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. కానీ నిరంకుశత్వానికి కేరాఫ్గా మారిన జగన్ ప్రభుత్వం వాటిని కాలరాస్తోంది. నిత్యకల్లోలిత ప్రాంతమైన కశ్మీర్లో, అల్లర్లతో అట్టుడికే ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఏనాడూ కనీవినీ ఎరుగని ఆంక్షలు, నిర్బంధాలను ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోంది. పోలీసు చట్టంలోని సెక్షన్ 30, సీఆర్పీసీలోని సెక్షన్ 144 అమల్లో ఉన్నాయంటూ అడుగు తీసి అడుగు వేయనీయకుండా అష్టదిగ్బంధం చేస్తోంది. వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే తీరు. అరాచకానికి మారుపేరైన తాలిబన్ రాజ్యాన్ని, కరడుగట్టిన నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలిస్తున్న ఉత్తరకొరియాను మించిపోయేలా ఏపీలో ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రజాస్వామిక హక్కులపై ఈ నిర్బంధమేంటి? ఇక్కడ ప్రతిపక్షాలకు భావప్రకటన స్వేచ్ఛ తీసేశారా? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రూ.50కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అధికారపార్టీ నేత కొల్లగొడితే.. తాజాగా ఆ అక్రమ మైనింగ్ను పరిశీలించడానికి వెళ్లాలనుకున్న ప్రతిపక్ష నాయకులకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి? అక్కడ ఏ తప్పూ జరగకపోతే ఎందుకంత భయం? పోలీసులను అడ్డంపెట్టుకుని ఎంతకాలం కట్టడి చేస్తారు? ఇంకెన్నాళ్లు హక్కుల్ని హరిస్తారు?
అక్రమాలను బయటపెట్టేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా?
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ఇసుక, మద్యం దందాలకు పాల్పడుతున్నారంటూ తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు కొన్నాళ్ల కిందట పాదయాత్ర తలపెట్టగా పోలీసులు ఆయన్ను ఇంటినుంచి బయటకు రానీయకుండా నిర్బంధించారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ పరిధి పెరుగులంక భూముల్లో వైకాపా నాయకుల మట్టి అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. సీఆర్జడ్ నిబంధనలను ఉల్లంఘించి విశాఖలోని రుషికొండపై చేస్తున్న అక్రమ
తవ్వకాల పరిశీలనకు వెళ్లాలనుకున్న ప్రతిపక్ష నేతలను పలు సందర్భాల్లో పోలీసులు నిర్బంధించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటిస్తే అది శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుంది?ఇది ప్రాథమిక హక్కుల్ని హరించడం కాదా?
బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తే కేసులా?
జగన్ పాలనలో.. ప్రతిపక్ష పార్టీల నాయకులు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లినా అది శాంతిభద్రతల సమస్యే. పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన తెదేపా దళిత నాయకులు వంగలపూడి అనిత, ఎం.ఎస్.రాజులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఉన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు నరసరావుపేట వెళ్తున్న తెదేపా నేత నారా లోకేశ్ను అడ్డుకుని.. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారంటూ కేసు పెట్టారు. పల్నాడులో వైకాపా నాయకుల హింస బారిన పడిన బాధితుల్ని పరామర్శించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునివ్వగా ఆయన్ను ఉండవల్లిలోని ఇంటి నుంచి బయటకు రానీయకుండా తాళ్లతో గేట్లు కట్టేసి అడ్డుకున్నారు.
ఇది స్వేచ్ఛను హరించడం కాదా?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు, మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నాయకులను కాలు కదపనివ్వరు. జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయవాడ వస్తుంటే రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకున్నారు. అంతకుముందు విశాఖ వెళ్తే వాహనం నుంచి బయటకు కనిపించడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో బీసీలు మచిలీపట్నంలో సైకిల్ యాత్ర చేపడితే ఆయన్ను నిర్బంధించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లగా అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఆర్5 జోన్కు వ్యతిరేకంగా అమరావతి రైతులు శాంతియుత నిరసన ప్రదర్శన చేపడతామంటే 144 సెక్షన్ అమల్లో ఉందంటూ వారిని నిర్బంధించి దాడి చేశారు. ఇదే అంశంపై జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవ్వగా ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఏది నేరం?
ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడటం, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడం, శాంతియుత ప్రదర్శనల ద్వారా గళం వినిపించడం, బాధితులను పరామర్శించి సంఘీభావం తెలపడం, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం నేరమా? వారి హక్కుల్ని కాలరాస్తూ నిర్బంధించడం నేరమా? ఏ చట్టం ప్రకారం ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని గృహనిర్బంధం చేస్తున్నారు?
అధికార పార్టీ అరాచకాలకు మాత్రం పచ్చజెండా
ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం తలపెట్టినా శాంతిభద్రతల సమస్య, నేర నియంత్రణ పేరిట గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులు అధికార పార్టీ అరాచకాలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారు. ప్రతిపక్ష నాయకులపైకి, పాదయాత్ర చేసే రైతులపైకి రాళ్లు, చెప్పులు విసరడం, జెండా కర్రలతో దాడిచేయడం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల్లో, ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించడం లాంటి చర్యలకు వైకాపా నాయకులు తెగబడినప్పుడు మాత్రం పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ గుర్తుకు రాదు. పైగా వారికి రక్షణ కల్పిస్తారు కూడా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.