AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది.
ప్రభుత్వ మద్యం దుకాణంలో అమ్మిన సీసాలో కీటకం
సోమందేపల్లి, న్యూస్టుడే: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. బుధవారం ఓ వ్యక్తి ఆ దుకాణంలో యంగ్ స్టార్ బ్రాండ్ విస్కీ కొన్నారు. ఇంటికి వెళ్లాక చూస్తే సీసాలో పురుగు కనిపించడంతో వెంటనే దాన్ని దుకాణానికి తీసుకెళ్లి సిబ్బందికి చూపించారు. వారు దానిని తీసుకుని మరో మద్యం సీసా ఇచ్చారు. ‘సరైన తనిఖీలు చేయకుండానే దుకాణాలకు మద్యం ఎలా పంపుతున్నారు?’ అని ఆయన నిలదీశారు. ‘ధరలు పెంచేసి.. ఆపై పురుగులతో కూడిన మద్యం అమ్ముతూ ప్రాణాలతో చెలగాటమాడతారా?’ అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అబ్కారీ శాఖ ఎస్ఐ నారాయణ మాట్లాడుతూ ‘మద్యం సీసాలో ఉన్నది పురుగు కాదు. డస్ట్ వచ్చింది. మద్యం నిల్వ ఉండడంతో సిగ్మెంట్గా మారింది. ఆ సీసాను పరీక్షలకు పంపించాం. యంగ్ స్టార్ రకం మద్యాన్ని ఎవరికీ అమ్మకుండా పక్కన పెట్టించాం’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రెండు రోజులు వర్షాలు!
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. -
సంక్షిప్తవార్తలు
-
ఓటు ప్రాధాన్యంపై నేడు రౌండ్టేబుల్ సమావేశం
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ అంశంపై విజయవాడలో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. -
పింఛనుదారులకు పూర్వ వైభవం రావాలి
ఐదేళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబసభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎన్బీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
వారికి లేని బాధ మీకెందుకు?
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నిలువరించాలని, వారి ప్రసంగాలను ప్రచురితం, ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్