AP Liquor: బ్రాండ్‌ విచిత్రం.. పురుగు ఉచితం!

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది.

Updated : 30 Nov 2023 08:56 IST

ప్రభుత్వ మద్యం దుకాణంలో అమ్మిన సీసాలో కీటకం

సోమందేపల్లి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. బుధవారం ఓ వ్యక్తి ఆ దుకాణంలో యంగ్‌ స్టార్‌ బ్రాండ్‌ విస్కీ కొన్నారు. ఇంటికి వెళ్లాక చూస్తే సీసాలో పురుగు కనిపించడంతో వెంటనే దాన్ని దుకాణానికి తీసుకెళ్లి సిబ్బందికి చూపించారు. వారు దానిని తీసుకుని మరో మద్యం సీసా ఇచ్చారు. ‘సరైన తనిఖీలు చేయకుండానే  దుకాణాలకు మద్యం ఎలా పంపుతున్నారు?’ అని ఆయన నిలదీశారు. ‘ధరలు పెంచేసి.. ఆపై పురుగులతో కూడిన మద్యం అమ్ముతూ ప్రాణాలతో చెలగాటమాడతారా?’ అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అబ్కారీ శాఖ ఎస్‌ఐ నారాయణ మాట్లాడుతూ ‘మద్యం సీసాలో ఉన్నది పురుగు కాదు. డస్ట్‌ వచ్చింది. మద్యం నిల్వ ఉండడంతో సిగ్మెంట్‌గా మారింది. ఆ సీసాను పరీక్షలకు పంపించాం. యంగ్‌ స్టార్‌ రకం మద్యాన్ని ఎవరికీ అమ్మకుండా పక్కన పెట్టించాం’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని