YS Jagan: మాటలు స్వీటు.. చేతలు చేటు
ఎస్సీ, ఎస్టీ నిరుపేదల్ని సొంతకాళ్లపై నిలబడకుండా చేసి... తమపై ఆధారపడి ఉండే కట్టుబానిసలుగా మార్చే ప్రక్రియ జగన్ ప్రభుత్వంలో చకచకా సాగుతోంది.
ఎస్సీ, ఎస్టీల ఎదుగుదలకు మోకాలడ్డు
పథకాలన్నింటికీ జగన్ సర్కారు గండి
ఉపాధికి దూరం చేసి కట్టు బానిసలుగా మార్చే కుట్ర
జగన్ జవాబు చెప్పగలరా?
ఈనాడు - అమరావతి
బాగున్న కాళ్లను నరికేసి...
ఉదారంగా కృత్రిమ కాళ్లు అమర్చి...
చూశావా నేనిచ్చిన కొత్త కాళ్లెంత బాగున్నాయో
అంటే ఎలా ఉంటుంది?
ఉన్నకాలు పోయిందని బాధపడతామా?
కొత్తకాలు వచ్చిందని సంబరపడిపోదామా?
అలా ఇచ్చిన వారు దానకర్ణులా... దానవులా?
అచ్చంగా కాకున్నా రాష్ట్రంలో ఎస్సీ-ఎస్టీలు నేడు ఎదుర్కొంటున్న ప్రశ్న ఇదే!
ఏ సభలో చూసినా మాటలు కోటలు దాటతాయి..
ఆ ఆప్యాయత వెనక అపాయముందని తెలియదు..
చేతులు తలను తడుముతాయి..
ఆ ఆశీర్వాదం వెనక భస్మాసురహస్తముందని తెలియదు...
ఎస్సీ, ఎస్టీ నిరుపేదల్ని సొంతకాళ్లపై నిలబడకుండా చేసి... తమపై ఆధారపడి ఉండే కట్టుబానిసలుగా మార్చే ప్రక్రియ జగన్(YS Jagan) ప్రభుత్వంలో చకచకా సాగుతోంది. అట్టడుగు వర్గాలు స్వయంగా ఎదగకుండా... తన దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి బతికేలా దురాలోచనను అమలు చేస్తున్నారు. ఉపాధిని దెబ్బతీయడం ఒక్కటే కాదు... ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న నాణ్యమైన విద్య, ఏళ్లుగా అమలవుతున్న ప్రత్యేక పథకాలు, ప్రత్యేక చట్టాల ద్వారా అందుతున్న సాయం... ఇలా అన్నింటికీ జగన్ ప్రభుత్వం పాతరేసింది. సొంతంగా ఎదిగే అవకాశాల్లేకుండా జీవితాలను ఛిద్రం చేసింది! అందుకు తిరుగులేని సాక్ష్యాలెన్నో!
సాక్ష్యం: 1
కుల కార్పొరేషన్ల నిర్వీర్యం
కటిక పేదరికాన్ని జయించడానికి పేదలకు కల్పతరువులాంటివి కుల కార్పొరేషన్లు! వీటి ద్వారా స్వయం ఉపాధి రాయితీ రుణాలు పొంది ఎన్నో వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు పేదరికాన్ని జయించాయి కూడా. కానీ పేదల పక్షపాతిగా పైకి చెప్పుకొనే జగన్ అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో కుల కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా విభజించి వారికి మేలు చేస్తున్నట్లు చిత్రీకరించారు. వీటిలో డైరెక్టర్లుగా, ఛైర్మన్లుగా పార్టీ నేతలకు ఇబ్బడిముబ్బడిగా రాజకీయ పదవులు కట్టబెట్టి ఆ కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. పోనీ వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఏమైనా లాభం చేకూర్చారా అంటే అదీ లేదు. ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల మంజూరే లేకుండా చేశారు. నవరత్న పథకాల నిధులనే బదిలీ చేస్తూ అంకెల గారడీతో జగన్ నిలువునా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలను వంచిస్తున్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపు రూ.1000 కోట్లు రాయితీ రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కరికీ ఒక్క రూపాయి రాయితీ రుణం ఇవ్వకుండా ఈ పథకాన్నే నిలిపేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఇచ్చిన రాయితీ డబ్బు రూ.750 కోట్లు బ్యాంకుల్లో ఉంటే... పథకాన్ని కొనసాగించకుండా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఎస్సీలకు సంబంధించిన నిధులే రూ.200 కోట్లున్నాయి.
సాక్ష్యం: 2
భూమి కొనుగోలు పథకం ఎత్తివేత
పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు... పెట్టే కేంద్ర ప్రభుత్వాన్నీ అడ్డుకోవటం జగన్ సర్కారు ప్రత్యేకత! దశాబ్దాలుగా కేంద్ర సహకారంతో సబ్సిడీ రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశాయి. ఒక్కో ఎస్సీ కుటుంబానికి సుమారు ఎకరం పొలాన్ని కొనుగోలు చేసి సాగు చేసేందుకు ఇచ్చాయి. మూడు దశాబ్దాలుగా వేల మంది ఎస్సీ మహిళలకు అండగా ఉన్న ఈ పథకాన్ని వైకాపా అధికారం చేపట్టాక నిలిపేసింది. ఇదేకాదు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్టీఎఫ్డీసీ)లు ఎస్సీ, ఎస్టీలకు అందించే రుణాలకూ జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. కేంద్రం ఇచ్చే నిధులకు తన వంతు వాటా కలిపి రుణాలివ్వకుండా...దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళంపాడింది. 2015-19 వరకూ రాష్ట్రంలో దాదాపు 23 వేల ఎస్సీ, ఎస్టీలకు రూ.515 కోట్లకుపైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్టీఎఫ్డీసీ టర్ము రుణాల కింద రాష్ట్రానికి రూ.6.54 కోట్లు కేటాయించినా రాష్ట్రప్రభుత్వం రాయితీ ఇవ్వలేదు. చివరకు ఆ ప్రక్రియనే అధికారులు నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో... ఎన్నికలు దగ్గర పడుతున్నాయని జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్కేఎఫ్డీసీ) ద్వారా కేంద్రమిచ్చిన రూ.38 కోట్ల నిధులతో తాజాగా 100 మంది లబ్ధిదారులకు మురుగు శుద్ధి వాహనాలను పంపిణీ చేశారు. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు.
సాక్ష్యం: 3
నాణ్యమైన విద్యకు తిలోదకాలు
బడుగుల తలరాత మార్చటంలో విద్య అత్యంత కీలకం. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం 25 ఏళ్లుగా రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం అమలవుతోంది. గత తెదేపా ప్రభుత్వం ఈ పథకానికి ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసి... దాదాపుగా లక్ష మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించింది. కానీ వారు చదువుకొని అభివృద్ధి చెందితే ఇక తమ మాయ మాటలు నమ్మరనుకుంటున్నారో ఏమోగాని... అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అక్కడితోనే ఆగలేదు... ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటునూ రద్దు చేసింది. ఎంబీబీఎస్ సీట్లను అమ్మకానికి పెట్టి... నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీల పిల్లలకు వైద్యవిద్యను దూరం చేస్తున్నారు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని సైతం పేద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందకుండా ఎక్కడ లేని నిబంధనలు వెతికి తెచ్చి వారు అర్హతకే నోచుకోకుండా చేశారు. ఇది పైకి కనిపించకుండా ఆర్థిక సాయం పెంచి అమలు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇదే పథకం కింద తెదేపా ప్రభుత్వం 491 మంది ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయమందిస్తే.....జగన్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఎస్సీ, ఎస్టీల విద్యార్థుల సంఖ్య 40 కూడా మించలేదు.
సాక్ష్యం: 4
విద్యోన్నతి నిలిపివేత
ఎస్సీ, ఎస్టీలు అత్యున్నత కొలువులు సాధించేందుకు దేశంలోనే పేరెన్నికగన్న కోచింగ్ సెంటర్లలో సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన విద్యోన్నతి పథకాన్ని జగన్ నిలిపేశారు. గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించింది. దాదాపుగా 2,500 మందికి ఆర్థిక సాయం అందించింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే ఆలోచనతో జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వకుండా...ప్రిలిమ్స్, మెయిన్స్కు అర్హత సాధించిన వారికి ఆర్థికసాయం అందిస్తామనేలా ప్రోత్సాహక పథకాన్ని తెచ్చారు. ఎన్నికల నాటికి దీని ద్వారా అందే సాయమూ పరిమితం కానుంది. ఇదేకాకుండా వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ ఇచ్చే స్టడీ సర్కిళ్లనూ రాష్ట్రంలో నామమాత్రం చేశారు.
సాక్ష్యం: 5
సంక్షోభ వసతి కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్లో బడుగుబలహీన వర్గాల సం‘క్షోభం’ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సంక్షేమ వసతి గృహాలను చూస్తే చాలు. వసతి గృహాలు, గురుకులాల్లో అధ్వాన పరిస్థితులున్నాయని ప్రభుత్వమే సర్వే చేయించి తేల్చింది. నాడు-నేడు కింద రూ.3,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఏడాది కిందట ప్రకటించినా ఇప్పటివరకు ఆ పనులకు అతీగతీ లేదు. 400 మంది పిల్లలున్న డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోడి గురుకుల పాఠశాలలో రెండంటే రెండే టాయిలెట్లు ఉన్నాయి. కనీసం కప్పుకోడానికి దుప్పట్లు కూడా సరిపడా ఇవ్వలేదు. రాష్ట్రమంతా దాదాపు ఇదే పరిస్థితి. ఆఖరికి వంట చేసుకోడానికి గ్యాస్ కూడా సరిపడా ప్రభుత్వం అందించడం లేదు. పిల్లలే బయటికి వెళ్లి వంటచెరుకు తెచ్చుకోవాల్సిన దుస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం