Visakhapatnam: ‘రౌడీ’ రాజు
ఆయన అధికార పార్టీలో కీలక నేత. నామినేటెడ్ పదవిలో ఉన్నారు. విశాఖపట్నంలో రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, దాన్ని ‘రాజు’లా నడిపిస్తున్నారు.
అరాచకశక్తులు, మాఫియా ముఠాలతో సామ్రాజ్యం
కిరాయి మూకలతో భూదందాలు.. బెదిరింపులు
విశాఖపట్నంలో పేట్రేగిపోతున్న అధికార పార్టీ నేత
ఈనాడు- విశాఖపట్నం, అమరావతి
ఆయన అధికార పార్టీలో కీలక నేత. నామినేటెడ్ పదవిలో ఉన్నారు. విశాఖపట్నంలో(Visakhapatnam) రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, దాన్ని ‘రాజు’లా నడిపిస్తున్నారు. అరాచక శక్తులు, మాఫియా ముఠాలు, అల్లరిమూకలు, గంజాయి బ్యాచ్లు, కిరాయి నేరగాళ్లను పెంచి పోషిస్తూ దందాలు చేయిస్తున్నారు. నగరంలో అత్యంత ఖరీదైన, వివాదాల్లో ఉన్న స్థలాలను సెటిల్మెంట్లతో చేజిక్కించుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో దౌర్జన్యాలకు తెగబడటం... ఇలా ఒకటేమిటి, ఈ రౌడీ రాజు అరాచకాలకు హద్దే లేదు. ప్రతిపక్షాల్లోని ముఖ్యనేతల పర్యటనలకు రౌడీషీటర్లను పంపించి గొడవలు సృష్టించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇంతకు మించిన అర్హతలు ఏం కావాలని అనుకుందేమో.. ఆ అరాచకశక్తికి వైకాపా అపరిమిత అధికారాలిచ్చింది. ఓ నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. పార్టీ తరఫున ఇన్ఛార్జి బాధ్యతలూ ఇచ్చింది. పోలీసు మొదలు అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లోనూ ఆయన చెప్పినట్టే పోస్టింగులు. ఆయనకు నచ్చని, మాట వినని అధికారుల బదిలీలు. ఇంకేముంది... అధికారం అండతో వ్యవస్థలన్నింటినీ దాసోహం చేసుకుని ఈ రౌడీ రాజు విశాఖలో చెలరేగిపోతున్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన స్వార్థ ప్రయోజనాల కోసం రౌడీషీటర్లను పెంచి పోషించగా.. చివరికి వారే ఆయన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన నుంచైనా ఈ నాయకుడు పాఠాలు నేర్వలేదు.
రౌడీషీటర్లతో బెదిరింపులు.. బాధితులపైనే కేసులు
ఒకప్పుడు ఎస్టీడీ బూత్ నడుపుతూ జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత రౌడీలను అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారంలో పాగా వేశారు. కొన్నాళ్లకు రాజకీయాల్లోకి వచ్చారు. నంద్యాలకు చెందిన వైకాపా నాయకుడొకరు ఈయనకు పెట్టుబడులు పెడతారు. భూకబ్జాదారులను ఈయన తన వెంటే ఉంచుకుంటారు. అధిక వడ్డీలకు రుణాలిచ్చేవారిని తనతో తిప్పుకొంటారు. వారి నుంచి అప్పులు తీసుకున్నవారు వడ్డీలు కట్టలేకపోతే.. వారి స్థలాల్ని బలవంతంగా రాయించుకోవడానికి సెటిల్మెంట్ల సమయంలో ఆయన రంగప్రవేశం చేస్తారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తే, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయిస్తారు. చివరికి విలువైన భూముల్ని బలవంతంగా దక్కించుకుంటారు. కైలాసపురం, తాడిచెట్లపాలెం, కప్పరాడ, ఇందిరానగర్, కంచరపాలెం తదితర ప్రాంతాలకు చెందిన అరాచకమూకల్ని ఈయన పెంచి పోషిస్తున్నారు.
అధికారం అండతో కబ్జా దందాలు
ప్రభుత్వ నిర్ణయాల్ని ముందే తెలుసుకుని, ఆయా ప్రాంతాల్లోని భూములను తక్కువ ధరకు కొనేసి.. భారీగా లబ్ధి పొందడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎర్రమట్టి దిబ్బల వద్ద నేరెళ్లవలస సమీపంలో రైతులను భయపెట్టి సుమారు 50 ఎకరాల డీకేటీ పట్టా భూముల్ని తీసుకున్నారు. వాటిని భూ సమీకరణ కింద వీఎంఆర్డీయేకి అప్పగించి భారీగా ప్రయోజనం పొందారు. ఆనందపురం-పెందుర్తి టోల్గేట్ సమీపంలో రైతుల నుంచి కొంత భూమి కొనుగోలు చేసి, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కలిపి అందులో వెంచర్ వేస్తున్నారు. భీమునిపట్నం సమీపంలో ఈయన భాగస్వామిగా ఉన్న ఓ వెంచర్కు రోడ్డు అడ్డంగా వస్తోందని ఏకంగా వీఎంఆర్డీయే మాస్టర్ ప్లాన్నే మార్పించేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పార్కులు, గ్రీన్బెల్ట్ స్థలాలు కబ్జా చేశారు. తాజాగా నగరంలోని ఓ కాలనీని మురికివాడగా గుర్తించి, టీడీఆర్ ఇవ్వాలంటూ అధికారపార్టీకి చెందిన మరో నాయకుడు పావులు కదపగా తనకు టీడీఆర్లో వాటా ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని అడ్డంకులు సృష్టించి వాటా దక్కించుకున్నారు.
ఏం నిర్మించాలన్నా కప్పం కట్టాల్సిందే
విశాఖపట్నంలోని ఓ నియోజకవర్గంలో ఏ చిన్న నిర్మాణం జరగాలన్నా తొలుత ఈ నాయకుడికి కప్పం కట్టాల్సిందే. లేదంటే అక్కడ ఆయన రౌడీలు వాలిపోతారు. బెదిరించి వాటా వసూలు చేస్తారు. విశాఖపట్నం కేంద్రంగా అధికార పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ అగ్రనాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. జీవీఎంసీలో కీలక పదవిలో ఉన్న ఓ కార్పొరేటర్... అక్కడ పైరవీలు చేసి, కమీషన్ల ద్వారా వచ్చిన డబ్బులో కొంత ఈ నాయకుడి కార్యాలయ నిర్వహణకు వెచ్చిస్తారు.
ప్రతిపక్షాలపై దాడులు
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర కోసం విశాఖపట్నం రాగా.. విమానాశ్రయం వద్ద రౌడీమూకల్ని మోహరించి ఆయనకు ఆటంకాలు కల్పించారు. జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమానికి రౌడీమూకల్ని పంపించి అల్లరి సృష్టించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై కోడికత్తితో జరిగిన దాడిని నిరసిస్తూ విశాఖ విమానాశ్రయంలో పోలీసు స్ట్రైకింగ్ ఫోర్సు జీపు అద్దం పగలగొట్టి దాడిచేశారు. క్రికెటర్ల బస్సును అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇంకా అభియోగపత్రమే దాఖలు కాలేదు. అసలు పాస్ లేకుండా విమానాశ్రయంలోకి చొరబడ్డారనేది ఆయనపై ఉన్న అభియోగం. నగరంలోని ఓ డివిజన్కు ఉప ఎన్నికలు జరిగినప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నవారిని అడ్డుకున్న జనసేన నాయకురాలిపై రౌడీమూక దాడులు చేసింది. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. నగరంలోని ఓ డివిజన్లో ఓ శంకుస్థాపన వివాదంలో తెదేపా వారిపై రౌడీలతో దాడి చేయించారు. చివరికి తమ సొంతపార్టీ బహిరంగ సభలు, నియోజకవర్గ సమావేశాలు, యాత్రల్లోనూ ఈ నాయకుడి రౌడీగ్యాంగ్ హడావుడే. అక్కడ ఆయన పట్ల ఎవరైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తే వెంటనే ఈ గ్యాంగ్ తమదైన పద్ధతిలో వారి నోరు మూయిస్తుంది.
నేరచరితులకే పని ఇస్తారు..
హత్య కేసులు, ఇతర నేరాల్లో నిందితులు, నేరచరిత్ర కలిగిన వారినే కారు డ్రైవర్లుగా, బౌన్సర్లుగా, ఇతరత్రా విధుల్లో తనవద్ద పెట్టుకున్నారు. ఇలాంటి రౌడీలు ఆయన వద్ద దాదాపు వందమందికి పైగా ఉన్నారు. వారిలో ఒక్కొక్కరి కింద కనీసం 10-15 మంది ఉంటారు. ఎక్కడ ఎవరిపై దాడి చేయాలన్నా, అల్లర్లు సృష్టించాలన్నా వీరిని రంగంలోకి దింపుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి