IT Jobs in AP: కంపెనీలు రావడం లేదేంటి బ్రో!
రాష్ట్రంలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణల్ని నిలిపేసిన ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు భారీగా పడిపోయాయి.
ప్రాంగణ నియామకాల్ని మొదలుపెట్టని ఐటీ దిగ్గజ సంస్థలు
గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన ఉద్యోగాలు
హై ఎండ్ నైపుణ్య వర్సిటీ, శిక్షణల్ని అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణల్ని నిలిపేసిన ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు భారీగా పడిపోయాయి. నియామకాలకు వస్తున్న కొద్దోగొప్పో కంపెనీలు... అభ్యర్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థుల శిక్షణ కోసం హై ఎండ్ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ దాన్ని అటకెక్కించారు. నైపుణ్య కళాశాలల్లో అభ్యర్థులకు అవసరమయ్యే శిక్షణ ఇవ్వడం లేదు. సాధారణ పరిస్థితుల్లో నైపుణ్యాలు కొంచెం తక్కువున్నా కంపెనీలు అభ్యర్థుల్ని తీసుకుంటాయి. తక్కువ సంఖ్యలో ఉద్యోగాలిస్తున్నప్పుడు మెరికలనే ఎంచుకుంటాయి. నైపుణ్యాల్ని అందించకుండా విద్యార్థులకు ప్రభుత్వం ద్రోహం చేసింది.
ఐటీ రంగంలో 25 ఏళ్ల తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో ప్రాంగణ నియామకాలు తగ్గాయి. విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్నా ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో నియామకాల్ని చేపడుతున్న దాఖలాల్లేవు. ఎక్సెంచర్, వర్చుసా, ఐబీఎం, కొన్ని స్టార్టప్ సంస్థలు.. అరకొరగా చేపట్టాయి. ఎల్అండ్టీ మైండ్ట్రీ, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ సంస్థలు నియామకాలపై ఇంతవరకు ఇంజినీరింగ్ కళాశాలలకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. హెచ్సీఎల్ టెక్నాలజీ, విప్రో సంస్థలు కొన్ని కళాశాలల నుంచి డేటా తీసుకున్నా నియామకాలకు వచ్చేదీ లేనిదీ చెప్పలేదు. టీసీఎస్ జనవరిలో కళాశాలలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఆఫర్ లెటర్లు పొందిన వారికి ఉద్యోగాల్ని ఇవ్వడంపైనే ఇన్ఫోసిస్ దృష్టి సారించింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో జులై నుంచి ప్లేస్మెంట్ల ప్రక్రియ మొదలై అక్టోబరుతో దాదాపుగా ముగుస్తుంది. ఏవో కొన్ని కంపెనీలు మాత్రం జనవరి దాకా నియామకాల్ని చేపడుతుంటాయి.
సగానికి పైగానే..
విశాఖపట్నంలోని ఓ కళాశాల ఏటా 2 వేలకు పైగా ఉద్యోగాలకు ఆఫర్ లెటర్లు పొందుతోంది. ఈ ఏడాది 250 మాత్రమే వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విజయవాడలోని ఓ కళాశాలకు గతేడాది 1,100 ఆఫర్ లెటర్లు రాగా.. ఈసారి ఆ సంఖ్య 500 దాటలేదు. గుంటూరులోని ఓ ముఖ్య కళాశాలలో గతేడాది 1,200 మంది ఆఫర్ లెటర్లు పొందారు. ఈసారి 200 మందికే కొలువులు దక్కాయి. రాయలసీమలోని ఓ ప్రముఖ కళాశాలలో గతేడాది 90 శాతం ప్రాంగణ నియామకాలు ఉండగా.. ఈసారి 25 శాతమే లభించాయి.
ఫ్రెషర్స్లో ఆందోళన
ఐటీ కంపెనీలు విధిస్తున్న కోతల ప్రభావం ఫ్రెషర్స్పై పడింది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక పరిస్థితి మందగమనం, కొవిడ్ సమయంలో చేపట్టిన అధిక నియామకాల కారణంగా సంస్థలు ఇప్పుడు కొత్త ఉద్యోగాలపై వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. కొన్ని స్టార్టప్ కంపెనీలు తక్కువ మందిని తీసుకుంటుండగా.. సర్టిఫికేషన్ ఉన్న వారికి ప్రాధాన్యమిస్తున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. కృత్రిమ మేధ, చాట్ జీపీటీలాంటి సాంకేతికత కూడా కొత్త నియామకాలపై ప్రభావం చూపే అవకాశముందని అధ్యాపకులు చెబుతున్నారు. మరోపక్క టీఎసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాంటి దిగ్గజ కంపెనీల్లో రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 16,612 మేర తగ్గింది. ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ, తగ్గడం అనేది అరుదు. ఈ పరిణామం ఉద్యోగార్థుల్ని కలవరపెడుతోంది. కరోనా తర్వాత ఐటీ నియామకాలు పెరగడంతో చాలా కళాశాలలు కోర్ ఇంజినీరింగ్ సివిల్, మెకానికల్, ఈఈఈ లాంటి బ్రాంచ్లను తగ్గించుకొని కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఐటీ కోర్సుల్ని పెంచేశాయి. వీటిలో విద్యార్థులు భారీగా చేరారు. ప్రాంగణ నియామకాలు లేకపోవడంతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు. 2024 ఏప్రిల్ తర్వాతే కంపెనీలు నియామకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పటిదాకా విద్యార్థులు నైపుణ్యాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు.
నైపుణ్య దారుల్ని మూసేసి..
విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు ఉంటేనే సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగాలిస్తాయి. తెదేపా హయాంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్ని విరివిగా నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటిని ఆపేసింది. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచిలైన సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థులకు ఉపయోగపడే సీమెన్స్ ప్రాజెక్టును ప్రభుత్వం మూలకు నెట్టింది. నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి. రాష్ట్రంలో శిక్షణ ఇవ్వకపోతుండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్తున్నారు. శిక్షణకే రూ.లక్ష దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది పేదవారికి పెనుభారంగా పరిణమించింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు విశాఖపట్నంలో ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పటికీ హామీని నిలబెట్టుకోలేదు. నైపుణ్య కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉపయోగపడే శిక్షణ ఇవ్వడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!