Palnadu: రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ఓ ఇంటి యజమాని ఎదురింటి వారితో గొడవపడి నడిరోడ్డుపై గోడ నిర్మించారు. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్‌కు చెందిన ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి.

Updated : 02 Dec 2023 07:43 IST

పల్నాడు జిల్లా(Palnadu) శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ఓ ఇంటి యజమాని ఎదురింటి వారితో గొడవపడి నడిరోడ్డుపై గోడ నిర్మించారు. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్‌కు చెందిన ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. వీరిళ్ల మధ్యలో సీసీ రోడ్డు ఉంది. లక్ష్మీనారాయణ రోడ్డు మీదకు వచ్చేలా గతంలో మెట్లు కట్టాడని చంద్రశేఖర్‌ అభ్యంతరం తెలిపారు. అప్పట్లో గ్రామపెద్దలు, పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఇద్దరికీ రాజీ కుదిర్చారు. చంద్రశేఖర్‌ ఇటీవల తన ఇంటి ఎదుట మురుగు కాలువపై మెట్లు కట్టారు. దీనికి నిరసనగా లక్ష్మీనారాయణ ఏకంగా ఇంటి ముందున్న రోడ్డు మధ్యలో సిమెంటు ఇటుకలతో గోడ నిర్మించారు. దీనిపై పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని చంద్రశేఖర్‌ వాపోయారు.

న్యూస్‌టుడే, శావల్యాపురం (కారుమంచి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు