సభలకు వస్తారా.. చస్తారా!
డ్వాక్రా సంఘాల మహిళలను అధికార వైకాపా రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరకుగా మార్చేశారు. ఊరూ, మండలం, జిల్లా, రాష్ట్రం... ఏ స్థాయిలో సభలూ సమావేశాలు నిర్వహించినా వాటికి భారీగా చేపట్టే జన సమీకరణంతా ఈ డ్వాక్రా మహిళలే!
భయపడిపోతున్న మహిళలు
వైకాపా, సర్కారు సమావేశాలకు బలవంతంగా తరలింపు
రాకుంటే పింఛన్లు, రుణాలు బంద్ అంటూ బెదిరింపులు
అదేంటన్నవారిని అరెస్టులు చేస్తూ...
నిరసన తెలిపిన వారిని నిర్బంధిస్తూ...
ప్రశ్నించిన వారిపై విషం చిమ్ముతూ...
...అడుగడుగునా నియంతను తలపిస్తున్న జగనన్న పాలనలో అపురూపమైన ఆడబిడ్డల్ని అరువు వస్తువులుగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలో జగనన్న సభలు, వైకాపా సర్కారు సమావేశాలు... మహిళల పాలిట శాపాలుగా మారాయి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలనూ, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని ఒత్తిడి చేసి మరీ సభలకు తీసుకువస్తున్నారు. ‘పింఛన్లు తీసుకోవట్లేదా... సభలకెందుకు రార’ంటూ ఒంటరి మహిళలపై సైతం విరుచుకుపడుతున్నారు. ‘సభలకు వస్తారా... చస్తారా’ అన్నట్లు బెదిరిస్తూ... భయపెడుతున్నారు.
డ్వాక్రా సంఘాల మహిళలను అధికార వైకాపా రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరకుగా మార్చేశారు. ఊరూ, మండలం, జిల్లా, రాష్ట్రం... ఏ స్థాయిలో సభలూ సమావేశాలు నిర్వహించినా వాటికి భారీగా చేపట్టే జన సమీకరణంతా ఈ డ్వాక్రా మహిళలే! ఎక్కడ సభలున్నా ఆటోలలో, వ్యాన్లలో, బస్సుల్లో మహిళలను కుక్కేసి తరలిస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉన్నా ఈ సభలకు వచ్చి తీరాల్సిందే! రాకపోతే అదిరిస్తారు.. సంక్షేమ పథకాలు ఇవ్వబోమని బెదిరిస్తారు.. ఫైన్లంటూ బ్లాక్మెయిల్కూ దిగుతారు. వీరి పైత్యం ఎంత వరకూ వెళ్లిందంటే.. ఆ మహిళలు పార్టీ సభలకు వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను సంఘం వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. అలా చేస్తేనే వారు సభలకు వచ్చినట్లుగా ఆర్పీలు, వాలంటీర్లు రికార్డు చేస్తారు. గతంలోనూ సభలకు డ్వాక్రా సంఘాల మహిళలను తీసుకువచ్చినప్పటికీ... ఇప్పుడు బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనంతగా దాదాపు నిర్భందంగా తరలించిన చరిత్రయితే లేదు. ఇది కాదా డ్వాక్రా మహిళల పట్ల ముఖ్యమంత్రి జగనన్న పాపం.
గడప గడపకు... నుంచి సీఎం సభల వరకూ..
సామాజిక న్యాయభేరి, జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే ఎందుకు కావాలి, సామాజిక సాధికార యాత్ర, మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన గర్జన సభలు... ఇలా ఎన్నో రాజకీయ ప్రచార కార్యక్రమాలను అధికార వైకాపా తన రాజకీయ లబ్ధి కోసం చేపడుతోంది. వీటన్నింటికీ జన సమీకరణలో భాగంగా మొదట డ్వాక్రా మహిళలనే తరలిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం... పేరుతో ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరుగుతున్నపుడు వారి వెనుకా డ్వాక్రా సంఘాల మహిళలు ఉండాల్సిందే. అసలు, వీటికీ డ్వాక్రా సంఘాల మహిళలకూ సంబంధం ఏంటి? ఆ మహిళల స్వాభిమానంపై దెబ్బకొడుతూ ఇలా రాజకీయ కార్యక్రమాలకోసం రోడ్లపైకి తీసుకువస్తున్నారు.
బంధించి.. వేధించి!
ముఖ్యమంత్రి సభలకైతే అందరికంటే ముందే, పొద్దుపొద్దున్నే సభాస్థలికి ఈ మహిళలను, పింఛన్ లబ్ధిదారులను భారీగా తరలిస్తున్నారు. సభ పూర్తయ్యేవరకూ వెళ్లకుండా కట్టడి చేసేందుకు మూడంచెల బారికేడ్లు పెట్టి, పోలీసులనూ ప్రయోగిస్తున్నారు. సాయంత్రం పూట సభ జరిగినా రోజంతా మండుటెండల్లో మగ్గిపోవాల్సిందే. సీఎం సభల్లో ఇలాంటి ఇబ్బంది తట్టుకోలేక మహిళలు ఆ అడ్డంకులను ఛేదించుకుని బయటకు వెళ్లిన సందర్భాలు అనేకమున్నాయి. వారిని అంతలా హింసించి ఇబ్బందులకు గురి చేసి మరీ సభలకు తరలించాల్సిన అవసరమేంటో ఏలినవారే సెలవివ్వాలి..
రాకపోతే అంతే..
రుణమాఫీకి సంబంధించి డబ్బు ఇవ్వబోం, కొత్త రుణాలూ రాకుండా చేస్తాం, పావలా వడ్డీ ఆపేస్తాం, రాకపోతే ఒక్కొక్కరికీ రూ.200ఫైన్ వేస్తాం.... అంటూ ఆయా సంఘాల మహిళలను బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గతేడాది ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చినపుడు ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా పెద్ద ఎత్తున జనసమీకరణకు దిగింది. ఆ సమయంలో సభకు రాకపోతే ఇళ్లకు నీటి సరఫరానీ నిలిపివేస్తామంటూ బెదిరించడంతోపాటు.. అన్నంతపనీ చేసి మరీ భీమిలి మండల పరిధిలోని మహిళలను సభకు తరలించారు. డ్వాక్రా సంఘాల మహిళలనే కాదు, ‘పింఛన్ తింటున్నారు కదా? సమావేశాలకు ఎందుకు రారు?’ అంటూ వితంతు, వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల్ని కూడా వాలంటీర్లు, వైకాపా క్షేత్రస్థాయి నేతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అధికారులు, వాలంటీర్లు, వార్డు కార్యదర్శులు, యూసీడీ సిబ్బంది, ఆర్పీలు, వీఏఏలు... ఇలా ఎవరి స్థాయిలో వారు బెదిరిస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి ఎంతమంది మహిళలను తరలించాలనేదానిపై వీఓఏలు, ఆర్పీలకు లక్ష్యాలనూ నిర్దేశిస్తున్నారు. ‘ఎన్ని పనులున్నా మానుకుని సభలూ, సమావేశాలకు వెళ్లాల్సి వస్తోంది. వెళ్లకపోతే ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తారో? ఏ సాయం అందకుండా ఆపేస్తారోనన్న భయం’ అంటూ డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతోనే చాలా మంది సభలకు వస్తున్నారు. వస్తూనే సభాస్థలి వద్ద సెల్ఫీ తీసుకుని ఫోటోను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి సమావేశం ప్రారంభమయ్యేలోపు లేదా ప్రారంభమవగానే వెనుదిరుగుతున్నారు. వైకాపా చేస్తున్న సామాజిక సాధికార యాత్రల్లో సభల్లో కుర్చీలన్నీ ఖాళీగానే కనిపిస్తుండడానికి ఇదే ప్రధానం కారణం.
బస్సు యాత్రల్లోనూ..
సామాజిక సాధికార యాత్ర పేరుతో ఇప్పుడు వైకాపా చేపడుతున్న బస్సు యాత్రల సందర్భంగా నిర్వహిస్తున్న సభలకూ డ్వాక్రా సంఘాల మహిళలనే పెద్ద ఎత్తున తీసుకువస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళ సాధికారత సాధించేశామంటూ యాత్ర చేస్తున్నారు. అదే నిజమైతే ఆ వర్గాలన్నీ స్వచ్ఛందంగా ఈ సభలకు రావాలి కదా మరి? ఆయా వర్గాల నుంచి స్పందన లేదంటే దానర్థం ఏంటి? చేయాల్సింది చేయకపోగా.. చేశామని జనాలను భ్రమింపజేసేందుకు ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సభలూ, యాత్రలూ చేపడుతూ వాటికి డ్వాక్రా సంఘాల మహిళలను రప్పించడాన్ని ఎలా చూడాలి?
ఇదేనా మహిళా సాధికారత!
మహిళల స్వాభిమానంపై దెబ్బకొడుతూ... ఇలా అధికార వైకాపా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలకు వారిని భారీగా తరలించడమేనా మహిళా సాధికారత. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలు చెబుతున్న సాధికారతతో మహిళలకు దక్కిన గౌరవమేంటి..? వారు చెబుతున్నట్లు మహిళా సాధికారత సాధిస్తే మహిళలే స్వచ్ఛందంగా సమావేశాలకు తరలివచ్చి ఈ నాలుగేళ్లలో మాకు దక్కిన గౌరవమిదీ అని చెప్పాలి కదా? అలా కాకుండా బెదిరించి మహిళలకు సభలకు తరలించడం ద్వారా మహిళా సాధికార సాధించేశామంటే అయిపోతుందా?
చేయూతకు ‘చేయి’చ్చి!
45-60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున చేయూత కింద సాయం అందిస్తామని చెప్పి.. దానికి పలు నిబంధనలు పెట్టి 10 దశల తనిఖీ నిర్వహించి లబ్ధిదారుల సంఖ్యని ఏటికేడూ తగ్గిస్తున్నారు. గత ప్రభుత్వంలో పశుమిత్రలుగా పనిచేసిన దాదాపు 3వేల మంది డ్వాక్రా మహిళలను ఇప్పుడు తొలగించారు. 2వేల మంది బీమా మిత్రల నోట్లోనూ మట్టికొట్టారు. ఈ నాలుగేళ్లలో ఇలాంటివి ఎన్నో! అటు ప్రపంచస్థాయిలో ఖ్యాతిగాంచిన డ్వాక్రా సంఘాల్లో స్వయం ఉపాధి పొందుతూ గౌరవంగా జీవిస్తున్న మహిళలను రోడ్లపైకి తేవడం.. ఇటు జనానికి సేవలు చేస్తూ గౌరవ వేతనంతో ఇంటిని నడుపుకొంటున్న గృహలక్ష్మిలకీ ఉపాధి లేకుండా రోడ్డున పడేయడం.. జగనన్న పాపం కాదా!
నేను సీఎంగా కొనసాగినంత కాలం కల్యాణమిత్రలుగా మీరే ఉంటారు. ప్రోత్సాహకాన్నీ పెంచుతా’ అని ముఖ్యమంత్రి జగన్ సుమారు 2,500 మంది కల్యాణమిత్రలను నమ్మించారు.
తర్వాత వారిని తొలగించినట్లుగా ఆదేశాలు కూడా లేకుండానే పక్కనపెట్టేశారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట