సార్ వస్తున్నారు.. ఎక్కడి చేపలు అక్కడే గప్చుప్!
ముఖ్యమంత్రి జగన్ గాలిలో వెళ్తుంటేనే నేల మీద ఆంక్షలు విధించే అధికారులు ఇప్పుడు ఆయనే వస్తున్నాంటే ఊరుకుంటారా! విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని దాదాపుగా ఖాళీ చేయిస్తున్నారు.
రుషికొండ నుంచి చేపల వేట బంద్
బ్లూ ఫ్లాగ్ బీచ్కు మూసివేత గండం!
సీఎం క్యాంపు కార్యాలయం పేరుతో రెండు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు
జల క్రీడల నిర్మాణాల కూల్చివేత
పర్యాటక నిర్మాణాల తొలగింపు
ఈనాడు, విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ గాలిలో వెళ్తుంటేనే నేల మీద ఆంక్షలు విధించే అధికారులు ఇప్పుడు ఆయనే వస్తున్నాంటే ఊరుకుంటారా! విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని దాదాపుగా ఖాళీ చేయిస్తున్నారు. సీఎం ప్యాలెస్ కోసం రుషికొండను బోడిగుండు చేయగా.. ఇప్పుడు దాన్ని ఆనుకొని సముద్ర తీరంలోని పలు నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. స్థానిక మత్స్యకారులు రుషికొండ వైపు నుంచి చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించినట్లు సమాచారం. డిసెంబరు రెండో వారంలో సీఎం జగన్ విశాఖకు వస్తారనే చర్చ సాగుతోంది. రుషికొండ మీద భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ప్రఖ్యాతిగాంచిన, బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలిగిన రుషికొండ బీచ్ను మూసేస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు అనుకూలమైన బీచ్లకు స్వీడన్ ఈ రేటింగ్ ఇస్తుంది. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉంటే విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. కేంద్రం గతంలో ఇక్కడ రూ. 7 కోట్లతో వసతులు కల్పించింది. మరో రూ. 3 కోట్లతో వాటిని మరింత మెరుగుపరిచారు. సీఎం వ్యక్తిగత భద్రత చూసే అధికారులు రెండు కి.మీ. పరిధిలో ఎటువంటి కార్యకలాపాలు ఉండకూడదని ఆదేశించడంతో ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. బీచ్లోని పిల్లల ఉద్యానవనం, మరుగుదొడ్లు, మంచినీటి శుద్ధి కేంద్రాన్ని మరో ప్రాంతానికి తరలిస్తారని సమాచారం.
జల క్రీడల నిర్మాణాలు కూల్చేసి
రుషికొండ కేంద్రంగా జల క్రీడల విన్యాసాలను ప్రోత్సహించేలా గతంలో ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు వాటిని తొలగించేశారు. దీంతో క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం విశాఖ విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేందుకు బీచ్లోని హెలిప్యాడ్ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిటూరిజం కోసం గతంలో నిర్మించిన దాన్ని ప్రస్తుతం ఆధునికీకరిస్తున్నారు. హెలికాప్టర్ దిగడానికి అడ్డంగా ఉన్నాయని జల క్రీడల విన్యాసాల పడవలను భద్రపరిచిన షెడ్లు కూల్చేశారు. మొత్తం పరిసరాలను భారీ యంత్రాలతో చదును చేస్తున్నారు. పర్యాటకుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల పైకప్పులను గురువారం తొలగించారు. ఒకటి, రెండు రోజుల తర్వాత వాటినీ పూర్తిగా తీసేస్తారంటున్నారు.
కొండ చుట్టూ పనులు
హెలిప్యాడ్ నుంచి గతంలో కొండ పక్కన నిర్మించిన కొత్త రోడ్డులోకి వెళ్లేందుకు అనుసంధాన మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ- భీమిలి మార్గం నుంచి బీచ్లోకి వెళ్లే రోడ్డును కొత్తగా పునరుద్ధరించారు. బీచ్లోని శివాలయాన్ని ఆనుకొని ఉన్న మరో రోడ్డుకు కొత్త హంగులు అద్దారు. కొండ మీదికి 24 గంటల నీటి సరఫరా నిమిత్తం కొండ వెనుక పంపుహౌస్ నిర్మిస్తున్నారు.
ఉపాధిపై ప్రభావం
పేదలు.. పెత్తందారులు అని మాట్లాడే జగన్ రుషికొండలో క్యాంపు కార్యాలయం భద్రత పేరుతో పేదల ఉపాధికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సుమారు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు రుషికొండ బీచ్ నుంచే నిత్యం వేట సాగిస్తుంటారు. అక్కడే వలలు అల్లుకుంటారు. పడవలకు మరమ్మతులు చేస్తుంటారు. బ్లూఫ్లాగ్ బీచ్ను అభివృద్ధి చేసిన సమయంలోనూ వారికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ప్రస్తుతం వారి వేట స్థావరం మార్చుకోవాలని, రుషికొండ సమీపం నుంచి వేటకు వెళ్లకూడదనే హెచ్చరికలు చేసినట్లు సమాచారం. స్థానిక దుకాణదారుల వ్యాపారాల పైనా పలు ఆంక్షలు విధించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి