ఏపీ కుత్తుకపై కత్తి.. ప్రశ్నించరేం గొంతెత్తి?
జగనన్నా... 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి అది సాధిస్తా.. ఇది తీసుకొస్తానంటూ బీరాలు పలికారు కదా... కేంద్రం మెడలు వంచైనా చెప్పింది చేస్తానని ఈ నాలుగున్నరేళ్లలో సాధించిందేంటి? ప్రధాని మోదీతో అంతా బాగుందని స్వయంగా ప్రకటించుకున్న మీరు...
సాగునీటి ప్రాజెక్టులు, నీటిపంపకాల్లో రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన వైకాపా సర్కారు
పార్లమెంటులో 31 మంది ఎంపీలున్నా తీరని డిమాండ్లు
ఎన్నికల ముంగిటైనా ఎలుగెత్తే ప్రయత్నం చేస్తారా?
ఇదే చివరి పూర్తిస్థాయి లోక్సభ భేటీ మరి!
ఈనాడు - అమరావతి
జగనన్నా... 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి అది సాధిస్తా.. ఇది తీసుకొస్తానంటూ బీరాలు పలికారు కదా...
కేంద్రం మెడలు వంచైనా చెప్పింది చేస్తానని ఈ నాలుగున్నరేళ్లలో సాధించిందేంటి?
ప్రధాని మోదీతో అంతా బాగుందని స్వయంగా ప్రకటించుకున్న మీరు... దిల్లీకి వెళ్తే శాలువాలు కప్పడం, వాళ్లు ఇక్కడికొస్తే సాగిలపడటం.. అంతేకదా...
మీ స్వప్రయోజనాల కారణంగా ఇప్పటివరకూ కుదరలేదనే అనుకుందాం..
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనైనా, మన రాష్ట్ర న్యాయమైన డిమాండ్లను గట్టిగా వినిపించే ప్రయత్నమేదైనా చేస్తున్నారా?
ఎందుకంటే, ఇప్పుడు జరుగుతున్నవే లోక్సభ పూర్తిస్థాయి సమావేశాలు. తర్వాత ఓట్ఆన్ అకౌంట్ మాత్రమే ఉంటుంది!
కనీసం, పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా నిర్వహించకపోతిరి!
మీకే రాష్ట్ర ప్రయోజనాలు పట్టకపోతే, ఇక ఎంపీలెందుకు నోరెత్తుతారు.
రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా, జగన్ సర్కారు పెదవి విప్పి దిల్లీ పెద్దలను ప్రశ్నించే చేవ చూపడం లేదు. తూతూమంత్రంగా లేఖలు రాయడం తప్ప చేసిందేమీ లేదు. ప్రధాని మోదీతో రాజకీయాలకు అతీతమైన అలౌకిక స్నేహం ఉందని ప్రకటించుకున్న సీఎం జగన్.. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేకంగా సాధించిందేమీ లేదు. లోక్సభ, రాజ్యసభల్లో కలిపి 31 మంది ఎంపీల బలమున్నా ఒరిగింది శూన్యం. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సహా కేంద్రం నుంచి అన్నీ సాధిస్తానని చెప్పిన సీఎం ఇప్పుడు కనీసం నోరు మెదపట్లేదు. అంతర్రాష్ట్ర జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో వైకాపా సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, రాష్ట్రానికి దక్కాల్సిన నదీ జలాలను కాపాడుకోవడం.. ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డుకోవడం లాంటి అంశాల్లో దిల్లీతో సంబంధ బాంధవ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, రాష్ట్ర సాగునీటి కేటాయింపులకు నష్టం కలిగించే దస్త్రాలు ఒక్కొక్కటిగా కేంద్ర జలశక్తి శాఖలో కదులుతున్నా జగన్ తెలుసుకోలేకపోయారు. తీరా పరిస్థితి చేయి దాటిపోయాక తూతూమంత్రంగా లేఖలు రాసి మిన్నకుండిపోయారు. ఎగువ రాష్ట్రాలు పావులు కదుపుతున్నా ఏమీ చేయలేకపోయారనేందుకు ఎన్నో ఉదాహరణలు.
- తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పునఃసమీక్షించాలని కేంద్రం నిర్ణయించి, నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ లేదా పునఃసమీక్ష అక్కర్లేదన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాదన. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై జగన్ గట్టిగా మాట్లాడలేకపోయారు. కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ముందుగా పసిగట్టలేకపోయారు. రాష్ట్ర ఎంపీలూ దీనిపై గొంతెత్తిన పాపాన పోలేదు.
- గోదావరిలో తెలుగు రాష్ట్రాల నీటి వాటాలను స్పష్టంగా తేల్చిచెప్పేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిమాండు చేస్తోంది. కానీ కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. సీఎం జగన్ లేఖలు రాయడం తప్ప ఏమీ చేయడం లేదు.
- రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేకపోవడంతోపాటు హరిత ట్రైబ్యునల్ తీర్పుతో ఆ పనులు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోతేనే ఇలాంటి అడ్డంకులు వస్తాయని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ అధికారులను సంప్రదించి ఒప్పించే నాథుడే లేకుండా పోయారు. ఎత్తిపోతల పథకం కొలిక్కి వస్తే వర్షాభావ పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయినా ఎంపీలు చొరవ చూపితే ఒట్టు.
- కర్ణాటక ఎగువభద్ర ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇందుకు కేంద్రం పెట్టుబడి అనుమతులు ఇచ్చేసింది. అయితే, ఏదైనా జలాశయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటప్పుడు కేంద్ర జలసంఘం దిగువ ఉండే రాష్ట్రాల వాదనలు వినాలి. ఇక్కడ దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాదనలేమీ వినలేదు. పైగా ఈ ప్రాజెక్టుకు 36 టీఎంసీల నీటి కోసం కర్ణాటక చేసిన ప్రతిపాదనలను నీటి లభ్యత లేకపోవడంతో బచావత్ ట్రైబ్యునల్ అనుమతించలేదు. దీన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చినా ఏపీ సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప గట్టిగా చేసిందేమీ లేదు.
- పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్రకారం పూర్తి నిధులు రావాలి. ఇప్పటికీ పునరావాసం పూర్తికాకపోవడంతో లక్ష కుటుంబాలకు పైగా విలవిల్లాడుతున్నాయి. రూ.47,725 కోట్లతో రెండో డీపీఆర్కు పెట్టుబడి అనుమతులు తప్ప.. అన్నీ 2019 నాటికే పూర్తయ్యాయి. సీఎం జగన్ ఇప్పటికీ ఆ పెట్టుబడికి అనుమతులు సాధించలేదు. తాజాగా మళ్లీ నిధులపై కేంద్రం నాలుక మడతేసినా ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. ఎంపీలు స్పందించడంలేదు. ఇందుకు రాజకీయ కారణాలే అడ్డంకిగా ఉన్నాయని అధికారులూ అంగీకరిస్తున్నారు.
- ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ప్రాజెక్టులను ఆ బోర్డుల పరిధిలోకి తీసుకురావాలనేది ఆంధ్రప్రదేశ్ డిమాండు. చట్టప్రకారం ఇది చేయాల్సిందే. దీనిపైనా గట్టిగా మాట్లాడరు.. దిల్లీ పెద్దలను ప్రశ్నించరు.. న్యాయమైన డిమాండునూ సాధించరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం