Cyclone Michaung: అలల కల్లోలం
మిగ్జాం తుపాను.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. చెన్నై నగరంతో పాటు.. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి.
నేడు బాపట్లకు దగ్గరలో తీరం దాటనున్న మిగ్జాం తుపాను
గంటకు 110 కి.మీ. గరిష్ఠ వేగంతో గాలులు.. అతి భారీ వర్షాలు
నీటమునిగిన నెల్లూరు, తిరుపతి జిల్లాలు
కూలిన చెట్లు.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఈనాడు - అమరావతి, బృందం
మిగ్జాం తుపాను.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిపిస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది. చెన్నై నగరంతో పాటు.. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి నుంచి వర్షం, గాలుల తీవ్రత అధికమైంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి సాగుతున్న తుపాను.. మొత్తం 8 జిల్లాలపై ప్రభావం చూపనుంది. గంటకు గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో సుడిగాలులు సృష్టిస్తూ.. తీరాన్ని చుట్టేయనుంది.
సోమవారం సాయంత్రం మిగ్జాం గంటకు 10 కి.మీ. వేగంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి కదులుతోంది. ఇదే వేగం ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరంలో సోమవారం నుంచి అలలు 1.50 మీటర్ల నుంచి 2 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. తుపాను నేపథ్యంలో 8 జిల్లాల్లో 300 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని గుర్తించామని.. 181 ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 10 కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు నేడు కూడా సెలవులు ప్రకటించారు.
నీటమునిగిన తిరుపతి, నెల్లూరు జిల్లాలు
మిగ్జాం ప్రభావంతో.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో రైల్వే అండర్పాస్ల వద్ద నీరు నిలిచింది. పలు కాలనీల్లోనూ మోకాల్లోతు నీరు చేరింది. వందకు పైగా ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసరాలు, వస్తువులు తడిసిపోయాయి. సైదాపురం మండలంలో కైవల్యనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడటంతో ఇళ్లు కోతకు గరవుతున్నాయి. శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్నగర్ వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య ఏరులా మారింది. సూళ్లూరుపేట వద్ద కోల్కతా-చెన్నై జాతీయరహదారిపై వరద నీరు చేరింది. కొప్పేడు-కావనూరు-శ్రీరామపురం మార్గంలో కాజ్వే పై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి.
నదులకు భారీగా వరద..
తిరుపతి జిల్లాలో కాళంగి, మల్లెమడుగు, స్వర్ణముఖి నదులకు భారీగా వరదనీరు చేరింది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కోట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వాకాడు తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తిరుమల ఘాట్రోడ్డులోనూ కొన్నిచోట్ల చెట్లు కూలగా.. వెంటనే తొలగించారు. శ్రీకాళహస్తిలోని ప్రాజెక్టు వీధిలో వందేళ్లనాటి చెట్టు కూలింది. నెల్లూరులోనూ పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. నెల్లూరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సుమారు 100 బస్సులను రద్దు చేశారు. వాన, గాలులతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచింది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టోల్ ప్లాజా సమీపంలోని గోకులకృష్ణ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద కాళంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర నీటిమట్టంతో వరద ప్రవహిస్తుండటంతో పోలీసులు రహదారిని మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
పునరావాస శిబిరాల్లోకి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని వట్రపాలెం పూర్తిగా మునగడంతో సుమారు 500 మందిని, వాకాడు పరిధిలో 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల్లూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలకు 1,991 మందిని తరలించామని, మరో 2,423 మందిని తరలించనున్నట్లు అధికారులు వివరించారు. బాపట్ల జిల్లా, రేపల్లె, చీరాలలో పల్లపు ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చూడటంతోపాటు 800 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 2వేల మందిని తరలించారు. నాగాయలంక మండలంలో 4,500 మందిని తరలించనున్నారు. విశాఖలో 64 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు.
నేడు, రేపు భారీ, అతిభారీ వర్షాలు
మంగళవారం: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైయస్ఆర్, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి
బుధవారం: విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు