YSRCP Leader: పేరులో చిన్న.. సెటిల్మెంట్లలో ‘పెద్ద’
‘యథా రాజా తథా ప్రజా’... ఈ మాటల్ని ‘యథా బడా నేత తథా ఛోటా నేత’గా అన్వయించుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్ సీఎం అయ్యాక ఇదివరకెన్నడూ లేనంతగా సెటిల్మెంట్లు, బెదిరింపుల సంస్కృతి జిల్లాలకూ పాకింది. వివాదం అని తెలిస్తే చాలు...
భూములైనా, ఆస్తులైనా ఆయన కన్నుపడితే సొంతం కావాల్సిందే
ఎంతటి పెద్దవారైనా ఆదేశాలకు తలొగ్గాల్సిందే..
విజయనగరం జిల్లాలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి అరాచకం
ఈనాడు, అమరావతి
‘యథా రాజా తథా ప్రజా’... ఈ మాటల్ని ‘యథా బడా నేత తథా ఛోటా నేత’గా అన్వయించుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్ సీఎం అయ్యాక ఇదివరకెన్నడూ లేనంతగా సెటిల్మెంట్లు, బెదిరింపుల సంస్కృతి జిల్లాలకూ పాకింది. వివాదం అని తెలిస్తే చాలు... రెండు పిల్లుల మధ్య రొట్టె తగవు కోతి తీర్చినట్లుగా... మధ్యలో దూరి మొత్తం స్వాహా చేసేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి సెటిల్మెంట్ల దూకుడుకు జనాలు బెంబేలెత్తుతున్నారు. భూములూ, ఆస్తులూ, పరిశ్రమలూ... వేటిమీద కన్ను పడితే అవి ఆయన పేరిట మారిపోవాల్సిందే. బాధితులది మౌన రోదనే!
అక్కడ ఏ లావాదేవీలు జరగాలన్నా ఆయన సెటిల్మెంట్ చేయాల్సిందే. ఎంతటివారైనా ఇచ్చినంత పుచ్చుకుని తప్పుకోవాల్సిందే. కాదూ కూడదంటే కథ మలుపుతిప్పి వారంతట వారే కాళ్లబేరానికి వచ్చేలా చేస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి పేట్రేగిపోతున్న తీరిది. తన సమీప బంధువైన రాష్ట్రస్థాయి నాయకుడి నీడగా రాజకీయంగా ఎదిగిన ఈయన.. ఇప్పుడు జిల్లాలో అరాచకాలు, అక్రమాలు, అవినీతికి వట వృక్షంలా మారారు. ఆయన పేరుకే ‘చిన్న’ మనిషి.. దందాల్లో చాలా ‘పెద్ద’. ఈ నాయకుడికి ఓ కీలక పదవి కట్టబెట్టేందుకు దాని రిజర్వేషన్నే మార్పించేశారు.
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల్లో అన్నీ తానై వ్యవహరిస్తారీయన. అపాయింట్మెంట్ లేకుండానూ సీఎం జగన్ను కలవగలరు. ఈ స్థాయిలో ప్రభుత్వాధినేత అండదండలు ఉండటంతో చెలరేగిపోతున్నారు. యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని దందాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వీటికోసం ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. వారు సెటిల్మెంట్ల వ్యవహారాలను ఈయన దృష్టికి తీసుకొస్తే ఇరువర్గాలను పిలిపించి, ఒప్పందాలు చేసి భారీ మొత్తంలో వాటాలు దక్కించుకుంటారు. తన ఆదేశాలు ధిక్కరిస్తే బెదిరిస్తారు. మరి కొన్నిసార్లు ఆ ఆస్తులు, భూములను అతి తక్కువ ధరకు ఈ నాయకుడే దక్కించుకుంటారు.
కన్ను పడితే... అప్పగించి తీరాల్సిందే!
- గరివిడిలో విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సుమారు మూడెకరాల స్థలాన్ని కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించి మిగతా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఇస్తామన్నారు. గడువులోగా వారు డబ్బులు చెల్లించకపోవటంతో పంచాయితీ ‘ప్రజాప్రతినిధి’ దగ్గరకు చేరింది. అతను ఆ భూములను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని పరిష్కారం చూపారు. వాటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు.
- నెల్లిమర్ల మండలంలో ఓ రైస్మిల్లు అమ్మకానికి దాని యజమాని ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారు మధ్య వివాదం రావడంతో ఛోటా నేత పంచాయితీ చేశారు. ‘‘రైస్మిల్లు నేను తీసుకుంటా.. మా పేరిటే ఉంటుంది’’ అంటూ వాస్తవ విలువ కంటే చాలా తక్కువ మొత్తం చెల్లించి దాన్ని దక్కించుకున్నాడు. నష్టపోయినవారు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక లబోదిబోమంటున్నారు.
- ఓ పరిశ్రమ యాజమాన్యం నుంచి అత్యంత విలువైన భూములను అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. పారిశ్రామికవాడ కింద ఉన్న ఆ భూములను సాధారణ భూములుగా కన్వర్షన్ చేయించుకుని తన సమీప బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు.
కన్నేసి... కాజేసి
మూతపడిన ఓ పరిశ్రమ భూములు కొనడానికి అయిదుగురు వ్యక్తులు ఒప్పందం చేసుకుని అడ్వాన్సు చెల్లించారు. ఈ లోపల వాటిపై ఈ ప్రజాప్రతినిధి కన్నుపడింది. వాళ్లను ఇంటికి పిలిపించి సగం వాటా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్కు చిక్కులు తప్పవని హెచ్చరించగా.. తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు. మూడు నెలలకు మరోసారి పిలిపించి... ఆ భూముల విషయంలో ఎన్నో చిక్కులున్నాయని... వాటిని పరిష్కరించుకుంటానని, తనకు వదిలేయాలని చెప్పి గుడ్విల్ పేరిట కొంత మొత్తం ముట్టజెప్పి వాటిని సొంతం చేసుకున్నారు. ఆయన్ను ఎదిరించలేక వారు మిన్నకుండిపోయారు.
భూకబ్జాల్లో ఆయన స్టైలే సెపరేటు..
విజయనగరంలోని అత్యంత విలువైన ఓ ప్రైవేటు స్థలంపై కన్నేసిన ‘ప్రజాప్రతినిధి’ తన అనుచరుల ద్వారా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించారు. చట్టపరంగా పోరాడేందుకు ఆ స్థలం యజమాని సిద్ధమవగా అతన్ని పిలిపించి ‘ఎంతో కొంత ఇస్తా, తీసుకుపో’ అని హెచ్చరించారు. దాంతో ఆ భూ యజమాని.. ఓ మంత్రి వద్దకెళ్లి మొర పెట్టుకోగా ఆయన ఆ ‘ప్రజాప్రతినిధి’కి ఫోన్చేసి ఏదో రకంగా అతనికి న్యాయం చేయాలన్నారు. తన సమస్య పరిష్కారమైనట్టేనని భావించి వెళ్లి ఆ నాయకుడి ఎదుట వాలిపోగా... కూర్చోబెట్టి, టీ తాగించి.. ‘‘ఇక మీరు వెళ్లొచ్చు.. ఆ భూమిని మాత్రం వదిలేసుకోవాల్సిందే.’’ అని చెప్పారు. ఉలిక్కిపడిన బాధితుడు ‘‘మంత్రి గారు చెప్పారు కదా’ అని ప్రాధేయపడగా.. ‘‘ఆయన చెప్పారు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడాను. లేకుంటేనా...’’ అని సమాధానమిచ్చారు. ఆయన భూకబ్జాలు ఏ స్టైల్లో చేస్తారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.
పైపులన్నీ ఆ కంపెనీవే..
ఈయనకి ఓ పైపుల పరిశ్రమ ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా పరిధిలో ఇంటింటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు పనుల పైపులన్నీ తమ పరిశ్రమ నుంచే కొనాలని హుకుం జారీచేశారు. దీనికి సహకరించని అధికారిని బదిలీ చేయించి.. తాను చెప్పినదానికి తలాడించే అధికారిని తెచ్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఈ కంపెనీ పైపులే వినియోగిస్తున్నారు.
* జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం, నిర్వహణ తదితర పనులన్నీ తన భాగస్వాములైన ఇద్దరు గుత్తేదారులకే దక్కేలా చేస్తారు. ఇంకెవరికీ అవకాశమే ఉండదు.
సెటిల్మెంట్లు.. దందాలు
- ఎస్.కోట నియోజకవర్గంలో ఇనాం భూముల్లోని ఓ చెరువు వ్యవహారంలో కొందరికి అనుకూలంగా సెటిల్మెంట్ చేసి భారీగా లబ్ధి పొందారు.
- బొబ్బిలిలో మూతపడిన ఓ పరిశ్రమ స్థలం కొనుగోలు వ్యవహారంలో చక్రం తిప్పి సొమ్ము చేసుకున్నారు.
- పార్వతీపురం నియోజకవర్గంలో ఓ కర్మాగారం భూముల వేలంలోనూ తెరవెనక కథ నడిపించారు.
- రామభద్రాపురం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ విషయంలో దాని యజమానులు ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనగా.. దాన్ని సెటిల్ చేసి భారీగా ఆర్థిక లబ్ధి పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ