YSRCP Leader: పేరులో చిన్న.. సెటిల్మెంట్లలో ‘పెద్ద’
‘యథా రాజా తథా ప్రజా’... ఈ మాటల్ని ‘యథా బడా నేత తథా ఛోటా నేత’గా అన్వయించుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్ సీఎం అయ్యాక ఇదివరకెన్నడూ లేనంతగా సెటిల్మెంట్లు, బెదిరింపుల సంస్కృతి జిల్లాలకూ పాకింది. వివాదం అని తెలిస్తే చాలు...
భూములైనా, ఆస్తులైనా ఆయన కన్నుపడితే సొంతం కావాల్సిందే
ఎంతటి పెద్దవారైనా ఆదేశాలకు తలొగ్గాల్సిందే..
విజయనగరం జిల్లాలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి అరాచకం
ఈనాడు, అమరావతి
‘యథా రాజా తథా ప్రజా’... ఈ మాటల్ని ‘యథా బడా నేత తథా ఛోటా నేత’గా అన్వయించుకుంటున్నారు వైకాపా నాయకులు. జగన్ సీఎం అయ్యాక ఇదివరకెన్నడూ లేనంతగా సెటిల్మెంట్లు, బెదిరింపుల సంస్కృతి జిల్లాలకూ పాకింది. వివాదం అని తెలిస్తే చాలు... రెండు పిల్లుల మధ్య రొట్టె తగవు కోతి తీర్చినట్లుగా... మధ్యలో దూరి మొత్తం స్వాహా చేసేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి సెటిల్మెంట్ల దూకుడుకు జనాలు బెంబేలెత్తుతున్నారు. భూములూ, ఆస్తులూ, పరిశ్రమలూ... వేటిమీద కన్ను పడితే అవి ఆయన పేరిట మారిపోవాల్సిందే. బాధితులది మౌన రోదనే!
అక్కడ ఏ లావాదేవీలు జరగాలన్నా ఆయన సెటిల్మెంట్ చేయాల్సిందే. ఎంతటివారైనా ఇచ్చినంత పుచ్చుకుని తప్పుకోవాల్సిందే. కాదూ కూడదంటే కథ మలుపుతిప్పి వారంతట వారే కాళ్లబేరానికి వచ్చేలా చేస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి పేట్రేగిపోతున్న తీరిది. తన సమీప బంధువైన రాష్ట్రస్థాయి నాయకుడి నీడగా రాజకీయంగా ఎదిగిన ఈయన.. ఇప్పుడు జిల్లాలో అరాచకాలు, అక్రమాలు, అవినీతికి వట వృక్షంలా మారారు. ఆయన పేరుకే ‘చిన్న’ మనిషి.. దందాల్లో చాలా ‘పెద్ద’. ఈ నాయకుడికి ఓ కీలక పదవి కట్టబెట్టేందుకు దాని రిజర్వేషన్నే మార్పించేశారు.
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల్లో అన్నీ తానై వ్యవహరిస్తారీయన. అపాయింట్మెంట్ లేకుండానూ సీఎం జగన్ను కలవగలరు. ఈ స్థాయిలో ప్రభుత్వాధినేత అండదండలు ఉండటంతో చెలరేగిపోతున్నారు. యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని దందాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వీటికోసం ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. వారు సెటిల్మెంట్ల వ్యవహారాలను ఈయన దృష్టికి తీసుకొస్తే ఇరువర్గాలను పిలిపించి, ఒప్పందాలు చేసి భారీ మొత్తంలో వాటాలు దక్కించుకుంటారు. తన ఆదేశాలు ధిక్కరిస్తే బెదిరిస్తారు. మరి కొన్నిసార్లు ఆ ఆస్తులు, భూములను అతి తక్కువ ధరకు ఈ నాయకుడే దక్కించుకుంటారు.
కన్ను పడితే... అప్పగించి తీరాల్సిందే!
- గరివిడిలో విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సుమారు మూడెకరాల స్థలాన్ని కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించి మిగతా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఇస్తామన్నారు. గడువులోగా వారు డబ్బులు చెల్లించకపోవటంతో పంచాయితీ ‘ప్రజాప్రతినిధి’ దగ్గరకు చేరింది. అతను ఆ భూములను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని పరిష్కారం చూపారు. వాటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు.
- నెల్లిమర్ల మండలంలో ఓ రైస్మిల్లు అమ్మకానికి దాని యజమాని ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారు మధ్య వివాదం రావడంతో ఛోటా నేత పంచాయితీ చేశారు. ‘‘రైస్మిల్లు నేను తీసుకుంటా.. మా పేరిటే ఉంటుంది’’ అంటూ వాస్తవ విలువ కంటే చాలా తక్కువ మొత్తం చెల్లించి దాన్ని దక్కించుకున్నాడు. నష్టపోయినవారు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక లబోదిబోమంటున్నారు.
- ఓ పరిశ్రమ యాజమాన్యం నుంచి అత్యంత విలువైన భూములను అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. పారిశ్రామికవాడ కింద ఉన్న ఆ భూములను సాధారణ భూములుగా కన్వర్షన్ చేయించుకుని తన సమీప బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు.
కన్నేసి... కాజేసి
మూతపడిన ఓ పరిశ్రమ భూములు కొనడానికి అయిదుగురు వ్యక్తులు ఒప్పందం చేసుకుని అడ్వాన్సు చెల్లించారు. ఈ లోపల వాటిపై ఈ ప్రజాప్రతినిధి కన్నుపడింది. వాళ్లను ఇంటికి పిలిపించి సగం వాటా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్కు చిక్కులు తప్పవని హెచ్చరించగా.. తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు. మూడు నెలలకు మరోసారి పిలిపించి... ఆ భూముల విషయంలో ఎన్నో చిక్కులున్నాయని... వాటిని పరిష్కరించుకుంటానని, తనకు వదిలేయాలని చెప్పి గుడ్విల్ పేరిట కొంత మొత్తం ముట్టజెప్పి వాటిని సొంతం చేసుకున్నారు. ఆయన్ను ఎదిరించలేక వారు మిన్నకుండిపోయారు.
భూకబ్జాల్లో ఆయన స్టైలే సెపరేటు..
విజయనగరంలోని అత్యంత విలువైన ఓ ప్రైవేటు స్థలంపై కన్నేసిన ‘ప్రజాప్రతినిధి’ తన అనుచరుల ద్వారా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించారు. చట్టపరంగా పోరాడేందుకు ఆ స్థలం యజమాని సిద్ధమవగా అతన్ని పిలిపించి ‘ఎంతో కొంత ఇస్తా, తీసుకుపో’ అని హెచ్చరించారు. దాంతో ఆ భూ యజమాని.. ఓ మంత్రి వద్దకెళ్లి మొర పెట్టుకోగా ఆయన ఆ ‘ప్రజాప్రతినిధి’కి ఫోన్చేసి ఏదో రకంగా అతనికి న్యాయం చేయాలన్నారు. తన సమస్య పరిష్కారమైనట్టేనని భావించి వెళ్లి ఆ నాయకుడి ఎదుట వాలిపోగా... కూర్చోబెట్టి, టీ తాగించి.. ‘‘ఇక మీరు వెళ్లొచ్చు.. ఆ భూమిని మాత్రం వదిలేసుకోవాల్సిందే.’’ అని చెప్పారు. ఉలిక్కిపడిన బాధితుడు ‘‘మంత్రి గారు చెప్పారు కదా’ అని ప్రాధేయపడగా.. ‘‘ఆయన చెప్పారు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడాను. లేకుంటేనా...’’ అని సమాధానమిచ్చారు. ఆయన భూకబ్జాలు ఏ స్టైల్లో చేస్తారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.
పైపులన్నీ ఆ కంపెనీవే..
ఈయనకి ఓ పైపుల పరిశ్రమ ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా పరిధిలో ఇంటింటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు పనుల పైపులన్నీ తమ పరిశ్రమ నుంచే కొనాలని హుకుం జారీచేశారు. దీనికి సహకరించని అధికారిని బదిలీ చేయించి.. తాను చెప్పినదానికి తలాడించే అధికారిని తెచ్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఈ కంపెనీ పైపులే వినియోగిస్తున్నారు.
* జిల్లాలో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం, నిర్వహణ తదితర పనులన్నీ తన భాగస్వాములైన ఇద్దరు గుత్తేదారులకే దక్కేలా చేస్తారు. ఇంకెవరికీ అవకాశమే ఉండదు.
సెటిల్మెంట్లు.. దందాలు
- ఎస్.కోట నియోజకవర్గంలో ఇనాం భూముల్లోని ఓ చెరువు వ్యవహారంలో కొందరికి అనుకూలంగా సెటిల్మెంట్ చేసి భారీగా లబ్ధి పొందారు.
- బొబ్బిలిలో మూతపడిన ఓ పరిశ్రమ స్థలం కొనుగోలు వ్యవహారంలో చక్రం తిప్పి సొమ్ము చేసుకున్నారు.
- పార్వతీపురం నియోజకవర్గంలో ఓ కర్మాగారం భూముల వేలంలోనూ తెరవెనక కథ నడిపించారు.
- రామభద్రాపురం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ విషయంలో దాని యజమానులు ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనగా.. దాన్ని సెటిల్ చేసి భారీగా ఆర్థిక లబ్ధి పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి