‘గుండె’ గోడు వినపడదా..?
తాను పుట్టిందే పేదల్ని ఉద్ధరించడానికి అన్నట్లు స్వయంగా గొప్పలు చెప్పుకొంటారు. అవకాశం చిక్కితే చాలు సమయం, సందర్భమూ చూడకుండా పేదలు, పెత్తందారులంటూ రాగాలు తీస్తారు. ఆయన ఒక్కరే పేదల పక్షమన్నట్లు, మిగతా వారంతా పెత్తందారులు అన్నట్లు విరుచుకుపడతారు...
తీవ్ర ఆందోళనలో పేద హృద్రోగులు
ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో తక్కువ కేటాయింపులే కారణం
ఆయుష్మాన్ భారత్తో పోలిస్తే భారీ వ్యత్యాసాలు
ఏకంగా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు తేడా
శస్త్రచికిత్సలకు వెనుకాడుతున్న ప్రైవేటు ఆసుపత్రులు
పేదల పక్షపాతినని చెప్పుకొనే జగన్కు ఇవేవీ కనిపించవేం?
ఈనాడు, అమరావతి
తాను పుట్టిందే పేదల్ని ఉద్ధరించడానికి అన్నట్లు స్వయంగా గొప్పలు చెప్పుకొంటారు. అవకాశం చిక్కితే చాలు సమయం, సందర్భమూ చూడకుండా పేదలు, పెత్తందారులంటూ రాగాలు తీస్తారు. ఆయన ఒక్కరే పేదల పక్షమన్నట్లు, మిగతా వారంతా పెత్తందారులు అన్నట్లు విరుచుకుపడతారు... ముఖ్యమంత్రి జగన్.
అయితే,
రాష్ట్రంలోని పేదల ‘గుండె’లు అల్లాడుతున్నా పట్టనట్లే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీలో చేస్తున్న హృద్రోగ శస్త్రచికిత్సలకు సరిపడా కేటాయింపులు చేయడంలేదు. ఇదేమని అడిగితే... తమకు ఎవ్వరితోనూ పోలిక లేదంటారు. ఇదేనా పేదలపై మీ పక్షపాతం సీఎంగారూ..! కనీసం పేదల చికిత్సకు సరిపడా నిధులిచ్చేందుకైనా పెద్ద మనసు చేసుకోలేరా? నిరుపేదల వైద్యానికి డబ్బులిస్తే మీ సొంత ఆస్తులేమైనా కరిగిపోతాయా?
కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్ట్ (సీఏబీజీ)... సామాన్య పరిభాషలో చెప్పాలంటే గుండెకు చేసే బైపాస్ ఆపరేషన్. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,18,881 ఇస్తోంది. ఇదే శస్త్రచికిత్సకు ఆయుష్మాన్ భారత్లో కేంద్రం రూ.1,84,500 ఇస్తోంది. ఇది రాష్ట్రం ఇస్తున్నదానికంటే 55.20% అంటే... రూ.65,619 ఎక్కువ. ఒక్క బైపాస్ సర్జరీనే కాదు... పెద్దలు, పిల్లల్లో హృద్రోగ సమస్యల్ని సరిదిద్దేందుకు చేసే సుమారు వందకుపైగా శస్త్రచికిత్సల్లో.... ప్రతి ఆపరేషన్కు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం తక్కువ నిధులివ్వడం పేదలపాలిట శాపంగా మారింది. పెద్దలు, పిల్లల్లో ఎక్కువగా నిర్వహించే 43 రకాల గుండె ఆపరేషన్లకు సంబంధించి కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం 10% నుంచి 290% వరకు... అంటే రూ.50 వేల నుంచి సుమారు రూ.2 లక్షల వరకు తక్కువగా ఇస్తోంది.
గుండె శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలడం లేదని చాలా ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. గుండె శస్త్రచికిత్సల్లో పెద్దవారితో పోలిస్తే పిల్లలకు ఎక్కువ ఖర్చు అవుతుండడంతో... వారికి ఆపరేషన్లు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతానికి ఆయా ఆస్పత్రులు తప్పని పరిస్థితుల్లో గుండె ఆపరేషన్లు చేస్తున్నా... ఖర్చు తగ్గించుకోవడానికి వాడిన పరికరాల్నే పదేపదే వాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇది కొన్ని సందర్భాల్లో రోగులకు ప్రాణసంకటంగా మారడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకూ దారితీస్తోంది. దాదాపు అన్ని వ్యాధులనూ ఆరోగ్యశ్రీలో చేర్చేశామని ఊదరగొడుతున్న జగన్ ప్రభుత్వం దీనికేం సమాధానం చెబుతుంది?.
ఆపరేషన్లపై ప్రభావం
పెద్దలు, పిల్లలు, శిశువుల్లో హృద్రోగ సమస్యలకు చేసే శస్త్ర చికిత్సల్లో 95% వరకు... బైపాస్, కవాటం మార్పిడి, పిల్లల గుండెలో రంధ్రం పూడ్చే ఆపరేషన్లే ఉంటాయి. మిగతా శస్త్రచికిత్సలు మరో 100 రకాల వరకు ఉన్నా... వాటిని చాలా అరుదుగా చేయాల్సి వస్తుంది. పెద్దల్లో ఎక్కువగా కరోనరీ ఆర్టెరీ బైపాస్ గ్రాఫ్ట్ (బైపాస్ సర్జరీ)తో పాటు కవాటం మార్పిడి, కవాటం మరమ్మతు ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. గుండె సమస్యలకు పరీక్షలు, చికిత్సలకయ్యే ఖర్చూ అధికమే. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి వర్గాల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టి, ఉదారంగా నిధులివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది.
పెద్దల్లో కవాటం మార్పిడి, మరమ్మతు శస్త్రచికిత్సలకు... కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ కంటే రాష్ట్రం ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్న ప్యాకేజీ రూ.1.08 లక్షల నుంచి రూ.1.11 లక్షల వరకు తక్కువ ఉంది. ఇంతతక్కువ మొత్తంలో శస్త్రచికిత్సలు చేయడం తమకు గిట్టుబాటు కాదని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి. ఆ విషయం రోగులకు నేరుగా చెబితే తమపై ఒత్తిడి తెస్తారన్న ఉద్దేశంతో... తమ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని, అలాంటి శస్త్రచికిత్సలు తామెప్పుడూ చేయలేదని, ఇక్కడి కంటే హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి చేయించుకోవడం మంచిదని... రకరకాల సాకులు చెబుతున్నాయి.
వాడిన పరికరాల్నే మళ్లీ వాడుతూ..!
ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అసలు ఆపరేషన్లే జరగడం లేదా? అంటే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతోనే సర్దుకుపోయి... వాటిలోనే వైద్య పరికరాలకు, వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి, ఆపరేషన్ అనంతర పర్యవేక్షణకు అయ్యే ఖర్చు పోగా... కొంత లాభం కూడా వేసుకుని కొన్ని ఆస్పత్రులు ఆపరేషన్లు చేస్తున్నాయి. ఖర్చు తగ్గించేందుకు చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సల పరికరాలను ఎక్కువ మందికి వినియోగిస్తున్నాయి. ఉదాహరణకు... యాంజియోగ్రామ్ నిర్వహించేందుకు వాడే వైర్ని ఆరోగ్యశ్రీలో ముగ్గురు నలుగురికి వాడతున్నట్లు సమాచారం. పదేపదే వాడితే బలహీనపడే ఆ వైర్ కొన్ని సందర్భాల్లో రోగి రక్తనాళాల్లోకి వెళ్లాక విరిగిపోయి... అక్కడే ఉండిపోయే ప్రమాదముంది. అలాంటి సమయాల్లో పరీక్ష చేస్తుండగానే రోగి ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించిందని చెప్పి... అప్పటికప్పుడు బైపాస్ సర్జరీలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని కొందరు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు శస్త్రచికిత్సల విషయంలోనూ వాడిన పరికరాల్నే మళ్లీమళ్లీ వాడటంతో సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు.
చిన్న గుండెకు పెద్ద కష్టం
రాష్ట్రంలో ఏటా గుండె సంబంధిత సమస్యలతో జన్మించే శిశువుల సంఖ్య 6,000 వరకు ఉంటుందని అంచనా. వారిలో 10 శాతానికి మందులతోనే సమస్యను తగ్గించవచ్చు. మరో 10 శాతానికి పరికరాల్ని అమర్చి చికిత్స చేయొచ్చు. మిగతా 80% పిల్లలకు ఆపరేషన్లు చేయాల్సిందే. ఇలాంటి పిల్లల్లో అత్యధికులు పేదవర్గాల వారేనని వైద్యులు చెబుతున్నారు. ‘‘శిశువు తల్లి గర్భంలో ఉండగానే 16-20 వారాల వయసులో స్కానింగ్ చేస్తే సమస్య ఉంటే తెలుస్తుంది. ఆర్థిక స్తోమత ఉన్నవారు వెంటనే తగిన నివారణ చర్యలు చేపడతారు. సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉందని, శిశువు జన్మించినా ఆరోగ్యంగా జీవనం సాగించలేదని వైద్యులు నిర్ధారిస్తే... గర్భవిచ్ఛిత్తికి మొగ్గు చూపుతారు. పేదలు మాత్రం అలాంటివేమీ చేయలేరు. పిల్లలు పుట్టాక ఆస్పత్రులకు వెళ్లి విషయం తెలుసుకొని.. నిస్సహాయ స్థితిలో ఇంటికి తీసుకెళ్లిపోతారు.
కొన్నాళ్లకు ఆ పిల్లలు చనిపోతున్నారు’’ అని నిపుణుడొకరు తెలిపారు. ‘‘పిల్లల గుండెల్లో రంధ్రం పూడ్చడానికి... ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా రూ.లక్ష వరకు అవుతుంది. కానీ ప్రభుత్వం రూ.87 వేలు మాత్రమే ఇస్తోంది. ఆపరేషన్ థియేటర్లో వాడే పరికరాలకే రూ.60-70 వేల వరకు ఖర్చవుతుంది. అందుకే పిల్లల ఆపరేషన్లు చేయడానికి ఆస్పత్రులు ముందుకు రావడం లేదు’’ అని తెలిపారు. 28 రోజుల్లోపు వయసు (నియోనాటల్) శిశువు నుంచి... అన్ని వయసుల పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద గుండె శస్త్రచికిత్సలు చేస్తున్న ఆస్పత్రులు ప్రస్తుతం తిరుపతిలో ఒకటి, ప్రైవేటు రంగంలో విజయవాడలో మరొకటి ఉన్నాయి. అక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలకపోయినా... దాతల సహకారంతో పిల్లలకు ఆపరేషన్లు చేయగలుగుతున్నారు.
అన్నింటిలోనూ పోలిక ఉండాలిగా..
ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్న ఆస్పత్రులు... చాలా చికిత్సలకు ప్రభుత్వమిచ్చే ఛార్జీలు తమకు గిట్టుబాటు కావడం లేదని, పెంచాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఒక సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు దానిపై స్పందిస్తూ... ‘ఆయుష్మాన్ భారత్’లో ఇస్తున్నదానికంటే ఎక్కువ ఇవ్వడం కుదరదని స్పష్టంచేశారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీల ప్యాకేజీలు దాదాపు సమానంగా, కొద్దిపాటి వ్యత్యాసం మాత్రమే ఉన్న ఛార్జ్లీలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ మాటలన్నారు. గుండె శస్త్రచికిత్సలకు కూడా ఆయుష్మాన్ భారత్తో సమానంగా ప్యాకేజీ ఇవ్వాలి కదా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచకుంటే, భవిష్యత్తులో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద గుండె శస్త్రచికిత్సలు చేయబోమని మొండికేస్తే... అప్పుడు పేద రోగుల పరిస్థితేంటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల