Cyclone Michaung: ముంచేసింది
కోతకొచ్చిన లక్షల ఎకరాల వరిని నేలమట్టం చేస్తూ.. ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని నీటముంచుతూ.. మిగ్జాం తీవ్ర తుపాను తీరం దాటింది.
వరికి ఉరేసిన తుపాను
చీరాల సమీపంలో తీరం దాటిన మిగ్జాం
అన్నదాత ఆశల్ని ఊడ్చేసిన విపత్తు
లక్షల ఎకరాల్లో నేలవాలిన వరి.. తడిసిన ధాన్యం
ఉద్యాన పంటలకూ దెబ్బ
నష్టం రూ.7వేల కోట్లపైనే!
వేర్వేరు ఘటనల్లో ఆరుగురి మృత్యువాత
ఈనాడు - అమరావతి, బృందం
కోతకొచ్చిన లక్షల ఎకరాల వరిని నేలమట్టం చేస్తూ.. ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని నీటముంచుతూ.. మిగ్జాం తీవ్ర తుపాను(Cyclone Michaung) తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల మధ్య బాపట్లకు దక్షిణంగా చీరాల సమీపంలో ఒడ్డుకు చేరి బలహీనపడింది. ధాన్యం సొమ్ము.. ఇక చేతికొచ్చేసినట్లే అనుకుంటున్న వరి రైతుల ఆశల్ని తుపాను తుడిచిపెట్టేసింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉద్యాన పంటలకూ తీరని నష్టాన్ని మిగిల్చింది. తీవ్ర తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టమే రూ.7 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అతి భారీవర్షాలు, గంటకు 100 కి.మీ వేగంతో వీచిన గాలుల తీవ్రతకు వందల గ్రామాలు వణికిపోయాయి.
👉 Follow EENADU WhatsApp Channel
8 జిల్లాల్లోని 60 మండలాల్లో తీవ్ర తుపాను ప్రభావం చూపింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి కడప జిల్లాలో వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నేలకరిచాయి. తీవ్ర తుపాను కారణంగా.. మంగళవారం ఏలూరు, అనకాపల్లి, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, పల్నాడు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, విశాఖపట్నం, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా ఏలూరు జిల్లా తాడువాయిలో 222, అనకాపల్లి జిల్లా పరవాడలో 178, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో 171, బాపట్ల జిల్లా గురిజేపల్లిలో 150 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తిరుపతి జిల్లా చిట్టేడులో 670 మి.మీ
నవంబరు 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ.. సోమవారానికి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి ప్రయాణిస్తూ.. మంగళవారం తీరం దాటింది. తీవ్ర తుపాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఈ నెల 2 నుంచి 5వ తేదీ సాయంత్రం 7 గంటల మధ్య.. అత్యధికంగా తిరుపతి జిల్లా చిట్టేడులో 670 మి.మీ, చింతవరంలో 647.25, నాయుడుపేటలో 627, నెల్లూరు జిల్లా కత్తువపల్లిలో 621.5, తిరుపతి జిల్లా అల్లంపాడు 610, తిరుపతిలో 554 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇందులో సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్య.. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా చింతవరంలో 421.5, చిట్టేడులో 393, కత్తువపల్లిలో 372 మి.మీ వర్షం కురవడం గమనార్హం. అన్నమయ్య, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల కుండపోత వానలు కురిశాయి.
అన్నదాతకు తీరని వేదన
తీవ్ర తుపాను ప్రభావంతో.. రాష్ట్రంలో కోత దశకు వచ్చిన వరిలో 90% నేలవాలింది. వెంటనే నీరు బయటకు పోయినా.. పంట నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోత ఖర్చులు పెరగడంతోపాటు ధాన్యం రంగు మారి ధర పడిపోతుందని వాపోతున్నారు. టార్పాలిన్లు కప్పి ఆరబెట్టిన ధాన్యం కిందకు నీరు చేరడంతో.. రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల తేమ కారణంగా ధాన్యం దెబ్బతింటోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అధిక శాతం పంట కోత దశలో, కుప్పలపైనే ఉంది. కోత కోసిన చోట పనలు నీటిలో తేలియాడాయి. శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, ప్రకాశం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ వరి నేల వాలింది. ఆరబెట్టిన మిరప కూడా అక్కడక్కడా తడిచింది. అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో తోటల్లోని అరటి, బొప్పాయి చెట్లు విరిగిపడ్డాయి.
పునరావాసం, ఆహారమూ కరవు
భారీ వర్షాలకు నెల్లూరు నగరం నీట మునిగింది. తల్పగిరికాలనీ, ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, రెవెన్యూ కాలనీల్లో నడుములోతు నీరు నిలిచింది. గాంధీ గిరిజన సంఘంలో దాదాపు 60 ఇళ్లు నీట మునిగినా బాధితులకు పునరావాసం, సరిగా ఆహారం ఏర్పాటు చేయలేదు. ఇంటికో భోజనం పొట్లం ఇస్తే ఎలా సరిపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలో కనుపూరు కాలువకు గండి పడింది. కావలిలో మర్రిచెట్టు కాలనీ నీట మునిగింది. నెల్లూరు మైపాడు బీచ్లో రోడ్లపై చెట్లు నెలకొరిగాయి. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలోకి నీరు రావడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. కైవల్య నది ఉద్ధృతంగా ప్రవహించడంతో చింతచెట్ల ప్రాంతం మొత్తం నీట మునిగింది. బాధితులను పునరావాస కేంద్రానికి తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారు.
తెగిన రహదారులు.. విరిగిపడిన స్తంభాలు
తిరుపతి జిల్లా కాళంగి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో సూళ్లూరుపేట జాతీయ రహదారిపైకి నాలుగు అడుగుల మేరకు నీరు చేరడంతో నెల్లూరు- చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సూళ్లూరుపేట పట్టణంలోని రైల్వే గేటు పడమర వైపు ఉన్న సాయినగర్, మహదేవయ్యనగర్ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. స్వర్ణముఖి నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. గూడూరు- రాజంపేట ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు- వెంకటగిరి, గూడూరు- విందూరు మార్గంలోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
- బాపట్ల సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటుతుందనే సమాచారంతో.. ఆదివారం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు భయంభయంగా గడిపారు. భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నల్లమడ, కుప్పగంజి, నక్కవాగు, పేరలి, తూర్పు తుంగభద్ర, భట్టిప్రోలు, రేపల్లె మెయిన్ డ్రెయిన్, తెనాలి డ్రెయిన్, గుంటూరు నల్లకాలువ, ఈస్ట్ స్వాంప్, వెస్ట్ స్వాంప్, మురుకుండపాడు ఉత్తర, పర్చూరు వాగు, రొంపేరు, వేటపాలెం, ఈపూరుపాలెం మురుగుకాలువలు ఉద్ధృతంగా ప్రవహించాయి. బాపట్ల- గుంటూరు, రేపల్లె- నిజాంపట్నం, 216ఏ జాతీయ రహదారి, చీరాల- దేశాయిపేట, చీరాల- పర్చూరు మార్గంలో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
- కడప, బద్వేలు ఆర్టీసీ గ్యారేజీల్లోకి వరదనీరు చేరింది.
- ఏలూరు జిల్లా మండవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జాతీయ రహదారి 165, ముదినేపల్లిలో జాతీయ రహదారి 216పై నీరు చేరింది. కైకలూరులో ప్రధాన రహదారులన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి భారీగా వర్షం నీరు చేరింది. వెంకటగిరి -పాలెంకోట మార్గంలో మినీ వంతెన గొడ్డేరు వాగు ధాటికి కొట్టుకుపోయింది.
ఆరుగురి మృతి
వైయస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద చెట్టు విరిగి ద్విచక్రవాహనంపై వెళుతున్న ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ సత్యకుమార్పై పడటంతో ఆయన మరణించారు. చీరాలలో ఒక వ్యక్తి మురుగుకాలువలో పడి మృతి చెందారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు పంచాయతీలో రంగంపేట ఎస్టీ కాలనీ, టీఆర్ కండ్రిగ ఆదిఆంధ్రవాడలో ఈదురుగాలులకు తాళలేక ఇద్దరు వృద్ధులు చనిపోయారు.
భారీ వర్షం, ఈదురు గాలులకు పొలంలోని పాకలు కూలి ఇద్దరు గిరిజన రైతులు దుర్మరణం పాలైన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కొత్తరాజానగరంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెట్టి గంగరాజు (60), జోడే రామయ్య (62) తమ పొలాలకు వెళ్లారు. వర్షం తగ్గకపోవడంతో రాత్రి పొద్దుపోయే వరకు అక్కడ ఉన్న వేర్వేరు పాకల్లో ఉండిపోయారు. రామయ్య చలికి తట్టుకోలేక తన పాకలో చలిమంట వేసుకున్నారు. ఒక్కసారిగా ఈదురు గాలి వచ్చి రెండు పాకలు కూలిపోయాయి. పాక స్తంభం తలపై పడి గంగరాజు చనిపోయారు. పాక కూలడంతో చలి కాగుతున్న మంటలు అంటుకొని రామయ్య సజీవ దహనమయ్యారు. గంగరాజుతో పాటు పాకలో ఉన్న మరో ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
జల్లెడలా రహదారి!
కృష్ణా జిల్లాలో తుపాను కారణంగా మరింత అధ్వానంగా మారిన అవనిగడ్డ - కోడూరు మార్గం. వర్షాలకు గుంతల్లో చేరిన నీటితో ఏ గొయ్యి ఎంత లోతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. గతేడాది సీఎం జగన్ రోడ్డు నిర్మాణానికి రూ.35 కోట్లు ఇస్తామన్నారు. నేటికీ ఇవ్వకపోవడంతో ప్రజలు పడుతూలేస్తూ పయనిస్తున్నారు.
పిల్లలను పట్టించుకోరు
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని నీట మునిగిన బాలుర వసతి గృహం. భవనమూ కురుస్తుండటంతో పిల్లలంతా తలదాచుకునేందుకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ కనిపించారు.
జలదిగ్బంధంలో జిల్లా ఆసుపత్రి
ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఫిజియోథెరపీ వార్డు, స్కానింగ్ సెంటర్లు, ఆర్ఎంవో కార్యాలయం, ఓపీ కౌంటర్లు, ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్, ఎముకల వ్యాధి ఓపీ తదితర విభాగాల్లోకి నీరు చేరడంతో మోటార్లతో తోడారు. రోగులు నిల్చోవడానికి వీల్లేకపోయింది.
నిరాశ్రయులను వదిలేశారు
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి రహదారి పక్కన వర్షంలోనే అవస్థ పడుతున్న ఈ నిరాశ్రయురాలి పేరు దుర్గ. గతంలో కుడి చేయి కోల్పోయిన వృద్ధురాలు కాళ్లూ కదపలేని స్థితిలో ఉంది. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన గొడుగు తప్ప మరే రక్షణ లేక నడిరోడ్డుపై బిక్కుబిక్కుమంటూ కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
వందనమమ్మా.. డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!