అన్నదాతను దెబ్బతీసిన మిగ్జాం
ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద.. వాననీటిలో తేలుతున్న వరి ఓదెలు.. కోతకు వచ్చిన పనలు నేలవాలి నీటమునగడంతో గల్లంతైన ఆశలు.. కుప్పలు పోసినా చెమ్మ చేరి దెబ్బతింటున్న ధాన్యం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే చేజారిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు.. కోస్తా జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు.
నేలవాలిన వరి.. రైతు ఆశలు ఆవిరి
లక్షల ఎకరాల్లో పంట వర్షార్పణం
మినుము, పత్తి, మిర్చి, అరటి తదితర పంటలకూ నష్టం
కన్నీటిపర్యంతమవుతున్న కర్షకులు
ఈనాడు- అమరావతి, కాకినాడు, అనకాపల్లి, నెల్లూరు, ఒంగోలు, కడప, న్యూస్టుడే-బాపట్ల: ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద.. వాననీటిలో తేలుతున్న వరి ఓదెలు.. కోతకు వచ్చిన పనలు నేలవాలి నీటమునగడంతో గల్లంతైన ఆశలు.. కుప్పలు పోసినా చెమ్మ చేరి దెబ్బతింటున్న ధాన్యం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే చేజారిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు.. కోస్తా జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. గుంటూరు జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో వరి పంటకు తుపానుతో కోలుకోలేని దెబ్బ తగిలింది.
👉 Follow EENADU WhatsApp Channel
బాపట్ల జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట మొత్తం వర్షార్పణమైంది. 3,125 ఎకరాల్లో కోసి కుప్పలు వేసి ధాన్యంలోకి నీరు చేరి దెబ్బతింది. మరో వారం రోజుల్లో పంట కోతకు వచ్చి రూ.కోట్ల విలువైన దిగుబడులు చేతికందే తరుణంలో మిగ్జాం తుపాను పంటతో పాటు రైతు ఆశల్నీ ఊడ్చేసింది. బాపట్ల జిల్లాలో వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో కోత కోసి పొలాల్లో వేసిన ఓదెలు వాన నీటిలో తేలియాడుతున్నాయి. వర్షం నుంచి రక్షించుకునేందుకు పట్టలు కప్పినా పైన నీరు నిలిచి ధాన్యం తడిసిపోతోంది. ధాన్యం నిల్వకు గోదాముల్లేక రైతులు కష్టాలు పడుతున్నారు.
కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి పంట వర్షానికి దెబ్బతింది. ఎకరాకు సగటున 35 బస్తాల చొప్పున దిగుబడి వస్తోంది. 76 కిలోల బస్తా ధాన్యం రూ.1,650కు కొంటున్నారు. ఈ లెక్కన ఎకరాకు రూ.57,750 రైతులు కోల్పోయారు. పంట పూర్తిగా కోల్పోతే రెండు జిల్లాల పరిధిలో రైతులకు రూ.1732 కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నూర్పిడి చేయాల్సిన మినుము 3 వేల ఎకరాల్లో దెబ్బతింది. లేత దశలో ఉన్న శనగ పంట 10 వేల ఎకరాల్లో నీట మునిగి కుళ్లిపోతోంది. మిర్చి పంట 30,295 ఎకరాల్లో దెబ్బతింది. బాపట్ల జిల్లాలో మిర్చి 8820, శనగ 8000, పొగాకు 5000, అపరాలు 2000, అరటి 1415, వేరుసెనగ 1820 హెక్టార్లలో దెబ్బతిన్నాయి.
అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అరటి, బొప్పాయి తోటలన్నీ నేలవాలాయి. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు, కమలాపురం మండలాల్లో వరి పంట నేల వాలడంతో గింజలు మొలకెత్తాయి. అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాలో వరి 30 వేల ఎకరాలు, అరటి 12 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో మంగళవారం 14 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో గెడ్డలు, వాగులు పొంగి పొర్లాయి. వరి పంటంతా నేలమట్టమైంది. కోసిన పనలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. జిల్లా మొత్తంగా 4 వేల ఎకరాల్లో వరి పైరు నేలకొరిగి నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇది మరింత ఎక్కువగానే ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
కృష్ణాలో లక్షన్నర ఎకరాల్లో దెబ్బతిన్న వరి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 55 వేల టన్నుల ధాన్యం రాశులు తడిసిపోయాయి. కొన్ని మొలకలొస్తున్నాయి. లక్షన్నర ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలి నీటమునిగాయి. దాదాపు 20 వేల ఎకరాల్లో పత్తి పంట వాననీటికి నల్లబడింది. దిగుబడి భారీగా తగ్గుతుందని రైతులు వాపోతున్నారు.
ప్రకాశంలో పొగాకు, శనగకు దెబ్బ
భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో పొగాకు, మిర్చి, వరి, శనగ పంటలు నీట మునిగాయి. అరటి తోటలు నేలకొరిగాయి. పొగాకు, పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. కోతలకు వచ్చిన వరి, మిర్చి తోటలు నేలకొరిగాయి. రూ.80 కోట్ల వరకు నష్టం ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం 26,430 ఎకరాల్లో పంట దెబ్బతింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి