Revanth Reddy: ఆరు గ్యారంటీలతో ఆరంభం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆ దస్త్రంపైనే రేవంత్ తొలి సంతకం
నేటి మధ్యాహ్నం 1.04కు సీఎంగా ప్రమాణ స్వీకారం
సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకలను కలిసిన రేవంత్రెడ్డి
ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానం
మంత్రివర్గ కూర్పుపై అగ్రనేతలతో చర్చ
‘ఇండియా’ నేతలకూ రమ్మని పిలుపు
ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా
కేసీఆర్, జగన్, స్టాలిన్, చంద్రబాబులకూ ఆహ్వానం
ఈనాడు - హైదరాబాద్, దిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తొలుత ఉదయం 10.28 గంటలకు నిర్వహించాలని భావించినా.. తర్వాత ముహూర్త సమయాన్ని మార్చారు. పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల’ చట్టానికి సంబంధించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొద్ది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహకంగా.. సీఎల్పీ సమావేశంలో రేవంత్రెడ్డిని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కాంగ్రెస్ నాయకులు అందజేయగా.. గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రొటోకాల్ ప్రకారం.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే సహా పలువురు ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయపక్షాల నాయకులకు ఆహ్వానాలు పంపారు. వీరిలో మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఏపీ, తమిళనాడు సీఎంలు జగన్, స్టాలిన్ తదితరులున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా కొందరు వామపక్ష నాయకులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నట్లు సమాచారం.
దిల్లీలో రేవంత్ బిజీబిజీ
మరోవైపు రేవంత్ రెడ్డి బుధవారం రోజంతా దిల్లీలో తీరిక లేకుండా గడిపారు. కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ తదితరులను రేవంత్ కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానించారు. ‘ఇండియా’ కూటమిలోని వారితోపాటు పలు పార్టీల నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా రేవంత్ ఆహ్వానించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు సభలో గడిపారు. అనంతరం వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులను కలుసుకున్నారు. వారంతా ఆయనకు అభినందనలు తెలిపారు.
మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి... తొలిరోజు ఎంతమందితో ప్రమాణ స్వీకారం చేయించాలనే అంశంపై ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో రేవంత్రెడ్డి చర్చించారు. మంత్రులుగా మొత్తం ఎంతమందిని తీసుకోవాలనే అంశం ఇంకా నిర్ణయించలేదని కేసీ వేణుగోపాల్ విలేకరులకు తెలిపారు.
మంగళవారం రాత్రి దిల్లీకి వచ్చిన రేవంత్రెడ్డి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరికలేని సమావేశాలతో గడిపారు. తొలుత ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను వారి నివాసాల్లో కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం 10 జన్పథ్కు చేరుకొని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ ఆశీస్సులు తీసుకున్నారు. తనకు పార్టీలో సముచిత అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అక్కడే ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షునిగా అవకాశమివ్వడం, ఎన్నికల ప్రచారంలో విస్తృత ప్రచారం చేసి పార్టీని విజయపథంలో నడిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్గ కూర్పుతో పాటు గ్యారంటీల అమలు గురించి రాహుల్ గాంధీ రేవంత్రెడ్డికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది.
వివిధ పార్టీల నేతలతో భేటీ
అనంతరం రేవంత్రెడ్డి నేరుగా హరియాణాకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దీపేంద్ర సింగ్ హుడా నివాసానికి వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. భేటీ అనంతరం వారిద్దరూ పార్లమెంటుకు వెళ్లారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రాజ్యసభ హౌస్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేష్ ఛాంబర్కు వెళ్లి ఆయనతో పాటు, తనను అభినందించడానికి వచ్చిన తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి సెన్నిమలై, కేరళ ఎంపీ హిబి ఈడెన్, తెదేపా ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, వైకాపా ఎంపీలు రఘురామకృష్ణరాజు, ఎస్.నిరంజన్రెడ్డి, కోటగిరి శ్రీధర్లతో కాసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. తర్వాత లోక్సభకు వెళ్లి సభాపతి ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి పదవికి ఎంపికైనందుకు ఆయనకు ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ కొద్దిసేపు లోక్సభలో కూర్చుని బయటకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మనీశ్ తివారీ, రమ్యా హరిదాసు, కొడిక్కొన్నల్ సురేష్, భారాస ఎంపీ పి.రాములు, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం రేవంత్ తన నివాసానికి వెళ్లారు. సాయంత్రం 3.45 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు. కానీ విమానాశ్రయం చేరుకునేలోగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే నుంచి పిలుపు రావడంతో రేవంత్ మళ్లీ వెనక్కు వచ్చారు. మహారాష్ట్ర సదన్లో ఉన్న ఠాక్రేను కలిశారు. సుమారు గంటపాటు వారిద్దరి మధ్య భేటీ కొనసాగింది. మంత్రివర్గ కూర్పు, ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు తదితర అంశాలపై చర్చించారు. తర్వాత ఇద్దరూ హైదరాబాద్కు పయనమయ్యారు. ఉదయం నుంచి రేవంత్ రెడ్డి వెంట కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ ఉన్నారు.
ప్రముఖులకు పేరుపేరునా ఆహ్వానం
తెలంగాణ ఏర్పాటు సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న సుశీల్కుమార్ శిందే, ఆనాడు సభాపతిగా ఉన్న మీరా కుమార్తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, కమల్నాథ్, భూపేశ్ బఘేల్, ‘ఇండియా’లోని ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నీతీశ్ కుమార్, హేమంత్ సోరెన్, స్టాలిన్, పినరయి విజయన్ తదితరులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు తెలిసింది.
డీకేను కలిసిన శ్రీధర్బాబు
మంత్రి పదవులు ఆశిస్తున్న శ్రీధర్బాబు, ప్రేమ్సాగర్రావు, మల్రెడ్డి రంగారెడ్డిలు బుధవారం దిల్లీలో డీకే శివకుమార్ను కలిశారు. తమకు మంత్రులుగా అవకాశమివ్వాలని కోరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కలిసి మంత్రివర్గంలో చోటివ్వాలని విజ్ఞప్తి చేశారు.
రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా సర్కార్: రాహుల్
రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ తెలంగాణలో ప్రజా సర్కార్ ఏర్పాటు చేస్తుందని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్కు ఆయన బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే