నాడు ఆదర్శం... నేడు నిర్వీర్యం
రాళ్లూరప్పలూ.. కొండలూగుట్టలూ.. నడిచేందుకూ వీలులేని దారుల్లో... డోలీ మోతల్లో గిరిశిఖర గ్రామాల మహిళలు పడే ప్రసవ వేదన మాటల్లో చెప్పలేనిది. చిమ్మచీకటి, జోరు వర్షం నడుమ సకాలంలో వైద్యం అందక, పురిటినొప్పులు భరించలేక ఊపిరి వదిలిన తల్లులెందరో. అమ్మఒడిని చేరకుండానే రాలిపోయిన పసిబిడ్డలు ఇంకెందరో.
గిరిజన గర్భిణుల వసతి గృహాలపై జగన్ సర్కారు నిర్లక్ష్యం
సిబ్బందికీ జీతాల్లేవు
ఈనాడు - అమరావతి
అది పేదలకు మంచి చేసేదైనా.. ఆడబిడ్డల మేలు కోరేదైనా..
అట్టడుగు వర్గాలను బాగు చేసేదైనా.. ఆఖరికి అభాగ్య గిరిజనులకు ఊపిరిపోసేదైనా సరే!
తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిందైతే చాలు.. దాని అంతు చూడాల్సిందే!
నిర్లక్ష్యం ప్రదర్శించి క్రమంగా నిర్వీర్యం చేయాల్సిందే!
ఇదీ, పేదల పక్షపాతినని బాకా మోగించే జగన్ పెత్తందారు పోకడ!
ఈ ధోరణితోనే ఆదివాసీ గర్భిణుల ప్రత్యేక వసతి గృహాలను బలిపీఠం ఎక్కించారు.
రాళ్లూరప్పలూ.. కొండలూగుట్టలూ.. నడిచేందుకూ వీలులేని దారుల్లో... డోలీ మోతల్లో గిరిశిఖర గ్రామాల మహిళలు పడే ప్రసవ వేదన మాటల్లో చెప్పలేనిది. చిమ్మచీకటి, జోరు వర్షం నడుమ సకాలంలో వైద్యం అందక, పురిటినొప్పులు భరించలేక ఊపిరి వదిలిన తల్లులెందరో. అమ్మఒడిని చేరకుండానే రాలిపోయిన పసిబిడ్డలు ఇంకెందరో. ఇలాంటి దుస్థితిని తలచుకుంటేనే మనసు చివుక్కుమంటుంది. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పరిస్థితి నుంచి ఆదిమ తెగల వారిని బయటపడేసేందుకు ప్రయత్నించాల్సిందే. కానీ ముఖ్యమంత్రి జగన్కు.. ఆదివాసీ గర్భిణులు పడుతున్న ప్రసవ వేదన ఏమాత్రం కనిపించనట్టుంది. వారిని అడ్డుపెట్టుకుని ఎంతసేపూ ఎన్నికల్లో ఓట్లు ఎలా సంపాదించాలనే ధ్యాసే తప్ప వారి పట్ల కనీస మానవత్వమే లేకుండా వ్యవహరిస్తున్నారు. గిరిజనులకు కొండంత భరోసాగా నిలిచిన గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాలపై ఆయన కక్షకట్టారు. ఎంతగా అంటే.. మరమ్మతులకు గురై అంబులెన్స్లు మూలకు చేరితే వాడుకలోనికి తీసుకురాలేనంత? మరుగుదొడ్లు కూడా బాగు చేయించలేనంత? దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ ప్రాజెక్టుని నిర్వీర్యం చేయడంలో ఉన్న ఏకైక కారణం ఇవి తెదేపా ప్రభుత్వంలో ఏర్పాటు కావడమే!
నాడలా.. నేడిలా...
గిరిశిఖర గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ఆలోచన చేసిన తెదేపా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరులో గర్భిణులకు ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. ఏడు నెలలు నిండిన వెంటనే గిరిశిఖర గ్రామాల నుంచి గర్భిణులను ఇక్కడికి తీసుకొచ్చి వారిని పర్యవేక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సాయంగా ఓ వ్యక్తి కూడా ఉండేందుకు అనుమతి ఉండేది. 24 గంటలూ ఇద్దరు ఏఎన్ఎమ్లు ఉండేవారు. ప్రత్యేక వైద్యుణ్నీ నియమించింది. అంబులెన్స్ అందుబాటులో ఉండేది. గర్భిణులకు పోషకాహారం అందిస్తూ రక్తహీనత సమస్య ఉంటే ప్రత్యేక జాగ్త్రతలు తీసుకునేవారు. సూపర్వైజర్, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు క్రమం తప్పకుండా గిరిశిఖర గ్రామాలకు వెళ్లి ఏడు నెలలు నిండిన గర్భిణులను గుర్తించి సుఖ ప్రసవాలపై అవగాహన కల్పించి వసతి గృహాలకు తీసుకొచ్చేవారు. ప్రసవం వరకు వారిని అక్కడే ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. ముగ్గురితో మొదలైన ఈ వసతి గృహం.. స్వల్ప వ్యవధిలోనే వంద శాతం ఆక్యుపెన్సీ సాధించింది. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో గుమ్మలక్ష్మీపురంలోనూ మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా 100 మందికి రెండు వసతి గృహాలను అందుబాటులో ఉంచారు. దాంతో ఆ ప్రాంతంలో మాతాశిశు మరణాలు తగ్గాయి. నీతిఅయోగ్ బృందం పర్యటించి ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శమంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీటిని సందర్శించి.. మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటుచేయాలని సూచించారు.
సర్వే నిలిపేశారు...
ఆదివాసీ బిడ్డలకు మేలు చేసేదైతే తనకేమీ... తెదేపా ప్రభుత్వంలో ఏర్పాటయిందా? ఇక అంతే. దాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం ఎలా చేయాలని మాత్రమే చూస్తారు. ఈ నాలుగేళ్లలో అదే చేశారు. సాధారణంగా గిరిశిఖర గ్రామాల్లో ఉండే మహిళలకు గర్భం దాల్చాక ఎన్నో నెలలో ఉన్నారన్న విషయంలో కచ్చితమైన అవగాహన ఉండదు. ఈ కారణంగా క్రమం తప్పకుండా చేయాల్సిన పరీక్షల్లోనూ జాప్యం ఉంటుంది. ప్రసవ సమయం దగ్గరైతే ప్రమాదంలో పడే మహిళలు ఎందరో. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకే ఏడు నెలలు గర్భిణులను చేర్చడానికి క్రమం తప్పకుండా సర్వేలు చేయించింది. జగన్ అధికారంలోకి రాగానే ఈ సర్వే ఆగిపోయింది. దీంతో వారిని వసతి గృహాలకు తీసుకువచ్చే ఏర్పాట్లు నిలిచిపోయాయి. రోజూ వారిని పరీక్షించేందుకు వసతి గృహాల్లో ప్రత్యేక వైద్యుడు లేరు.
కొత్తవి ఏర్పాటు చేసుంటే...
ఈ రెండు వసతి గృహాల ఏర్పాటు తర్వాత మాతాశిశు మరణాలు చాలావరకు తగ్గాయి. ఇప్పటివరకు 3210 మంది సేవలు వినియోగించుకున్నారు. జగన్కు నిజంగా అమాయక గిరిజనులకు మేలు చేసే ఆలోచనే ఉంటే... వీటిని విస్తరించేవారు. పాడేరు, రంపచోడవరం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గిరిశిఖర గ్రామాలకు అనుబంధంగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తే.. డోలీ మోతల నడమ గర్భిణులూ, శిశువుల మరణాలూ తగ్గించొచ్చు. కానీ జగన్ నాలుగున్నరేళ్ల కాలంలో ఆ దిశగా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు.
పోషకాహారం... అందడం లేదు!
గిరిజన గర్భిణులకు తెదేపా ప్రభుత్వం ఫుడ్ బాస్కెట్ పథకం ద్వారా వసతి గృహాల్లోనే పోషకాహారం కింద ఖర్జూరం, చిక్కీలు, నువ్వుల ఉండలు, మందులు అందించేది. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలు చేస్తున్నా... అది వసతి గృహాల్లో ఉండే గర్భిణులకు సక్రమంగా అందడం లేదు.
మరుగుదొడ్లను బాగు చేయించలేరా?
రెండు చోట్లా మరుగుదొడ్లు వినియోగంలో లేవు. సాలూరులో నీటి సరఫరా పైపు మరమ్మతులకు గురైతే దాన్ని బాగు చేయించకుండా మేడపైన ఉన్న మరుగుదొడ్లను వినియోగించుకోవాలని గర్భిణులకు సూచిస్తున్నారు. మెట్లు ఎక్కి వెళ్లడానికి ఆందోళన చెందుతున్నారు. గుమ్మలక్ష్మీపురంలో సహాయకుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఈ రెండు చోట్లా బాగుచేయించేందుకు రూ.3 లక్షలకు మించి అవ్వదు. రెండు చోట్లా సోలార్ విద్యుత్తు పలకలు అప్పట్లో ఏర్పాటు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్వహణ పడకేసింది. ఇక అంతే రెండు చోట్లా మూలకు చేరాయి. జనరేటర్ సదుపాయమూ లేదు. రాత్రిళ్లు కరెంటు పోతే చీకట్లో ఉండాల్సిందే.
జీతాలు ఆపేశారు...
ఇక్కడ సేవలు అందిచేందుకు ఏఎన్ఎమ్లను తెదేపా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. వీరి సేవలు అవసరం లేదంటూ వైకాపా ప్రభుత్వం గతేడాది తొలగించేందుకు ప్రయత్నించింది. దీంతో 50 శాతం వేతనంతో పనిచేసే అంగీకారంతో కొనసాగించారు. ఏడాదిగా ఆ వేతనాల్నీ పెండింగ్లో పెట్టింది. ఇక్కడ సిబ్బందికి రెండేళ్లుగా జీతాల్లేవ్. ఇది పొమ్మనకుండా పొగబెట్టడంకాక మరేంటి! గర్భిణుల వసతి గృహాల పట్ల జగన్ ఎంత కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నారో.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
మూలకు చేరిన అంబులెన్స్లు
ప్రారంభంలో ప్రతి వసతి గృహానికి ఒక అంబులెన్స్ను కేటాయించారు. దీని ద్వారా వైద్య పరీక్షలు అవసరమైన గర్భిణులను రోజూ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి మళ్లీ వసతి గృహానికి తీసుకొచ్చేవారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది ఉపయుక్తంగా ఉండేది. సాలూరు వసతి గృహానికి కేటాయించిన అంబులెన్స్ ఇటీవల మరమ్మతులకు గురైంది. దాన్ని బాగు చేయకుండా సమీపంలోని తోణాం పీహెచ్సీకి చెందిన వాహనాన్ని కేటాయించారు. అదీ కూడా పాడైంది. ప్రస్తుతం 108 వాహనాలూ, ఆటోల్లో గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. అంబులెన్సుల మరమ్మతులకు అయ్యే ఖర్చు రూ.2 లక్షలలోపే. బాగు చేయాలని ప్రభుత్వానికి నివేదించినా పట్టింపులేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం