మునిగేది రైతన్న.. ముంచేది ఎవరన్న?
మొన్న ఏం జరిగింది? నిన్న దాని ప్రభావం ఏమిటి? నేడు ఎలా ముందుకెళ్లాలి... అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.
పంటకాలం ముందుకు జరపడంలో తీవ్ర నిర్లక్ష్యం
జూన్లోనే నాట్లు వేసేలా అవగాహన కల్పించడంలో విఫలం
కాల్వల్లో ముందుకు సాగని జలాలు.. ఆలస్యంగా నాట్లు
కోతల సమయంలో విరుచుకుపడుతున్న తుపాన్లు
ఏటా రూ.వేల కోట్లు నష్టపోతున్న రైతులు
మొన్న ఏం జరిగింది? నిన్న దాని ప్రభావం ఏమిటి? నేడు ఎలా ముందుకెళ్లాలి... అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ముఖ్యంగా కోట్ల మంది ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించే ప్రభుత్వాలకు ఇలాంటి ఆలోచన, ప్రణాళిక అత్యంత అవసరం. రాష్ట్రాన్ని ఏలుతున్న జగన్ ప్రభుత్వానికి దురదృష్టవశాత్తు ఈ ముందుచూపు కరవైంది. ఆయన ఏలుబడిలో యువతకు ఉపాధి చూపే పారిశ్రామిక రంగమైనా, ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే వ్యవసాయ రంగమైనా... నిర్లక్ష్యానికి గురవడం సాధారణ విషయంగా మారిపోయింది.
ఎందుకంటే...
వానలను తట్టుకుని, వరదలను దాటుకుని అన్నదాతలు... ఒకటికి రెండుసార్లు నాట్లేసినా.. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి విరుచుకుపడుతున్న తుపాన్లు వారికి ఏటా రూ.వందల కోట్ల నష్టాన్ని మిగులుస్తుండటమే ఇందుకు తాజా ఉదాహరణ. సాధారణంగా నవంబరు, డిసెంబర్లలో తుపాన్లు వస్తుంటాయి. ఈలోగా వరి కోతలు పూర్తి చేయించగలిగితే... రైతుల్ని భారీ నష్టం నుంచి కాపాడవచ్చు. వైకాపా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచనే చేయడం లేదు. రైతుల్లో అవగాహన కల్పించడం లేదు. సర్కారు వైఫల్యం కారణంగానే ప్రస్తుత ఏడాది కూడా 60% పైగా పంట నేల కొరిగింది. నూర్పిడి చేసి ఒడ్డుకు చేర్చిన లక్షల టన్నుల ధాన్యం తడిసింది. పది, పదిహేను రోజుల ముందే కోతలు ముగిసి ఉంటే ఈ నష్టం తప్పేదని రైతులు వాపోతున్నారు.
...అయితే అమలు చేయబోమంతే!
తుపాన్లతో జరుగుతున్న నష్టాలను నివారించడానికి గత ప్రభుత్వం... పంట కాలాన్ని ముందుకు జరపాలని నిర్ణయించింది. రైతుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జూన్లోనే నీటిని విడుదల చేయడం ప్రారంభించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సైతం పూర్తి చేసింది. అన్నదాతలు ఆ ఫలాలను అందుకునే సమయంలోనే వైకాపా ప్రభుత్వం వచ్చింది. పంటకాలంపై గత ప్రభుత్వ ప్రణాళికలను పక్కన పెట్టేసింది. నాలుగేళ్లుగా వాటి ఆచరణ లేదు. ఏదో మొక్కుబడిగా నీటిని విడుదల చేసి... చేతులు దులిపేసుకుంటోంది. ముందే నీటిని ఇస్తున్నామని ఘనంగా ప్రకటనలు చేయడం తప్పితే.. కాల్వల నిర్వహణకు నిధులివ్వడం లేదు. అంతిమంగా రైతుల్ని తుపాన్ల సుడిగుండాల్లోకి నెట్టేస్తోంది. ఏటా పంట దిగుబడులు నీళ్లలో నానుతున్నా పట్టనట్లు ఉంటోంది.
నారుమడి స్థాయి నుంచి దినదినగండమే
గోదావరి, కృష్ణా డెల్టాల వరి రైతులు ఏటా తుపాన్ల బారిన పడుతున్నారు. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టినా.. పంట చేతికి వచ్చే వరకు దినదినగండమే. చాలాసార్లు ఖరీఫ్ ఆరంభం నుంచి వరదలు ముంచెత్తుతుండటంతో జులైలో నారుమళ్ల దశలోనే మునుగుతున్నాయి. దీంతో మరోసారి నారు పోసుకోవాల్సి వస్తోంది. ఆగస్టులో నాట్లు వేసినా.. ఇంకోసారి వరద ముంచుతోంది. మళ్లీ ఎక్కడోచోట నారు తెచ్చి నాట్లు వేస్తున్నారు. మూడు నెలలపాటు పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాక... డిసెంబరులో కోతలు మొదలవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయానికి తుపాన్లు వచ్చి అన్నదాతల కష్టార్జితాన్ని నీట ముంచుతున్నాయి. ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని, అవసరాలు తీర్చుకోవచ్చనే గంపెడాశతో ఉంటున్న రైతులకు... కనీసం పశువుల మేతకైనా గడ్డి దక్కని దుస్థితి ఎదురవుతోంది.
నవంబరు నాటికే కోతలు పూర్తయ్యేలా...
అధిక శాతం తుపాన్లు నవంబరు, డిసెంబరు నెలల్లోనే వస్తున్నాయి. ఈలోగా వరి కోతలు పూర్తి చేసుకుంటే రైతులను నష్టాల బారి నుంచి తప్పించవచ్చు. ఈ ఆలోచనతోనే గత ప్రభుత్వం గోదావరి, కృష్ణా డెల్టాలకు నీటి విడుదలపై 2017 సంవత్సరంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. వెంటనే నారు పోసుకుంటే జులైలో నాట్లు పూర్తి చేసుకోవచ్చు. నవంబరులోగా వరి కోతలు పూర్తవుతాయి. దీంతో రైతులను తుపాన్ల నుంచి కాపాడవచ్చు. పంటకాలాన్ని ముందుకు జరపాలనే లక్ష్యంతోనే గత ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సైతం పూర్తి చేసి, జూన్లోనే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసింది.
రబీపైనా ప్రభావం
ఖరీఫ్ కోతలు ఆలస్యం అవుతున్న ప్రభావం రబీ నాట్లపైనా పడుతోంది. ఈ నాట్లు కూడా ఆలస్యం అవుతుండటంతో... ఏప్రిల్, మే నెలల్లో రబీ వరి కోతకొస్తోంది. అప్పుడు కూడా అకాల వర్షాలు ముంచేస్తున్నాయి. దాంతో ఖరీఫ్, రబీ రెండు పంటల్ని నష్టపోతున్నామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. 2023 రబీని పరిశీలిస్తే... ఏప్రిల్ ఆఖరు నుంచి మే మొదటి వారం వరకు 18 జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంది. సాధారణం కంటే 300% అధికంగా వానలు కురిశాయి. దీంతో ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యం తడిచింది. కొనేందుకు మిల్లర్లు సతాయించారు. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. రైతులు భారీగా నష్టపోయారు. ఇలా ఏటా కనీసం ఒక పంట అయినా దెబ్బతింటోంది. ముందే నారు పోసి, నాట్లు వేసేలా అన్నదాతలకు అవగాహన కల్పించడంతోపాటు కాల్వల నిర్వహణకు నిధులిస్తే వారిని నష్టాల నుంచి బయట పడవేయవచ్చనే విషయాన్ని వైకాపా సర్కారు విస్మరిస్తోంది.
కాల్వల నిర్వహణ లేక.. నిధులూ ఇవ్వక...
తాము అధికారంలోకి వచ్చాక జూన్లోనే నీటిని విడుదల చేస్తున్నామని జగన్ ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. అయితే అత్యంత కీలకమైన కాల్వల మరమ్మతులను విస్మరించింది. వాటి నిర్వహణకు నిధులు కూడా ఇవ్వడం లేదు. అవి ఎక్కడికక్కడే పూడికతో నిండిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ కారణంగానే గతేడాది డెల్టాలో పంట విరామం కూడా ప్రకటించడం గమనార్హం. కొన్నిచోట్ల రైతులే సొంత నిధులను ఖర్చు పెట్టి అక్కడక్కడ మరమ్మతులు చేయించుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం జూన్ 1న నీరు విడుదల చేసినా... కాల్వల్లో పూడిక కారణంగా పొలాలకు చేరేసరికి నెల రోజులకుపైగా సమయం పడుతోంది. ఫలితంగా జులైలో నారు పోసి, ఆగస్టులో నాట్లు వేస్తున్నారు. నవంబరు నెలాఖరుకు, డిసెంబరులో కోతల సమయానికి తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. పంటంతా నీటిపాలై... పెట్టుబడులు దక్కక అన్నదాతలు నష్టపోతున్నారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాలో నీరిచ్చినా చివరి భూములకు చేరలేదు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం