ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి ఎట్టకేలకు విడుదల చేసింది.

Updated : 07 Dec 2023 06:44 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 411 పోస్టులకు గాను 18,637 మంది అర్హత సాధించినట్లు ప్రకటించింది. పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంచినట్లు తెలిపింది. తుది రాతపరీక్షకు సంబంధించిన పేపర్‌-3, పేపర్‌-4 సమాధాన పత్రాలను ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. సందేహాలకు 9441450639, 9100203323 ఫోన్‌ నెంబర్లు సంప్రదించాలని ఈ మేరకు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ బుధవారం ప్రకటన విడుదల చేశారు.

పరీక్షలో 18,637 మంది అర్హత

ఎస్సై ఉద్యోగాలకు మొత్తం 1,51,288 మంది ప్రాథమిక రాత పరీక్ష రాశారు. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా.. 31,193 మంది తుది రాతపరీక్షకు ఎంపికయ్యారు. చివరి పరీక్షలో 18,637 మంది అర్హత సాధించారు. ప్రతిభావంతుల జాబితా రూపొందించి రోస్టర్‌ ప్రకారం మెరిట్‌లో నిలిచిన 411 మందిని పోస్టులకు ఎంపిక చేయనున్నారు. దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని