జగనన్న కాలనీలా.. చెరువులా?
‘ఇళ్లు కాదు...అవి ఊళ్లు’...జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన అనుచరగణమంతా చెప్పే మాటే ఇది. ఆ ఊళ్లను ఎంత సురక్షితంగా కడుతున్నారో....ఒక్క వర్షం వస్తే ఇట్టే తెలిసిపోతోంది.
రూ.2,200కోట్లు వెచ్చించినా ముంపు సమస్యే..
ఒక్క వర్షానికే నీట మునిగిన జగనన్న కాలనీలు
ఈనాడు - అమరావతి
‘ఇళ్లు కాదు...అవి ఊళ్లు’...జగనన్న కాలనీలపై ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన అనుచరగణమంతా చెప్పే మాటే ఇది. ఆ ఊళ్లను ఎంత సురక్షితంగా కడుతున్నారో....ఒక్క వర్షం వస్తే ఇట్టే తెలిసిపోతోంది. చాలా లేఅవుట్లలో ఇళ్ల మధ్యకు చెరువులనే తెచ్చేశారు. కాలనీల మీదుగానే వరద నీటినీ పారిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఎవరైనా ఎంత వర్షపాతం నమోదైందో తెలుసుకోవాలంటే అక్కడున్న జగనన్న కాలనీలకు వెళితే ఇట్టే అర్థమయ్యేలా అవి ఉన్నాయి.
మెరక పనులకు రూ.2,200కోట్లు వెచ్చించినా..
కాలనీల్లో మెరక పనుల కోసం ఏకంగా రూ.2,200 కోట్లు వెచ్చించారు. అయినా వాటికి ముంపు సమస్య తప్పలేదు. ఈ పనుల్ని చేసింది చాలా వరకు జగన్ అనుచరగణమే. ఇళ్లు కట్టడం పూర్తికాకుండానే వాటిని నీటిలో ముంచుతూ లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చిరుజల్లులకే వాన నీరు చేరుతోంది. కాలనీల్లో మెరక, చదును కోసం అత్యధిక నిధులను ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే వినియోగించారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతాల్లో మెరక చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
చేతులేత్తేసిన జగన్ సర్కార్..
చాలా లేఅవుట్లలో మెరక చేయడం, అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణ పనులను వైకాపా నేతలకే కట్టబెట్టారు. వారు నాసిరకంగా పనులు కానిచ్చేశారు. చిన్నపాటి వర్షాలకే మెరక చెదిరిపోయి ఆ రహదారులన్నీ గతుకుల మయంగా మారాయి. ఇలాంటి కాలనీల్లో మళ్లీ మెరక చేయాలని జిల్లా అధికారుల నుంచి చాలా కాలంగా ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసమే దాదాపు రూ.100 కోట్లపైగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కిమ్మనకుండా ఉన్నారు.
జలకాలనీ కాదు.. జగనన్న కాలనీనే
ఈ చిత్రం చూస్తే వర్షపు నీటిపైన పునాదులు కడుతున్నారా అన్నట్టుగా ఉంది కదా? జగన్ పాలన అంటే ఆ మాత్రం ప్రత్యేకత ఉండాలి కదా? ఇది 2020 డిసెంబర్ 25న స్వయంగా జగనే శంకుస్థాపన చేసిన కాలనీ. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఉంది. 350 ఎకరాల్లో 16 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మెరక చేసేందుకే రూ.70 కోట్లు ఖర్చు పెట్టారు. మెరక ఎటు పోయిందో....అందు కోసం వెచ్చించిన రూ.70 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో జగన్కే తెలియాలి? ఇప్పటికి 400 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
ఇళ్ల మధ్యనే తటాకం
జగన్ పాలనలో జగనన్నకాలనీల్లో ఇళ్ల మధ్యనే చెరువులు కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే ఏలూరు జిల్లా కైకలూరులోని జగనన్న లేఅవుట్. సరైన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. కాలనీలో నివశిస్తున్న ప్రజలు బయటకు రావాలన్నా, లోపలికి వెళ్లాలన్నా అవస్థలు పడుతున్నారు.
బేస్మెంట్లే కొట్టుకుపోతున్నాయ్....
ఈ చిత్రం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలోని ఇళ్ల నిర్మాణాల దుస్థితిని తెలియజేస్తోంది. వర్షపు నీరంతా ఇలా నిర్మాణాల మీదుగానే పారుతోంది. ఫలితంగా బేస్మెంట్లు ఇలా కొట్టుకుపోతున్నాయి. వేసిన మట్టి రహదారుల పరిస్థితీ ఇదే.
ఈ రహదారులపై ఆదమరిస్తే అంతే సంగతులు
ఏమాత్రం ఆదమరిచినా కాలు జారి కిందపడేలా ఉన్న ఈ రోడ్లు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు జగనన్న కాలనీలోనివి. ఈ కాలనీలో దాదాపుగా 100 కుటుంబాలకుపైగా ఉంటున్నాయి. మేత కోసం కాలనీలోకి గొర్రెలను పంపిస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది చూసి మిగతా లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు వెనుకాడుతున్నారు.
వరద నీరు పారుతున్న ఈ జగనన్న కాలనీ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోనిది. ఇక్కడ 70 మందికి ఇళ్లు మంజూరుచేశారు. నిర్మాణాలు పూర్తిచేసుకుని గత ఆరు నెలలుగా 12 కుటుంబాలు నివసిస్తున్నాయి. అన్ని నెలలుగా అక్కడ లబ్ధిదారులు నివసిస్తుంటే మౌలిక సదుపాయాలైనా కల్పించాలనే కనీస ధ్యాసైనా ప్రభుత్వానికి లేకుండా పోయింది. అందుకే సిమెంటు రహదారులు, మురుగునీటి కాల్వలు నిర్మించలేదు. ఫలితంగా ఇదిగో ఇలా వర్షపునీరు కాలనీలోకి పోటెత్తి లబ్ధిదారులను ఇక్కట్లపాలుజేసింది.
ఇది కాలనీయా.. చెరువా?
ఈ చిత్రం చూపించి....కనిపిస్తున్నది చెరువా? జగనన్న కాలనీనా అని చిన్నపిల్లాడిని అడిగినా చెరువే అని ఠక్కున సమాధానం చెబుతారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఇలాంటి చోటును జగన్ కేటాయించారు. పైగా రాష్ట్రంలోనే అతి పెద్ద లేఅవుట్లలో ఇదీ ఒకటి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కరగ్రహారంలో ఉంది. 16 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. స్థలాలు అయితే ఇచ్చారేగానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా చిన్నపాటి వర్షం పడినా ఇలా చెరువులా మారుతుంది. దీంతో కాలనీలో సగం విస్తీర్ణం సరిహద్దురాళ్లకే పరిమితమైంది.
కృష్ణా జిల్లా గొడవర్రు వద్ద పంట పొలాల మధ్య కంకిపాడు మండలానికి చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వాన పడినప్పుడల్లా పొలాల్లోని నీరంతా ఇలా కాలనీలోకి చేరుతోంది. వేసిన రహదారులు ఎప్పుడో కరిగిపోయాయి. లేఅవుట్లోకి వెళ్లాలంటే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూశారా ఎలాంటి చోట లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారో జగన్..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్