‘ఎన్నికల ముంగిట్లో..’ గ్రూపు-2 ముచ్చట!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది.
ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్.. నోటిఫికేషన్ జారీ
మెయిన్స్, నియామకాలు కొత్త ప్రభుత్వంలోనే..
గ్రూపు-1 ప్రకటన ఇవ్వక అభ్యర్థుల తికమక
‘వయోపరిమితి’పరంగా 50 వేలమంది అనర్హులు
ఈనాడు, అమరావతి: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. మెయిన్స్ (ప్రధాన పరీక్ష) తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే మెయిన్స్ జరుగుతుందన్నమాట. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వారికి.. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. ఇవన్నీ జరిగి.. ఎంపికైన వారు విధుల్లో చేరేందుకు చాలా సమయమే పడుతుంది. ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయంలో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
2021 జూన్లో జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించిన గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువడేందుకు రెండేళ్ల అయిదు నెలల వరకు సమయం పట్టింది. దీనివల్ల సుమారు 50 వేల మంది వరకు వయోపరిమితి కోల్పోయి ఉంటారని అంచనా. ఈ నోటిఫికేషన్ అనుసరించి సుమారు 5 లక్షలమంది నిరుద్యోగులు దరఖాస్తు చేస్తారు. ‘నిరుద్యోగులకు గుడ్న్యూస్.. నోటిఫికేషన్ వస్తుంది’ అంటూ ఆగస్టు నుంచి ఏపీపీఎస్సీ సభ్యుడొకరు ‘ఎక్స్’ వేదికగా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పటికి అది వచ్చింది.
‘నోటిఫికేషన్’ల జారీలో ‘రివర్స్’
ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను గత నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబరు 1న వెల్లడించింది. అప్పుడే గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 900 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. కానీ, నోటిఫికేషన్లో మాత్రం దీనికి 897 పోస్టులే ఉన్నాయి. మొదట గ్రూపు-1 నోటిఫికేషన్ జారీచేసి, పరీక్షల తేదీలు ప్రకటిస్తే.. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్దమవుతారు. గ్రూపు-1 పోస్టులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రూపు-2 ఇవ్వడం వల్ల అభ్యర్థులు సన్నద్ధతకు ఇబ్బందులు పడతారు. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమ్స్ సన్నద్ధతకు 80 రోజుల వరకే సమయం ఉంది. అదే యూపీఎస్సీ 2023 సివిల్స్ నోటిఫికేషన్ జారీ జరిగినప్పటి నుంచి పరీక్ష జరిగే వరకు 117 రోజుల వరకు సమయం లభించింది.
గాలిలోంచి పోస్టులు సృష్టించారా?
గత 2021 జూన్లో జారీచేసిన క్యాలెండర్ ద్వారా గ్రూపు-1, గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. చివరికి గ్రూపు-1 కింద 110, గ్రూపు-2 కింద 182 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ 2022 మార్చి 31న ఆర్థికశాఖ జీఓ జారీ చేసింది. దీని ప్రకారం.. 2022 సెప్టెంబరులో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇచ్చింది. నియామకాలు జరిగాయి. గ్రూపు-2 నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు. ప్రకటించిన గ్రూపు-2 182 పోస్టులు కూడా తక్కువేనని నిరుద్యోగులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 25న ‘గ్రూపు-1, గ్రూపు-2 కింద 100, 900 చొప్పున పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ కింద ప్రకటించిన పోస్టులు ఇప్పటికిప్పుడు గాలిలో నుంచి కొత్తగా సృష్టించలేదు. ప్రభుత్వం వద్ద ఖాళీల జాబితా సిద్ధంగా ఉంది. కానీ.. భర్తీ చేయడం ఇష్టం లేకనే. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసింది. మరోపక్క.. పోస్టుల భర్తీలో కీలకమైన రోస్టర్ పాయింట్స్, పే స్కేలు వివరాలు నోటిఫికేషన్లో లేవు.
ఈ నోటిఫికేషన్లు ఇస్తారా? ఇవ్వరా?
గ్రూపు-1 కింద ప్రకటించిన 88 పోస్టులతోపాటు డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు-267, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు-99, టీటీడీ డీఎల్, జేఎల్-78, జూనియర్ కళాశాలల అధ్యాపకులు-47, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్-38, ఇంగ్లిష్ రిపోర్టర్స్ (ఏపీ లెజిస్లేచర్ సర్వీస్)-10, గ్రంథపాలకులు (కళాశాల విద్య)-23, ఏపీఆర్ఈఐ సొసైటీ కింద జేఎల్, డీఎల్ పోస్టులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ ఆఫీసర్, మెడికల్ ఎడ్యుకేషన్, భూగర్భ నీటిపారుదల శాఖ, జిల్లా సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఏపీ మున్సిపల్ ఎకౌంట్స్ సబ్ సర్వీసెస్లో జూనియర్ ఎకౌంట్ ఆఫీసర్ కేటగిరీ-2, సీనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-3, జూనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-4, ఇతర శాఖల్లో మరికొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని పేర్కొన్న ఏపీపీఎస్సీ గురువారం కేవలం గ్రూపు-2 మాత్రమే జారీచేసి, మిగిలిన నోటిఫికేషన్ల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.
21 నుంచి దరఖాస్తుల స్వీకరణ
గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. గ్రూపు-2 నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 21 నుంచి స్వీకరిస్తారు. జనవరి 10 వరకు స్వీకరణ జరుగుతుంది. సిలబస్, ఇతర వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి